మాటల్లోనే ‘నా’.. చేతల్లో ‘నో’
నా.. నా... అని చెప్పిందే చెబుతూ నిత్యం అసత్యాలను జపించే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి.. అసెంబ్లీ, లోక్సభ సీట్ల కేటాయింపుల్లో మాత్రం ‘నా’ వర్గానికే ప్రాధాన్యమని తేల్చేశారు.
నా.. నా.. అనేదంతా ప్రచారానికే.. అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థిత్వాలకు కాదు
సీఎం సొంత సామాజిక వర్గీయులకే 49 అసెంబ్లీ, 5 లోక్సభ సీట్లు
సీమ జిల్లాల్లో 80%పైగా వారికే..
సీట్ల కేటాయింపులో జగన్ ‘సామాజిక న్యాయం’ ఇదే..
25 మంది సిటింగ్లకు టికెట్ల నిరాకరణ.. 15 మందికి బదిలీలు..
ఈనాడు, అమరావతి: నా.. నా... అని చెప్పిందే చెబుతూ నిత్యం అసత్యాలను జపించే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి.. అసెంబ్లీ, లోక్సభ సీట్ల కేటాయింపుల్లో మాత్రం ‘నా’ వర్గానికే ప్రాధాన్యమని తేల్చేశారు. మొదటినుంచీ పార్టీలో, అయిదేళ్లుగా ప్రభుత్వంలో అగ్రతాంబూలం అందుకుంటున్న తన సొంత సామాజిక వర్గానికే మరోసారి పెద్దపీట వేశారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 49, ప్రకటించిన 24 లోక్సభ స్థానాల్లో అయిదు చోట్ల తన సొంత సామాజిక వర్గం వారికే సీట్లు కట్టబెట్టారు. ఉమ్మడి అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో సగటున 80%పైగా సీట్లలో తనవారికే పోటీ చేసే అవకాశమిస్తూ ‘నా’ వాళ్లంటే నా సామాజిక వర్గమేనని తేల్చి చెప్పారు. తాను నిత్యం ప్రవచించే సామాజిక న్యాయానికి ఇడుపులపాయ ఎస్టేట్ సాక్షిగా సమాధి కట్టారు. అనకాపల్లి లోక్సభ స్థానానికి మినహా.. మిగిలిన అన్ని స్థానాలకూ అభ్యర్థుల పేర్లు వెల్లడయ్యాయి. బీసీలకు 48, మహిళలకు 19 సీట్లను కేటాయించామని, 2019 ఎన్నికలనాటితో పోలిస్తే బీసీలకు 7, మహిళలకు 4 చోట్ల అదనంగా సీట్లు ఇచ్చామని నేతలు పేర్కొన్నారు. లోక్సభ స్థానాల్లో బీసీలకు 11, మహిళలకు 5 సీట్లు కేటాయించినట్లు తెలిపారు. ఎస్సీలకు, ఎస్టీలకు రిజర్వుడు స్థానాలు మినహా ఒక్కటీ అదనంగా ఇవ్వలేదు. 25 మంది సిట్టింగ్లకు సీట్లు నిరాకరించారు. 15 మందిని బదిలీచేశారు. ఆరుగురు సిట్టింగుల స్థానంలో వారసులకు అవకాశమిచ్చారు. ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను లోక్సభ స్థానాల నుంచి పోటీ చేయించనున్నారు. తొలిసారి అసెంబ్లీకి పోటీచేసే అవకాశం 46 మందికి దక్కింది.
సీఎం జగన్ చెప్పే సామాజిక న్యాయమిదే..
సీమ జిల్లాల్లో వైకాపా తరఫున పోటీ చేసే అర్హత మరెవరికీ లేదనుకున్నారో, ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారో మరి, ఎక్కువ సీట్లను సొంత సామాజికవర్గానికే ఇచ్చారు. ఉమ్మడి కడప జిల్లాలో జనరల్ సీట్లు 8 ఉంటే.. అందులో 7 చోట్ల తన సామాజిక వర్గీయులనే బరిలో నిలిపారు. అంటే ఇది 87శాతం పైనే. బడుగుల జిల్లా అనంతపురంలో 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా అందులో 12 జనరల్ సీట్లున్నాయి. ఇందులో 8 సీట్లను సీఎం సొంత సామాజికవర్గం వారికి కేటాయించారు. మరో రెండు చోట్ల అభ్యర్థుల భర్తలు, జగన్ సామాజికవర్గం వారే. అయితే ఆ మహిళల ఇద్దరికీ బీసీల కోటాలో ఇచ్చినట్లు లెక్కలో చూపించారు. మొత్తంగా 12 జనరల్ స్థానాల్లో 10 సీట్లు అంటే 83% సొంత సామాజికవర్గానికే. ఉమ్మడి కర్నూలులో 12 జనరల్ సీట్లలో 9 చోట్ల సీఎం జగన్ సొంత సామాజిక వర్గానికే సీట్లు కేటాయించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 11 జనరల్ సీట్లలో 8 చోట్ల తన సామాజిక వర్గీయులనే బరిలో నిలిపారు.
బడుగులకే బదిలీలు
మొత్తంగా 50శాతం సీట్లలో మార్పులు చేశామని సీఎం జగన్ గర్వంగా చెప్పారు. అయితే ఆయన చెప్పిన 50% మార్పుల్లో 90%పైగా బడుగుల సీట్లలో చేసినవే. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా వైకాపా.. పలు స్థానాల్లో తమ పార్టీ ఎమ్మెల్యేలను బదిలీ చేసింది. తాము ప్రాతినిథ్యం వహించే నియోజకవర్గం నుంచి సమన్వయకర్తల పేరుతో మరో నియోజకవర్గానికి పంపింది. ఇందులో అధిక శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలవారే. ఇలా విడతలవారీ మొత్తం 12 జాబితాలను విడుదల చేసింది. తాజాగా అసెంబ్లీ, లోక్సభకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాలను ప్రకటించింది. శాసనసభకు పోటీ చేసే అభ్యర్థుల్లో 53% మంది 46 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు వారున్నారు. అసెంబ్లీ అభ్యర్థుల్లో పట్టభద్రులు, ఆపై విద్యార్హతలున్న వారు 75% మంది ఉన్నారు. గత ఎన్నికల్లో లోక్సభకు పోటీచేసిన వారిలో 18 మందిని వైకాపా మార్చింది. 2019 ఎన్నికల్లో మొత్తం 22 మంది గెలుపొందగా వారిలో ఏడుగురికి మాత్రమే మళ్లీ టికెట్లు దక్కాయి. లోక్సభకు సరైన అభ్యర్థులు దొరక్కపోవడంతో ఉన్నవారితోనే సరిపెట్టుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముందు సీఎస్ చూసి వెళ్లారు.. తర్వాత రౌడీ మూకలొచ్చాయి
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, ఆయన కుమారుడు తాము సాగు చేసుకుంటున్న భూములను మే 20వ తేదీన పరిశీలించాక, త్రిలోక్ ముఠా వాటిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించిందని అన్నవరం, తూడెం గ్రామ రైతులు ఆరోపించారు. -
గుత్తేదార్లకు నిధుల ‘ధార’
వాటర్ గ్రిడ్ టెండర్ల వ్యవహారంలో రాష్ట్ర గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఇంజినీర్లు అడ్డగోలుగా వ్యవహరించారు. జలజీవన్ మిషన్లో భాగమైన రూ.8,690 కోట్ల విలువైన వాటర్ గ్రిడ్ పనులను ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా ఉండే గుత్తేదారు సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టారు. -
మధ్యాహ్నం బాధ్యతలు.. సాయంత్రం విరమణ
జగన్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు, వేధింపులకు గురైన డైరెక్టర్ జనరల్ హోదా కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) చివరికి ఆయన కోరుకున్నట్లుగానే పోలీసు యూనిఫాంలో పదవీ విరమణ చేశారు. -
ప్రజారోగ్యంతో చెలగాటం!
ప్రజారోగ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసింది. ప్రజలు కలుషిత నీరు తాగి.. ప్రాణాలు కోల్పోతున్న ఘటనలే అందుకు నిదర్శనం. విజయవాడ నగరంలో ప్రస్తుతం వరుస అతిసార మరణాలు కలవరానికి గురిచేస్తున్నాయి. -
మన గుడిలో పూజ.. దిల్లీ సంస్థ సేవ!
రాష్ట్రంలో దేవాదాయశాఖకు చెందిన ప్రధాన ఆలయాల్లో నిర్వహించే అన్ని రకాల వర్చువల్ (పరోక్ష) పూజలు, సేవలకు సంబంధించిన టికెట్లను విక్రయించడానికి దిల్లీకి చెందిన సంస్థకు సైతం అనుమతి ఇస్తూ ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
న్యాయవ్యవస్థపై జస్టిస్ శేషసాయి ముద్ర ప్రస్ఫుటం
న్యాయవ్యవస్థపై జస్టిస్ ఏవీ శేషసాయి చెరగని ముద్ర వేశారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ అభినందించారు. -
శ్రీవారి సేవలో కేంద్ర హోంమంత్రి అమిత్షా
తిరుమల శ్రీవారిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా శుక్రవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న హోంమంత్రి అమిత్షా, సోనాల్షా దంపతులకు అర్చకులు, ఈవో ఏవీ ధర్మారెడ్డి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. -
ఇదీ సంగతి!
ఏమైందో ఏమో..! ఎప్పుడూ గలగలా మాట్లాడే మోదీ మౌనంగానూ, ఎల్లప్పుడూ మౌనంగా ఉండే మన్మోహన్ గట్టిగానూ మాట్లాడుతున్నారు..!! -
శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా శుక్రవారం సాయంత్రానికి క్యూలైన్లలో వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి -
విద్యార్థుల ఇళ్లకు ఉపాధ్యాయులు
ఇకపై.. విద్యార్థుల ఇళ్లకు ఉపాధ్యాయులు వెళ్లనున్నారు. ఉపాధ్యాయులు వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులతో బోధన తీరు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించాలంటూ రాష్ట్రప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
తాడిపత్రి అల్లర్ల కేసులో మరో 9 మంది అరెస్టు
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎన్నికల సందర్భంగా జరిగిన రాళ్లదాడి ఘటనలో శుక్రవారం తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు పట్టణ ఎస్సై గౌస్బాషా తెలిపారు. -
కలుషిత నీటితో 8కి చేరిన మృతుల సంఖ్య
అతిసారంతో శుక్రవారం మరో మహిళ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతిచెందారు. విజయవాడ నగరం 64వ డివిజన్కు చెందిన చౌదరి కనకమ్మ(60) వాంతులు విరేచనాలతో ఉదయం మరణించారు. -
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీత రచన పోటీ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర గీతంగా ఉన్న ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ గీతాన్ని గౌరవిస్తూనే దాని స్థానంలో వర్తమాన ఆంధ్రప్రాంత వైభవ స్వాభిమాన గీతాన్ని రూపొందించేందుకు ఐదు నిమిషాల నిడివిగల గీత రచన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. -
రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ డిమాండ్
రోహిణీకార్తె నేపథ్యంలో మండిపోతున్న ఎండలతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. విద్యుత్ వినియోగం 258.34 మిలియన్ యూనిట్ (ఎంయూ)లకు చేరింది. -
పోస్టల్ బ్యాలట్పై నిబంధనల మేరకే ఆ ఉత్తర్వులు
పోస్టల్ బ్యాలట్ ఓట్ల లెక్కింపు సమయంలో ఓటరు డిక్లరేషన్కు సంబంధించిన ‘ఫాం-13ఏ’పై అటెస్టింగ్ అధికారి పేరు, హోదా, సీలు లేకపోయినా పర్వాలేదు, -
సంక్షిప్త వార్తలు (5)
తితిదే ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు హైదరాబాద్కు చెందిన అక్షత్ గ్రీన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత వివేక్ కైలాష్, విక్రమ్ కైలాష్ కుటుంబసభ్యులు రూ.1.5 కోట్లను విరాళంగా అందించారు.
తాజా వార్తలు (Latest News)
-
92 ఏళ్లలో తొలిసారి ఓటు.. వృద్ధుడి ఆనందం!
-
సీఎంఆర్ అల్యూమినియం పరిశ్రమలో 50 మంది కార్మికులకు అస్వస్థత
-
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్లో నేడు ఓటింగ్..
-
రూ.10 కోట్లు ఇస్తామన్నా ఆ ప్రకటన చేయనన్న అల్లు అర్జున్
-
తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టికెట్లు విడుదల
-
ఏ విషయమైనా.. ఎవరికీ అతిగా చెప్పేందుకు ప్రయత్నించను: జస్ప్రీత్ బుమ్రా