కార్పొరేట్ ఫలితాలు.. అమెరికా వడ్డీరేట్లే కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్కు దిశానిర్దేశం చేయొచ్చంటున్నారు.
అంతర్లీనంగా సానుకూలతలు
ఔషధ, లోహ, వాహన షేర్లు పెరగొచ్చు
ఐటీ స్క్రిప్లకు ప్రతికూలతలు
మహారాష్ట్ర దినం సందర్భంగా మార్కెట్లకు మే1న సెలవు
స్టాక్ మార్కెట్
ఈ వారం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్కు దిశానిర్దేశం చేయొచ్చంటున్నారు. ఎంపిక చేసిన షేర్లు, రంగాల్లో కదలికలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా మే 1న సెలవు కావడంతో, మార్కెట్లు ఈవారం 4 రోజులే పనిచేయనున్నాయి. నిఫ్టీ-50కి తక్షణ మద్దతు 22,200 వద్ద ఉండగా.. స్వల్పకాలానికి 22,800 నిరోధంగా మారొచ్చని సాంకేతిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వారమూ కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు బలహీనపడొచ్చు. గత వారాంతంలో వెలువడ్డ హెచ్సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర దిగ్గజ సంస్థల ఫలితాల ప్రభావమూ ఉంటుంది. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..
- ఇటీవలి సానుకూల సంకేతాల మధ్య ఔషధ కంపెనీలు రాణించొచ్చని అంచనా. విశ్లేషకులు సన్ఫార్మాపై ‘బేరిష్’గా, సిప్లా, దివీస్పై సానుకూలంగా ఉన్నారు.
- టెలికాం షేర్లు సానుకూల ధోరణిలో ఊగిసలాడొచ్చు. భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా షేర్లు రోలోవర్ కావడం ఇందుకు దోహదం చేయొచ్చు. ఎఫ్పీఓకు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో వొడాఫోన్పై విశ్లేషకులు ‘బులిష్’గా ఉన్నారు.
- బ్యాంకు షేర్లు చాలా తక్కువ శ్రేణిలో ట్రేడవవచ్చు. శనివారం వెలువడిన ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, యెస్ బ్యాంక్ల ఫలితాల ప్రభావం సోమవారం ఉండొచ్చు. బ్యాంక్ నిఫ్టీ 48,500 పాయింట్ల పైన ముగిస్తేనే 49,000-49,500 వరకు వెళ్లొచ్చు.
- సిమెంటు షేర్లు ఒక శ్రేణికి లోబడి చలించొచ్చు. సోమవారం వెలువడే అల్ట్రాటెక్ ఫలితాలు ఈ రంగానికి దిశానిర్దేశం చేయొచ్చు. ఈ నెల మొదట్లో కంపెనీలు ప్రకటించిన ధరల పెంపులు ఇంకా ప్రభావం చూపలేదు.
- లోహ కంపెనీల షేర్లలో సానుకూల చలనాలు కనిపించొచ్చు. సెయిల్, హిందాల్కోలపై కన్నేయడం మంచిదని ఒక బ్రోకరేజీ సూచిస్తోంది.
- ఐటీ షేర్లు నష్టపోయే అవకాశం ఉంది. దిగ్గజ కంపెనీల ఫలితాలన్నీ మార్కెట్ అంచనాలను అందుకోలేకపోవడం ఇందుకు కారణం.
- చమురు కంపెనీల షేర్లు రాణించొచ్చు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెద్దగా పెరగకపోవచ్చన్న బలమైన అంచనాలు ఇందుకు దోహదం చేయొచ్చు.
- యంత్ర పరికరాల షేర్లు పెరగొచ్చు. అయితే లాభాలు పరిమితంగానే ఉండొచ్చు. పశ్చిమాసియా ప్రభావం ఈ రంగంపై పెద్దగా ఉండదనే అంటున్నారు.
- నెలవారీ విక్రయాలు, ఫలితాలు బాగుండడంతో వాహన కంపెనీల షేర్లు సానుకూల ధోరణిలో ట్రేడవవచ్చు. ఏప్రిల్ నెల అమ్మకాల గణాంకాలు బుధవారం వెలువడనున్నాయి.
- నెస్లే ఒక్కటే మార్కెట్ అంచనాలను మించి ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో, ఎఫ్ఎమ్సీజీ షేర్లు ఒక శ్రేణికి లోబడే కదలాడొచ్చు.
నేటి బోర్డు సమావేశాలు: అల్ట్రాటెక్ సిమెంట్, టాటా కెమికల్స్, ట్రెంట్, యూకో బ్యాంక్, బిర్లాసాఫ్ట్, కెన్ ఫిన్ హోమ్స్, ఫెడ్బ్యాంక్ ఫైనాన్షియల్, కేఫిన్ టెక్నాలజీస్, జిలెట్, కేపీఐటీ టెక్నాలజీస్, పీఎన్బీ హౌసింగ్, పూనావాలా ఫిన్కార్ప్, షాపర్స్స్టాప్, స్పందన స్ఫూర్తి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 400 పాయింట్లు కుంగిన సెన్సెక్స్
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 404 పాయింట్ల నష్టంతో 72,260 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 105 పాయింట్లు కుంగి 21,949 దగ్గర కొనసాగుతోంది. -
ఇంధన కంపెనీలకు లాభాలే లాభాలు!
ప్రభుత్వ రంగ ఇంధన రిటైల్ కంపెనీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్)లు 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ.81,000 కోట్ల భారీ లాభాలు ఆర్జించాయి. -
2024-25లో అదానీ ఎంటర్ప్రైజెస్
అదానీ ఎంటర్ప్రైజెస్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.80,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు కంపెనీ డిప్యూటీ ముఖ్య ఆర్థిక అధికారి (సీఎఫ్ఓ) సౌరభ్ షా వెల్లడించారు. -
లాభాలు రావొచ్చు కానీ..
గత వారంలో కొద్ది రోజుల పాటు నష్టపోయిన సూచీలు ఈ వారం తిరిగి పుంజుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే సార్వత్రిక ఎన్నికల ఫలితాల ముందు అప్రమత్తతతో పాటు విదేశీ మదుపర్లు స్థిరంగా విక్రయాలు జరుపుతుండడం వల్ల లాభాలు పరిమితంగానే కనిపించొచ్చని అంటున్నారు. -
పసుపు ప్రతికూలమే!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.73,460 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.74,193, రూ.75,499 వరకు రాణించే అవకాశం ఉంటుంది. -
71,816 దిగువన దిద్దుబాటు!
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ గత వారం మన మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అంచనాలపై అనిశ్చితి, కంపెనీలు ప్రకటించిన ఆర్థిక ఫలితాలు నిరుత్సాహపర్చడం ఇందుకు కారణమయ్యాయి. -
నియామకాల్లో 85% ఇంజినీరింగ్ పట్టభద్రులకే
ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో దేశీయ అతి పెద్ద బ్యాంక్ ఎస్బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)లో చేరబోయే 12,000 మంది తాజా ఉత్తీర్ణుల్లో 85 శాతం మంది ఇంజినీరింగ్ పట్టభద్రులే ఉంటారని బ్యాంక్ ఛైర్మన్ దినేశ్ ఖరా వెల్లడించారు. -
భారత్తో ద్వైపాక్షిక వాణిజ్యంలో అమెరికాను వెనక్కినెట్టిన చైనా
గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో భారత్కు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది. తద్వారా ఇప్పటివరకు ఆ స్థానంలో ఉన్న అమెరికాను వెనక్కినెట్టింది. -
సీఎన్జీ కార్ల అమ్మకాలు 30 శాతానికి పైగా పెరగొచ్చు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024-25) తమ సీఎన్జీ కార్ల అమ్మకాలు 30 శాతానికి పైగా పెరిగి 6 లక్షల వాహనాలుగా నమోదయ్యే అవకాశం ఉందని మారుతీ సుజుకీ అంచనా వేస్తోంది. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమాన సేవల పునరుద్ధరణ
టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ తన విమాన సేవలను క్రమంగా పునరుద్ధరిస్తోంది. రద్దయిన విమానాల సంఖ్య ఆదివారం నాటికి 20కి తగ్గింది.