బాణసంచా పేలుళ్లకు బెదిరి.. వృద్ధురాలిని పొడిచిన ఆవు

వైకాపా నాయకులు కాల్చిన బాణసంచా ఒక వృద్ధురాలు గాయపడటానికి కారణమైంది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు నగర పంచాయతీ పరిధిలోని రామాపురం సంఘం కాలనీలో కావలి ఎమ్మెల్యే సమీప బంధువు మన్నెమాల సుకుమార్‌రెడ్డి తన అనుచరులతో ఆదివారం రాత్రి ప్రచారం నిర్వహించారు.

Published : 06 May 2024 05:08 IST

వైకాపా ఎన్నికల ప్రచారంలో ఘటన

అల్లూరు, న్యూస్‌టుడే: వైకాపా నాయకులు కాల్చిన బాణసంచా ఒక వృద్ధురాలు గాయపడటానికి కారణమైంది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు నగర పంచాయతీ పరిధిలోని రామాపురం సంఘం కాలనీలో కావలి ఎమ్మెల్యే సమీప బంధువు మన్నెమాల సుకుమార్‌రెడ్డి తన అనుచరులతో ఆదివారం రాత్రి ప్రచారం నిర్వహించారు. అందులో భాగంగా భారీగా బాణసంచాను కాల్చారు. ఆ శబ్దాలకు బెదిరిన ఓ ఆవు పరుగులు పెట్టడంతో అక్కడ ఉన్న వారంతా పరుగులు తీశారు. మానికల మార్తమ్మ అలియాజ్‌ రమణమ్మ (70) అనే వృద్ధురాలు తప్పించుకోలేకపోవడంతో ఆమెను ఆవు పొడిచింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని వైకాపా నాయకులు నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి కారులో తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని