కొత్త జంటకు సరికొత్త బహుమతి
పెళ్లిళ్ల వేళ కల్యాణ మండపాలు వెలిగిపోతున్నాయి. అదే సమయంలో వధూవరుల మోమున కాంతిని మరింత పెంచాలంటే వారికి తగిన బహుమతి ఇవ్వాలి. ఏమివ్వాలి అని ఆలోచించే బదులు.
ఆన్లైన్ గిఫ్ట్కార్డుల జోరు
మారుతున్న ధోరణి
దిల్లీ: పెళ్లిళ్ల వేళ కల్యాణ మండపాలు వెలిగిపోతున్నాయి. అదే సమయంలో వధూవరుల మోమున కాంతిని మరింత పెంచాలంటే వారికి తగిన బహుమతి ఇవ్వాలి. ఏమివ్వాలి అని ఆలోచించే బదులు.. ఆన్లైన్ గిఫ్ట్కార్డులిస్తే వారికి ఇష్టమైన పద్ధతిలో వినియోగంచుకుంటారు కదా అనే ధోరణి ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. కొత్త జంటలు పెళ్లి అనంతరం చేసే విహార యాత్రలకు ఉపకరించే ‘షాగున్’ కార్డుల విక్రయాలు ఈ పెళ్లిళ్ల సీజను(డిసెంబరు 2022-జనవరి 2023)లో ఏకంగా 30 శాతం పెరగడం చూస్తుంటే.. ధోరణి మారిందనే అనిపిస్తోంది. తమ స్నేహితులు, బంధువులు, సహోద్యోగుల పెళ్లి బహుమతిగా ఇవ్వడానికి వీటిపైనే ఎక్కువ మంది దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా రూ.10,000 కార్డు ఎక్కువగా విక్రయమైంది. ఆ తర్వాతి స్థానాల్లో రూ.5,000; రూ.1,000 కార్డులున్నాయి. వీటితో దంపతులు హాలిడే ప్యాకేజీలు, హోటళ్లు, విమాన, రైలు, బస్సు టికెట్ల వంటివి కొనుగోలు చేయడానికి వీలుంటుంది.ఆన్లైన్ గిఫ్ట్ కార్డుల విక్రయానికి, పెళ్లిళ్ల సీజనుకు మంచి అనుబంధం కనిపిస్తోందని మేక్మైట్రిప్ అంటోంది. గతంలో నగదు లేదా బంగారం వంటివాటిపైనే ఎక్కువ మొగ్గుచూపే ప్రజలు ఇపుడు గిఫ్ట్ కార్డుల వైపుచూస్తున్నారని అన్నారు.
తమ సర్వేలో ఏం తేలిందని ఆయన అంటున్నారంటే..
* 45-55 ఏళ్ల వయసుండే ఎగ్జిక్యూటివ్లు తమ స్నేహితులు లేదా బంధువులకు గుర్తుండిపోయే బహుమతి ఇవ్వాలని భావిస్తున్నారు.
* 30-45 వయసున్న యువత మాత్రం ట్రెండీగా ఉండాలని భావిస్తున్నారు. అయితే ఆన్లైన్ గిఫ్ట్ కార్డుల వైపు ఈ రెండు వర్గాల వారు చూస్తున్నారు.
* 47 శాతం మంది గిఫ్ట్కార్డు కొనుగోలుదార్లు తమ బహుమతికి అదనంగా రూ.1ని జత చేస్తున్నారు.
* ముంబయి, దిల్లీ, బెంగళూరు, చెన్నై, పుణెల్లో ఈ కార్డుల విక్రయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
* పట్నా, జయపుర వంటి నగరాల్లోనూ ఈ ధోరణి పెరుగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.25,000 కోట్ల పెట్టుబడులకు అవకాశం
ద్విచక్ర వాహనాలు, బస్సులు మనదేశంలో ఈవీ (విద్యుత్తు వాహన) పరిశ్రమకు చోదక శక్తిగా మారుతున్నాయి. -
టెస్లా పవర్పై టెస్లా దావా
భారత్కు చెందిన ఒక కంపెనీ తమ పేరును వినియోగిస్తూ, వినియోగదారుల్లో గందరగోళ సృష్టిస్తోందని ఆరోపిస్తూ, దిల్లీ హైకోర్టులో అమెరికా విద్యుత్ వాహన (ఈవీ) దిగ్గజం టెస్లా దావా వేసింది. -
కొత్త పల్సర్ ఎన్ఎస్400జెడ్
యువతను ఆకట్టుకునే లక్ష్యంతో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో సరికొత్త పల్సర్ ఎన్ఎస్400జెడ్ ను విపణిలోకి శుక్రవారం విడుదల చేసింది. -
క్యాపిటా ల్యాండ్కు హైదరాబాద్లో 25 లక్షల చ.అ. కార్యాలయ స్థలం
స్థిరాస్తి సేవల సంస్థ ఫినిక్స్ గ్రూపు, హైదరాబాద్లోని హైటెక్ సిటీ సమీపంలో నిర్మిస్తున్న 25 లక్షల చదరపు అడుగుల వాణిజ్య భవనాన్ని కేపిటా ల్యాండ్ ఇండియా ట్రస్ట్ అనే సంస్థ కొనుగోలు చేయనుంది. -
ఎంఆర్ఎఫ్ తుది డివిడెండ్ రూ.194
టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్, మార్చి త్రైమాసికంలో రూ.396 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేసింది. -
39% తగ్గిన అదానీ గ్రీన్ ఎనర్జీ లాభం
అదానీ గ్రూప్నకు చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్), మార్చి త్రైమాసికంలో రూ.310 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. -
గోద్రేజ్ ప్రాపర్టీస్ రికార్డు అమ్మకాలు
గోద్రేజ్ గ్రూప్నకు చెందిన స్థిరాస్తి సంస్థ గోద్రేజ్ ప్రాపర్టీస్, మార్చి త్రైమాసికంలో గతంలో ఎన్నడూ లేనంతగా రూ.471.26 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
గరిష్ఠాల నుంచి వెనక్కి
సూచీల గరిష్ఠ స్థాయుల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో శుక్రవారం సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ముగిశాయి. టెలికాం, యంత్ర పరికరాలు, టెక్ షేర్లు డీలాపడటంతో సెన్సెక్స్ 74,000 పాయింట్ల దిగువకు చేరింది. -
నరేశ్ గోయల్కు బెయిల్ ఇవ్వొద్దు.. ఈడీ
మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్, వైద్య ప్రాతిపదికన మధ్యంతర బెయిల్ కోరడాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం వ్యతిరేకించింది. -
అంతరిక్ష కార్యకలాపాలకు నిధులు
మనదేశంలో అంతరిక్ష రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలకు నిధులు సమకూర్చడానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏబీబీ) సుముఖంగా ఉంది. -
యాపిల్ ఆదాయాల్లో రెండంకెల వృద్ధి
భారతదేశంలో మార్చి త్రైమాసికంలో రికార్డు ఆదాయాన్ని నమోదుచేసినట్లు అమెరికా దిగ్గజ సంస్థ యాపిల్ ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు( 8)
సిగ్నిటీ టెక్నాలజీస్లో 54% వాటా కొంటున్న కోఫోర్జ్ లిమిటెడ్, ఇప్పుడు ఆ సంస్థ వాటాదార్లకు ‘ఓపెన్ ఆఫర్’ జారీ చేసింది. -
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ భారత్లో పెద్దఎత్తున ఖాతాలపై చర్యలు చేపట్టింది. ఒక్క 2024 తొలి త్రైమాసికంలోనే ఏకంగా 2.23 కోట్ల ఖాతాలపై నిషేధం విధించింది.