SBI: ఎస్‌బీఐ యూజర్లకు అలర్ట్‌.. ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సేవలకు అంతరాయం!

ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) ఇంటర్నెట్‌ సేవలకు శనివారం కొద్ది గంటల పాటు అంతరాయం ఏర్పడనుంది.

Updated : 10 Dec 2021 21:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) ఇంటర్నెట్‌ సేవలకు శనివారం కొద్ది గంటల పాటు అంతరాయం ఏర్పడనుంది. ఈ సమయంలో ఎస్‌బీఐ ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సేవలతో పాటు యోనో, యోనో లైట్‌, యూపీఐ సేవలు సైతం నిలిచిపోతాయని ఎస్‌బీఐ తెలిపింది. శనివారం రాత్రి 11.30 గంటల నుంచి ఆదివారం వేకువ జామున 4.30 వరకు (300 నిమిషాలు) ఈ సేవలు నిలిచిపోనున్నట్లు ఎస్‌బీఐ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో వెల్లడించింది.

సాంకేతిక అప్‌గ్రేడేషన్‌ ప్రక్రియలో భాగంగా సేవలకు అంతరాయం ఏర్పడుతోందని ఎస్‌బీఐ పేర్కొంది. మెరుగైన బ్యాంకింగ్‌ సేవలు అందించే ఈ ప్రయత్నంలో కలుగుతున్న ఈ అసౌకర్యానికి సహకరించాలని ఖాతాదారులను ఎస్‌బీఐ కోరింది. దేశవ్యాప్తంగా ఎస్‌బీఐకి 22వేల బ్యాంక్‌ శాఖలు, 57,889 ఏటీఎం కేంద్రాలు ఉన్నాయి. అక్టోబర్‌ 8న సైతం ఇదే తరహాలో మెయింటెనెన్స్‌లో భాగంగా ఎస్‌బీఐ ఇంటర్నెట్‌ సేవలకు కొద్ది గంటల పాటు అంతరాయం ఏర్పడింది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని