ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది.
ఉద్యోగులకు సరెండర్ లీవ్స్ నగదు చెల్లింపు
ఒక్కొక్కరి ఖాతాలో రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు జమ
ఇన్నాళ్లూ వేధించి.. ఇప్పుడు బుజ్జగింపులా?
మిగిలిన బకాయిల సంగతేంటని ఉద్యోగుల ప్రశ్న
ఈనాడు, అమరావతి: ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. ఉద్యోగులకు సరెండర్ లీవుల బకాయిలను హడావుడిగా చెల్లిస్తోంది. పోలీసులతో పాటు కొన్ని కేటగిరీల ఉద్యోగుల ఖాతాల్లో గురు, శుక్రవారాల్లో బకాయిలు జమయ్యాయి. ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వేయగా, ఎన్నికల్లోపే మిగతా వారి ఖాతాల్లోనూ వేసే అవకాశముంది. ఇన్నాళ్లూ తమపై కక్షగట్టి, హక్కులను కాలరాసి, స్వేచ్ఛను హరించి, గొంతు నొక్కేసిన ప్రభుత్వం.. ఎన్నికల ముందు ఎర వేస్తోందా అని ఉద్యోగ సంఘాల నేతలే ప్రశ్నిస్తున్నారు. ‘మాలోని ఆగ్రహం ఎన్నికల్లో దెబ్బతీస్తుందని గ్రహించే, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుంది. మాకు హక్కుభుక్తంగా రావాల్సిన సరెండర్ లీవ్ సొమ్ములనే విడుదల చేసి, ఏదో లబ్ధి చేకూర్చినట్లుగా భ్రమ కల్పిస్తోంది. న్యాయబద్ధమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ మేం ఎప్పటి నుంచో గొంతు చించుకుని అరుస్తున్నా పట్టించుకోలేదు. పైగా మా ఆందోళనలు, ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచివేసింది’ అని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. ‘మాకు రావాల్సిన బకాయిలు చాలా ఉన్నాయి. సుమారు రూ.17 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉండగా, అవన్నీ పెండింగ్లో పెట్టింది. సరెండర్ లీవుల బకాయిలు మాత్రమే చెల్లిస్తోంది. అదీ అందరికి ఒకేసారి ఇవ్వకుండా, విడతల వారీగా రోజుకు కొందరి ఖాతాల్లో వేయడం దేనికి సంకేతం?’ అని ఉద్యోగ సంఘం నేత ఒకరు ప్రశ్నించారు.
రూ.17 వేల కోట్ల మాటేంటి?
ఉద్యోగులకు ప్రభుత్వం మొత్తంగా రూ.17 వేల కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. డీఏ, పీఆర్సీ బకాయిలు రూ.7,500 కోట్లు రావాలి. వీటిని 2027లోగా దశల వారీగా చెల్లిస్తామని నోటి మాటగా చెప్పడమే తప్ప ఉత్తర్వులు ఇవ్వలేదు. అంటే ఆ బాధ్యతను వచ్చే ప్రభుత్వంపైకి నెట్టేసింది. టీఏ, డీఏ బకాయిలు రూ.274 కోట్ల వరకు ఉన్నాయి. సరెండర్ లీవుల బకాయిలు రూ.2,250 కోట్లు ఉండగా, వీటిలో పోలీసులకు చెల్లించాల్సిన సొమ్మే రూ.500 కోట్లు. 2021-22 నాటికి పెండింగ్లో ఉన్న బకాయిలు మరో రూ.300 కోట్లు. మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు రూ.118 కోట్లు విడుదల చేయలేదు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించిన సీపీఎస్ మొత్తాన్ని ప్రాన్ ఖాతాకు జమ చేయాల్సినవి సుమారు రూ.933 కోట్లు ఉన్నాయి. సీపీఎస్, పెన్షనర్లకు నగదు రూపంలో డీఏ బకాయిలు రూ.2,100 కోట్లు చెల్లించాల్సి ఉంది. 2022లో ఇవ్వాల్సిన రెండు డీఏల బకాయిలు కలిపి రూ.4,500 కోట్లు ఉన్నాయి.
ఐదేళ్లుగా కాల్చుకు తిని, ఇప్పుడు బుజ్జగింపులు:
- గతంలో ఎప్పుడూ లేనంతగా జగన్ సర్కారు ఉద్యోగులను పలురకాలుగా వేధించింది. 11వ పీఆర్సీలో మోసగించింది. మధ్యంతర భృతి(ఐఆర్) 27 శాతముంటే, దానిలో 4% తగ్గించి 23% ఫిట్మెంట్ ఇచ్చింది. ఉద్యోగులు ఐఆర్తో పొందిన జీతం కంటే ఫిట్మెంట్తో తీసుకున్న జీతం తగ్గిపోవడం చరిత్రలో తొలిసారి.
- ఇంటి అద్దె భత్యంలోనూ కోత పెట్టింది. రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు గత ప్రభుత్వహయాంలో 30 శాతమున్న హెచ్ఆర్ఏను 24 శాతానికి తగ్గించింది. జిల్లా కేంద్రాల్లో 20 శాతమున్న హెచ్ఆర్ఏను 16 శాతానికి కుదించింది.
- 11వ పీఆర్సీ సిఫారసు చేసిన పేస్కేళ్లను పూర్తిస్థాయిలో అమలు చేయకుండానే 12వ పీఆర్సీ వేసింది. 2023 జులై నుంచే కొత్త పీఆర్సీ అమలు కావాలి. ఆలస్యమైనందున ఐఆర్ ఇవ్వాలి. ఆ గడువు దాటి 10 నెలలైనా ఇప్పటికీ ఐఆర్ ప్రకటించలేదు.
- ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలపై ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం చేసిన దాష్టీకాలకు అంతేలేదు. పీఆర్సీ అంశంపై 2022 ఫిబ్రవరి 3న ఉద్యోగులు చేపట్టిన చలో విజయవాడ ఆందోళనను అడ్డుకునేందుకు తీవ్రంగా యత్నించింది. లక్షల మంది ఉద్యోగులు బీఆర్టీఎస్ రహదారిని దిగ్బంధించడంతో కంగుతిన్న ప్రభుత్వం.. అనేక మందిని అరెస్ట్ చేసి, కేసులు పెట్టింది. నాటి నుంచే ఉద్యోగులపై కక్షగట్టింది.
- ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు, వైకాపా నాయకులు ఉద్యోగులను అవమానాలకు గురిచేశారు. ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద క్యూలైన్లకు కాపలా ఉంచి, మరుగుదొడ్లు కడిగించి అవమానించారు.
ఎన్నికల వేళ ఓట్ల కోసం ప్రేమ కురిపిస్తే, ఇన్నాళ్లూ ఎదుర్కొన్న వేధింపులను మర్చిపోతామా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ‘ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రూ.17 వేల కోట్లకుపైగా ఉన్న బకాయిలను పూర్తిగా ఎందుకు చెల్లించడం లేదు? కోడ్ అమలులో ఉన్నప్పుడు బకాయిల విడుదల అంటే.. ఉద్యోగులను ప్రలోభపెట్టే చర్యేనని వారికీ తెలుసు’ అని విపక్ష నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
జగన్ భయపడ్డారా?
ఐదేళ్లుగా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పెడచెవిన పెట్టిన జగన్కు ఇప్పుడు భయం పట్టుకుందా? ఉద్యోగులంతా వైకాపాకు వ్యతిరేకంగా పనిచేస్తే ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు తప్పవన్న ఆందోళనలో ఉన్నారా? అందుకే... ఇంత హైరానా పడుతున్నారా? ఇన్నాళ్లూ లెక్కలేనట్టు ప్రవర్తించిన సీఎంకు ఇప్పుడు ఒక్కసారిగా వారిపై ప్రేమ పుట్టుకురావడానికి ఆ భయమే కారణమా? అందుకే సరెండర్లీవ్ల బకాయిలు చెల్లించి మంచి చేసుకోవాలనుకుంటున్నారా? అన్న చర్చ ఉద్యోగవర్గాల్లో జరుగుతోంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అనేక డిమాండ్లు, వేల కోట్ల బకాయిల గురించి ఇన్నాళ్లూ పట్టించుకోని ముఖ్యమంత్రికి ఇప్పుడు హఠాత్తుగా సరెండర్లీవుల బకాయిలు గుర్తొచ్చాయంటే అది ముమ్మాటికీ ఎన్నికల మహిమేనన్న అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది. పెండింగ్లో ఉన్న మొత్తం బకాయిల్ని చెల్లించకుండా, కేవలం సరెండర్ లీవుల డబ్బులు ఇచ్చినంత మాత్రాన పెద్దగా ఒరిగేదేమీ లేదన్న అభిప్రాయం వారిలో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముందుచూపుతో ప్రజల్ని నడిపించే దార్శనికులు రావాలి
పౌరులు ధైర్యంగా ప్రభుత్వాల్ని ప్రశ్నించగలిగినప్పుడే ప్రజాస్వామ్యం మనగలుగుతుందని సామాజికవేత్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై భౌతికదాడులు సర్వసాధారణంగా మారాయని, వారికి పథకాలు నిలిపివేయడం.. -
ఉద్యోగాలు సృష్టించే వారికే ఓటేయాలి
‘హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం అక్కడి మౌలిక వసతులే. అటువంటి పరిస్థితులు ఏపీలో కనిపించడం లేదు. కనీసం రోడ్లు కూడా సరిగ్గా లేవు. అన్ని వసతులు కల్పిస్తేనే పెట్టుబడులు వస్తాయి. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు నేనే ప్రత్యక్ష బాధితుడిని
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు తానే ప్రత్యక్ష బాధితుడినని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేశ్ తన ఎక్స్ ఖాతాలో సోమవారం ట్వీట్ చేశారు. చనిపోయిన తన తల్లిదండ్రులకు చెందిన కృష్ణా జిల్లా విన్నకోటలోని పట్టాభూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారని పేర్కొన్నారు. -
ఎన్నికలు పూర్తయ్యే వరకూ.. నిధుల విడుదల వాయిదా
రైతులకు పెట్టుబడి రాయితీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకు అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ పంపిన ప్రతిపాదనలను ఎన్నికల సంఘం తిరస్కరించింది. -
రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. -
‘బిల్లుల చెల్లింపులపై విచారణ జరిపించండి’
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక.. మొదట బిల్లులు అప్లోడ్ అయిన గుత్తేదారులకు తొలుత చెల్లింపు విధానం(ఫిఫో) పాటించలేదని, దీనిపై విచారణ జరిపించాలని స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ (సబ్కా) కోరింది. -
ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు ప్రకటన జారీ
ట్రిపుల్ ఐటీ కళాశాలలో అర్హులైన అభ్యర్థుల నుంచి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ఆర్జీయూకేటీ కులపతి కేసీ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!
-
పెద్దల మాట
-
జగన్ కోసం.. ఎంతకైనా దిగజారుతా
నువ్వు ఇంతకంటే దిగజారవనుకునే ప్రతిసారీ నా నమ్మకం తప్పని నిరూపిస్తున్నావు అంటూ జెర్సీ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డికి అది అతికినట్టుగా సరిపోతుంది. -
మద్యం మహమ్మారికి ‘జగన్ ముద్దులు’
‘‘నాలుగు సంవత్సరాల్లో మద్యపానాన్ని పూర్తిగా తీసేయాలన్న కసి నాలో ఉంది’’ అని తన తండ్రి సమాధి సాక్షిగా చెప్పిన జగన్మోహన్రెడ్డి - సీఎంగా చేసిందేంటి? కాపురాలను కూల్చే మద్యం మహమ్మారిని కసికసిగా ముద్దుచేశారు. -
వైకాపా వీరభక్త అమ్మిరెడ్డిపై వేటు
వైకాపా సేవే పరమావధిగా, ఆ పార్టీ నేతలు చెప్పిందే వేదంగా భావిస్తూ విధులు నిర్వర్తించిన మరో ‘ఎస్ బాస్’పై ఎన్నికల సంఘం వేటు వేసింది. -
నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. -
గోడు విన్నా.. ‘గోల్డ్’ ఇవ్వలే!
ఓ సంస్థ చేసిన మోసంతో వారు అప్పటికే పీకలతు మునగగా ఆ బాధితులను జగన్ నిండాముంచారు. అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని, వాటికి వేలం వేసి బాధితులకు న్యాయం చేస్తామని పూటకో మాట మార్చారు. తలమీద చెయ్యివేసి గోడు వింటుంటే.. ఇక తమ కష్టాలు గట్టెక్కినట్లేనని బాధితులు ఎంతో ఆశపడ్డారు. -
ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యల నేపథ్యంలో సినిమాలు తీసే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
8 ఏళ్ల ప్రేమ.. వివాహమైన వెంటనే పారిపోయిన భర్త
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!