నన్ను అంతమొందించేందుకు కుట్ర

తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్‌ నేషనల్‌ పార్టీ (జేబీఎన్‌పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Published : 27 Apr 2024 05:06 IST

జేబీఎన్‌పీ అధ్యక్షుడు వి.వి.లక్ష్మీనారాయణ

ఈనాడు, విశాఖపట్నం: తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్‌ నేషనల్‌ పార్టీ (జేబీఎన్‌పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం విశాఖ సిటీ పోలీస్‌ కమిషనర్‌ రవిశంకర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ‘నేను సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు అనధికార మైనింగ్‌పై గాలి జనార్దన్‌రెడ్డిని విచారించాను. ఆ సమయంలో ఆయనకు సన్నిహితుడిగా ప్రచారంలో ఉన్న నంబాల రాజేష్‌కుమార్‌ కూడా విచారణ ఎదుర్కొన్నారు. ‘నా బాస్‌ గాలి జనార్దన్‌రెడ్డిని లక్ష్మీనారాయణ చాలా ఇబ్బంది పెట్టారు. ప్రతీకారం తీర్చుకుని మా బాస్‌కు బహుమతి ఇస్తాను. నాకు కేకే రాజు అండగా ఉంటారు’ అంటూ ఇటీవల జరిగిన ఓ సమావేశంలో నంబాల రాజేష్‌ అందరి ముందు బాహాటంగానే మాట్లాడారు. విశ్వసనీయ సమాచారం అందగానే జరుగుతున్న పరిణామాలను తెలియజేయడం నా బాధ్యతగా భావించాను’ అంటూ సీపీకి ఇచ్చిన లేఖలో లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కేకే రాజు, గాలి జనార్దన్‌రెడ్డితో నంబాల రాజేష్‌కుమార్‌ ఉన్న ఫొటోలను ఆ లేఖకు జత చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని