AP 3 Capitals: 3 రాజధానులపై మళ్లీ బిల్లు
శాసనసభ సమావేశానికి టీ విరామం ప్రకటించిన స్పీకర్... వరదలపై సీఎం జగన్ సమీక్ష.. అంతలోనే అత్యవసర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారంటూ సమాచారం.. సీఎం అధ్యక్షతన మంత్రివర్గ భేటీ జరుగుతుండగానే.....
ప్రస్తుత చట్టాలను ఉపసంహరించుకున్న రాష్ట్ర ప్రభుత్వం
పాత సీఆర్డీఏ చట్టం అమల్లోకి..
ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన
ఆమోదించిన శాసనసభ
4గంటల్లోనే చకచకా పరిణామాలు
ఈనాడు - అమరావతి
అనూహ్య పరిణామాలు...
4 గంటలపాటు తీవ్ర ఉత్కంఠ..
చివరకు 3 రాజధానుల బిల్లును ఉపసంహరిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన
సమగ్ర వివరాలతో మళ్లీ బిల్లు తెస్తామన్న సీఎం జగన్
ఇవీ సోమవారం ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న పరిణామాలు..
శాసనసభ సమావేశానికి టీ విరామం ప్రకటించిన స్పీకర్... వరదలపై సీఎం జగన్ సమీక్ష.. అంతలోనే అత్యవసర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారంటూ సమాచారం.. సీఎం అధ్యక్షతన మంత్రివర్గ భేటీ జరుగుతుండగానే.. మూడు రాజధానుల చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేయనుందని హైకోర్టుకు తెలిపిన అడ్వకేట్ జనరల్.. ఈ కీలక పరిణామాలన్నీ సుమారు నాలుగు గంటల వ్యవధిలోనే చకచకా జరిగిపోయాయి. మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టం రద్దు చట్టాల్ని ఉపసంహరించుకోబోతున్న విషయం ఏ మాత్రం బయటకు పొక్కకుండా ప్రభుత్వం జాగ్రత్తపడింది. మంత్రివర్గం అత్యవసరంగా ఎందుకు సమావేశమైందన్న ఉత్కంఠ కొనసాగుతుండగానే ఉదయం 11.30 గంటల సమయంలో రెండు చట్టాల రద్దు గురించి ఏజీ హైకోర్టుకు తెలియజేశారు. సచివాలయంలో సుమారు 11.50కి మంత్రివర్గ సమావేశం ముగిసింది. మధ్యాహ్నం 2 గంటలకు శాసనసభ తిరిగి ప్రారంభమైన కాసేపటికే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ఆంధ్రప్రదేశ్కి మూడు రాజధానులు (ఆంధ్రప్రదేశ్ పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి) ఏర్పాటు చేస్తూ 2020లో తీసుకొచ్చిన చట్టాన్ని, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్డీఏ) రద్దు చట్టాన్నీ ఉపసంహరించుకుంటూ బిల్లు ప్రవేశపెట్టారు. సభాపతి తమ్మినేని సీతారాం సూచన మేరకు దానిలో ముఖ్యాంశాల్ని వివరిస్తూ ప్రసంగించారు.
అనంతరం .. మూడు రాజధానుల అవసరాన్ని ప్రజలకు వివరించి, మరింత సమగ్రంగా మెరుగైన బిల్లు ప్రవేశపెట్టేందుకే ఆ రెండు చట్టాల్ని ఉపసంహరించుకుంటున్నామని సీఎం జగన్ ప్రకటించారు. ఆ వెంటే మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లును ఆమోదిస్తున్నట్లు సభాపతి ప్రకటించారు. మండలి ఆమోదం కూడా పొందాక దాన్ని గవర్నర్కు పంపనున్నారు. మరోవైపు మూడు రాజధానుల చట్టాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుందన్న వార్త రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించగా... ఆశావహ దృక్పథంతో కనిపించిన అమరావతి రైతులు వికేంద్రీకరణపై మెరుగైన బిల్లు ప్రవేశపెడతామన్న ప్రభుత్వ ప్రకటనతో నిరుత్సాహపడ్డారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించేవరకూ రెట్టించిన ఉత్సాహంతో ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
తాజా బిల్లులో ఏముందంటే..
2014లో ఆమోదించిన సీఆర్డీఏ చట్టం మళ్లీ అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తాజా బిల్లులో పేర్కొంది. ‘అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఏఎంఆర్డీఏ)కి చెందిన అన్ని రకాల ఆస్తులు, అప్పులు సీఆర్డీఏకి బదిలీ అవుతాయి. ఈ చట్టం అమల్లోకి వచ్చిన వెంటనే.. ప్రస్తుతం ఏఎంఆర్డీఏలో ఉన్న ఉద్యోగులంతా సీఆర్డీఏ ఉద్యోగులుగా మారిపోతారు’ అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి పేర్కొన్నారు. ‘భాగస్వాములు (స్టేక్హోల్డర్స్) అందరితో మరోసారి సంప్రదింపులు జరిపేందుకు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల ఆకాంక్షల్ని పరిగణనలోకి తీసుకుని, చట్ట నిబంధనల్ని మరింత మెరుగుపరుస్తూ మరోసారి వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు వీలుగా.. ఇంతకుముందున్న రెండు చట్టాల్ని ప్రభుత్వం రద్దు చేస్తోంది. బహుళ రాజధానుల ద్వారా పాలనా వికేంద్రీకరణ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం వెనకున్న సదుద్దేశాల్ని అందరికీ వివరిస్తాం’ అని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సర్వతోముఖాభివృద్ధిని సాధించేందుకు, శ్రీబాగ్ ఒప్పందంలోని హామీల్ని నెరవేర్చేందుకు, ఉత్తరాంధ్ర వంటి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, ప్రాంతీయ ఉద్యమాల్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం అప్పట్లో మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు చట్టాల్ని తీసుకొచ్చిందన్నారు. అదే సమయంలో రాజధాని ప్రాంతంలోని ప్రజల ప్రయోజనాల్నీ కాపాడేందుకు ఆ చట్టాల్లో చర్యలు తీసుకున్నామన్నారు. కానీ భాగస్వాముల అభిప్రాయాన్ని వినిపించేందుకు తగిన అవకాశం ఇవ్వలేదంటూ ఆ చట్టాలపై చాలా ఫిర్యాదులు వచ్చాయని, కోర్టుల్లో కేసులు నమోదయ్యాయని బుగ్గన పేర్కొన్నారు. ఆ నేపథ్యంలోనే మరింత సమగ్రంగా బిల్లు ప్రవేశపెట్టేందుకు.. ఆ చట్టాల్ని రద్దు చేస్తున్నామని వెల్లడించారు.
బిల్లు నుంచి బిల్లు దాకా..
2014 సెప్టెంబరు 3: రాజధాని ప్రాంతాన్ని నిర్ణయిస్తూ శాసనసభ తీర్మానం
2014 డిసెంబరు 23: ఏపీసీఆర్డీఏ చట్టాన్ని ఆమోదించిన శాసనసభ
2019 డిసెంబరు 17: మూడు రాజధానుల్ని ప్రతిపాదిస్తూ శాసనసభలో సీఎం జగన్ ప్రకటన
2020 జనవరి 20: మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లుల్ని ఆమోదించిన అసెంబ్లీ
2020 జూన్ 16: ఆ రెండు బిల్లుల్ని మళ్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం పొందిన ప్రభుత్వం
2021 నవంబరు 22: కొత్త బిల్లు తెస్తామంటూ.. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు చట్టాల్ని ఉపసంహరిస్తూ శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ నేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు