సమస్యలపై ప్రశ్నించినందుకు నిండు గర్భిణిపై వైకాపా నేతల దాడి

స్థానిక సమస్యలపై ప్రశ్నించడంతో గర్భిణి అని కూడా చూడకుండా వైకాపా నేతలు ఓ మహిళపై దాడికి పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన మేరకు.. ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ కుటాగులోళ్లపల్లిలో తంబళ్లపల్లె వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి...

Published : 06 May 2024 06:14 IST

భార్యాభర్తలను చంపేస్తామని బెదిరింపు

మదనపల్లె, న్యూస్‌టుడే: స్థానిక సమస్యలపై ప్రశ్నించడంతో గర్భిణి అని కూడా చూడకుండా వైకాపా నేతలు ఓ మహిళపై దాడికి పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన మేరకు.. ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ కుటాగులోళ్లపల్లిలో తంబళ్లపల్లె వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి సతీమణి కవితమ్మ ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అందులో భాగంగా స్థానికుడైన మల్లికార్జున అనే వ్యక్తి ఇంటికి వెళ్లి వైకాపాకు ఓటు వేయాలని అభ్యర్థించారు. తమ వీధిలో కనీసం వీధిలైట్లు కూడా ఏర్పాటు చేయలేదని, చీకటిలో బయట తిరగలేకపోతున్నామని ఆయన భాార్య కళ్యాణి ప్రస్తావించారు. దీంతో ఆగ్రహించిన వైకాపా నేతలు మొదట మల్లికార్జునపై దాడికి దిగారు. అడ్డుకోబోయిన కళ్యాణిని కడుపుపై కాలితో తన్నారు. అస్వస్థతకు గురైన ఆమెను 108 వాహనంలో మదనపల్లె ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితురాలు మాట్లాడుతూ... తన భర్త మల్లికార్జునను, తనను చంపేస్తామని వైకాపా నాయకులు హెచ్చరించారని వాపోయారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి వచ్చారని తెలియగానే వైకాపా శ్రేణులు మరోసారి దాడికి పాల్పడేందుకు యత్నించాయి. పోలీసులు వారిని నిలువరించడంతో వెనక్కు వెళ్లిపోయారని గ్రామస్థులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని