29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్లకు ఉన్నత విద్యామండలి సమాచారం
వైకాపాతో అంటకాగుతూ లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నాలు
ఈనాడు, అమరావతి: వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. విశ్వవిద్యాలయాల్లోని అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియపై సమావేశం నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి సిద్ధమైంది. అన్ని వర్సిటీల రిజిస్ట్రార్లకు సమాచారం పంపింది. ఈనెల 29న ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించే నియామక ప్రక్రియ సమావేశానికి సంబంధించిన సమాచారంతో రావాలంటూ ఆదేశాలు ఇచ్చింది. విమర్శలు వ్యక్తమవుతున్నా వైకాపాకు లబ్ధి చేకూర్చేందుకు ఉన్నత విద్యామండలిలోని కీలక వ్యక్తి ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 18విశ్వవిద్యాలయాల్లో 3,220 పోస్టుల భర్తీకి అక్టోబరు 30న వర్సిటీల వారీగా ప్రకటనలు విడుదలయ్యాయి. 278 బ్యాక్లాగ్ పోస్టులతో పాటు 2,942 రెగ్యులర్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల హేతుబద్ధీకరణ, రిజర్వేషన్ రోస్టర్ విధానంపై అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై వాదనలు జరిగిన సమయంలో వర్సిటీల్లో పోస్టుల భర్తీకి ఇచ్చిన ప్రకటనను వెనక్కి తీసుకోవడంగాని, బ్యాక్లాగ్ పోస్టులను విడదీసి, సవరణ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుందని న్యాయస్థానానికి ప్రభుత్వం తెలిపింది. ఇదే జరిగితే గతంలో ఇచ్చిన ప్రకటనలు రద్దు కానున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ ప్రకటనలు ఇవ్వడం.. బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లపై ఉన్నత విద్యామండలి సమావేశం నిర్వహిస్తోంది. ఎన్నికల సమయంలో ఉద్యోగాల భర్తీకి సమావేశాలు నిర్వహించడం నిరుద్యోగ ఓటర్లను ప్రభావితం చేయడం కోడ్ ఉల్లంఘనే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ కోసం.. ఎంతకైనా దిగజారుతా
నువ్వు ఇంతకంటే దిగజారవనుకునే ప్రతిసారీ నా నమ్మకం తప్పని నిరూపిస్తున్నావు అంటూ జెర్సీ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డికి అది అతికినట్టుగా సరిపోతుంది. -
మద్యం మహమ్మారికి ‘జగన్ ముద్దులు’
‘‘నాలుగు సంవత్సరాల్లో మద్యపానాన్ని పూర్తిగా తీసేయాలన్న కసి నాలో ఉంది’’ అని తన తండ్రి సమాధి సాక్షిగా చెప్పిన జగన్మోహన్రెడ్డి - సీఎంగా చేసిందేంటి? కాపురాలను కూల్చే మద్యం మహమ్మారిని కసికసిగా ముద్దుచేశారు. -
వైకాపా వీరభక్త అమ్మిరెడ్డిపై వేటు
వైకాపా సేవే పరమావధిగా, ఆ పార్టీ నేతలు చెప్పిందే వేదంగా భావిస్తూ విధులు నిర్వర్తించిన మరో ‘ఎస్ బాస్’పై ఎన్నికల సంఘం వేటు వేసింది. -
నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. -
గోడు విన్నా.. ‘గోల్డ్’ ఇవ్వలే!
ఓ సంస్థ చేసిన మోసంతో వారు అప్పటికే పీకలతు మునగగా ఆ బాధితులను జగన్ నిండాముంచారు. అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని, వాటికి వేలం వేసి బాధితులకు న్యాయం చేస్తామని పూటకో మాట మార్చారు. తలమీద చెయ్యివేసి గోడు వింటుంటే.. ఇక తమ కష్టాలు గట్టెక్కినట్లేనని బాధితులు ఎంతో ఆశపడ్డారు. -
ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యల నేపథ్యంలో సినిమాలు తీసే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
8 ఏళ్ల ప్రేమ.. వివాహమైన వెంటనే పారిపోయిన భర్త
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!