వేలంలో కొంటే అది ప్రైవేటు భూమే
బహిరంగ వేలంలో కొనుగోలు చేసిన అసైన్డ్ భూమిని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు నిషేధిత జాబితాలో చేర్చడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. బహిరంగ వేలంలో కొన్నప్పుడు దానిని ప్రైవేటు భూమిగానే చూడాలని, అసైన్డ్గా
స్పష్టం చేసిన హైకోర్టు
ఈనాడు, అమరావతి: బహిరంగ వేలంలో కొనుగోలు చేసిన అసైన్డ్ భూమిని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు నిషేధిత జాబితాలో చేర్చడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. బహిరంగ వేలంలో కొన్నప్పుడు దానిని ప్రైవేటు భూమిగానే చూడాలని, అసైన్డ్గా పరిగణించడానికి వీల్లేదని స్పష్టంచేసింది. నిషేధిత జాబితాలో చేర్చుతూ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చారు. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కొట్రమంగళంలోని వివిధ సర్వే నంబర్లలోని 9 ఎకరాల అసైన్డ్ భూమిని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) బహిరంగ వేలం వేయగా తాము కొన్నామని, వాటిని ప్రభుత్వం నిషేధిత జాబితాలో(22ఏ) చేర్చిందంటూ పి.గీత, మరో ఇద్దరు హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు వేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ‘అసలైన అసైన్డ్దారులు ఆ భూములను పీఏసీఎస్కు తనఖాపెట్టి రుణం పొందారు. తిరిగి చెల్లించనందున వాటి అమ్మకానికి పీఏసీఎస్ బహిరంగ వేలం వేసింది. పిటిషనర్లు కొనుగోలు చేసి, విక్రయ దస్తావేజు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలు పొందారు. నేపథ్యం తెలుసుకోకుండా అధికారులు ఈ భూములను నిషేధిత జాబితాలో చేర్చారు. అసైన్డ్ భూమిని తనఖాపెట్టి, తర్వాత వేలంలో అమ్మినప్పుడు అది ప్రైవేటు భూమి అవుతుందని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింద’ని వాదించారు. ప్రభుత్వ సహాయ న్యాయవాది స్పందిస్తూ.. వేలం నిర్వహించినప్పటికీ అది అసైన్డ్ భూమిగానే ఉంటుందన్నారు.
అధికారుల తీరు అశ్చర్యకరం
ఇరువైపు వాదనలు విన్న న్యాయమూర్తి.. ‘ఓసారి భూమిని అసైన్మెంట్ కింద కేటాయించాక ప్రభుత్వం యజమాని హోదా కోల్పోతుంది. లబ్ధిదారే యజమాని అవుతారు. మళ్లీ ఆ భూమిని చట్ట ప్రకారం స్వాధీనం చేసుకుంటేనే ప్రభుత్వం యజమాని అవుతుంది. ఏపీ అసైన్డ్ భూముల బదిలీ నిషేధ చట్టంలోని సెక్షన్ 2(1), సెక్షన్ 6ను సంయుక్తంగా కలిపి చదివితే.. అసైన్డ్ భూములను సహకార సంఘాలు, బ్యాంకుల్లో తనఖా పెట్టొచ్చని, తీసుకున్న అప్పు చెల్లించకపోతే రుణసంస్థలు ఆ ఆస్తిని అమ్ముకోవచ్చు’ అని పేర్కొన్నారు. ‘గతంలో హైకోర్టు తీర్పు ఇస్తూ రుణం రాబట్టుకునేందుకు పీఏసీఎస్లు, బ్యాంకులు వేలం వేసిన భూములను అసైన్డ్గా పరిగణించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ లెక్కన పిటిషనర్లు కొనుగోలు చేసిన భూములను నిషేధిత జాబితాలో చేర్చడం చట్టవిరుద్ధం’అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ నేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు