పెట్టుబడికి బంగారు బాట...
ధర ఎంతన్నది సంబంధం లేకుండా మన దేశంలో బంగారానికి ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. ఇక ప్రత్యేక సందర్భాల్లో చెప్పాల్సిన పనిలేదు.
బంగారం.. ఎన్నటికీ వన్నె తగ్గని లోహం.. తరగని సంపదకు చిహ్నం. పెట్టుబడిగానూ ఆకర్షణీయమే. అక్షయ తృతీయ నాడు పసిడి కొంటే శుభం కలుగుతుందని ఎంతోమంది విశ్వసిస్తారు. ధరతో సంబంధం లేకుండా గ్రాము బంగారమైనా కొనాలని అనుకుంటారు. ఈ నేపథ్యంలో పసిడిని పెట్టుబడి దృష్టితో చూసినప్పుడు ఏం చేయాలన్నది తెలుసుకుందాం.
విలువ పెరుగుతూనే ఉంది..
2004 నుంచి బంగారంలో ప్రతి నెలా రూ.10,000 చొప్పున మదుపు చేస్తూ వస్తున్నారనుకుందాం. ఇప్పటికి దాని విలువ రూ.1.15 కోట్లకు చేరేది. 2023 అక్షయ తృతీయ నుంచి ఇప్పటి వరకూ బంగారం దాదాపు 18.78 శాతం వరకూ రాబడినిచ్చింది. ఏడాది క్రితం పసిడిలో మదుపు చేసిన వారికి అధిక ప్రతిఫలం కనిపించింది.
ధర ఎంతన్నది సంబంధం లేకుండా మన దేశంలో బంగారానికి ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. ఇక ప్రత్యేక సందర్భాల్లో చెప్పాల్సిన పనిలేదు. గ్రామీణ ప్రాంతాల నుంచి మెట్రో నగరాల దాకా ఎంతోమంది పసిడిని భౌతిక రూపంలో (ఆభరణాలు, నాణేలు, కడ్డీలు) కొనేందుకే ఆసక్తి చూపిస్తుంటారు. ఈ ధోరణిలో ఇప్పుడు కాస్త మార్పు కనిపిస్తోంది. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే శక్తి ఉన్న లోహంగా పసిడికి పేరుండటంతో, దీన్ని పెట్టుబడి దృష్టితో కొనాలనుకునే వారి సంఖ్యా పెరుగుతోంది.
ఆభరణాల రూపంలో..
శుభకార్యాల వేళ ఆభరణాల ధగధగలు కొత్త శోభను తీసుకొస్తాయి. అందుకే, చాలామంది ఈ రూపంలోనే పసిడిని కొంటారు. అవసరమైనంత మేరకు నగలను కొనుగోలు చేయడం మంచిదే. అదీ నాణ్యమైన బంగారాన్ని విక్రయించే దుకాణాల నుంచి, అన్ని బిల్లులతో వీటిని కొనుగోలు చేయాలి. జీఎస్టీ ఉండదని, ఇతర కారణాలతో ఎక్కడపడితే అక్కడ కొంటే భవిష్యత్తులో చిక్కులు రావచ్చు. మరోసంగతీ గుర్తుంచుకోండి. రూ.2లక్షలకు మంచి విలువైన కొనుగోళ్లు చేసినప్పుడు తప్పనిసరిగా పాన్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఆభరణానికీ బీఐఎస్ లోగో తప్పనిసరి. దీంతోపాటు ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ హెచ్యూఐడీ కోడ్ను భారత ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇవి లేకుండా నగలను కొనుగోలు చేయడం సురక్షితం కాదు. కొన్ని బంగారం విక్రయ దుకాణాలు ప్రత్యేక పొదుపు పథకాలను అందిస్తున్నాయి. వ్యవధి తీరిన తర్వాత బంగారం కొనాలని అనుకున్నప్పుడే వీటిని పరిశీలించాలి.
ఈటీఎఫ్ల ద్వారా..
ఎలక్ట్రానిక్ రూపంలో బంగారాన్ని కొనేందుకు వీలు కల్పించే గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లకు ఇప్పుడు ఆదరణ పెరుగుతోంది. డీమ్యాట్ ఖాతా ఉన్న వారు బంగారాన్ని సులభంగా ఎలక్ట్రానిక్ రూపంలో క్రయవిక్రయాలు చేయొచ్చు. గోల్డ్ ఈటీఎఫ్ ప్రతి యూనిట్ 99 శాతం లేదా అంతకంటే ఎక్కువ స్వచ్ఛతతో ఉన్న బంగారం ధరకు మద్దతునిస్తుంది. స్టాక్ ఎక్స్ఛేంజీ పనివేళల్లో ఎప్పుడైనా సరే వీటిని కొనుగోలు చేయొచ్చు. విక్రయించవచ్చు. బంగారం డీమ్యాట్లో ఉంటుంది కాబట్టి, భద్రత గురించి ఆందోళన అక్కర్లేదు. ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం ఉండదు. పైగా రుసుములూ తక్కువ. మొత్తం పెట్టుబడుల్లో వీటికి కొంత మేర కేటాయించడం ద్వారా నష్టభయాన్ని పరిమితం చేసుకునేందుకు వీలవుతుంది.
సార్వభౌమ పసిడి బాండ్లలో..
బంగారాన్ని కొనుగోలు చేయాలనుకునే వారి కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం.. సార్వభౌమ పసిడి బాండ్లు (ఎస్జీబీ). వీటిని ఆర్బీఐ సమయానుకూలంగా జారీ చేస్తుంటుంది. ఒక వ్యక్తి కనీసం ఒక గ్రాము నుంచి 4 కిలోల వరకూ కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. డిజిటల్ విధానంలో దరఖాస్తు చేసిన చిన్న మదుపరులకు గ్రాముపై రూ.50 తగ్గింపు ధర అందిస్తుంది. పెట్టిన పెట్టుబడిపై వార్షిక వడ్డీ 2.5 శాతం చొప్పున ఆరు నెలలకోసారి చెల్లిస్తుంది. డీమ్యాట్ ఖాతా, బ్యాంకు ఖాతా ద్వారా వీటిలో మదుపు చేయొచ్చు. ఈ బాండ్ల వ్యవధి 8 ఏళ్లు. అయిదేళ్ల తర్వాత ముందస్తు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. వీటిపై మూలధన రాబడి పన్ను ఉండదు.
ఫండ్లూ ఉన్నాయి..
బంగారంలో పరోక్షంగా మదుపు చేసేందుకు గోల్డ్ ఫండ్లూ అందుబాటులో ఉన్నాయి. వీటికి డీమ్యాట్ ఖాతా అవసరం లేదు. కనీస పెట్టుబడి రూ.500లతోనూ ఇందులో మదుపు ప్రారంభించవచ్చు. మీ పెట్టుబడిని బంగారం గనుల కంపెనీల్లోనూ, భౌతిక బంగారంలోనూ ఫండ్ మేనేజర్లు మదుపు చేస్తారు. చాలా మ్యూచువల్ ఫండ్ సంస్థలూ వీటిని అందిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే బంగారంలో మదుపు ప్రారంభించాలనుకునే వారు వీటిని పరిశీలించవచ్చు.
డిజిటల్లో..
ఇప్పుడు చాలా సంస్థలు బంగారాన్ని డిజిటల్ రూపంలో కొనుగోలు చేసేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఇందులో చాలా తక్కువ మొత్తంతో మదుపు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇందులో అన్ని సంస్థలనూ నమ్మలేం. కొన్ని సంస్థలు మోసం చేసిన సందర్భాలూ ఉన్నాయి. కాబట్టి, ఒకటికి రెండుసార్లు ఆలోచించాకే పెట్టుబడి నిర్ణయం తీసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పీఎఫ్ విత్డ్రా.. ఈ క్లెయిమ్స్పై 3-4 రోజుల్లోనే ఖాతాల్లోకి నగదు!
EPF auto settlement: నగదు ఉపసంహరణను సులభతరం చేయడం కోసం ఈపీఎఫ్ తీసుకొచ్చిన ఆటో సెటిల్మెంట్ సదుపాయం గురించి తెలుసా? -
స్టాక్ మార్కెట్... పెట్టుబడులు.. కాస్త అప్రమత్తంగా
ఎన్నికలు.. ఇతర కారణాలతో స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా స్పందిస్తున్నాయి. ఒకవైపు అంతర్జాతీయ మదుపరులు మన మార్కెట్లపై నిరాశావాద దృక్పథంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన తరుణం అంటూ సానుకూల మాటలు.. -
జీవిత బీమా పన్ను ఆదాకు మించి
ఆదాయపు పన్ను మినహాయింపు గురించి ఆలోచించే వారు ముందుగా చూసేది బీమా పాలసీలనే. పన్ను ప్రణాళికలను ప్రారంభించాల్సిన సమయం కావడంతో బీమా సంస్థలూ ఇప్పుడు పలు కొత్త పాలసీలతో ముందుకు వస్తుంటాయి. -
స్త్రీధన్ అంటే ఏంటి ?వివాహితలు తెలుసుకోవాల్సినవి
స్త్రీధన్ (ఆస్తి) అనేది మహిళ వివాహ సమయంలో తన తల్లిదండ్రులు, బంధువులు, వరుడు వైపు వారు, మొదలైన వారి నుంచి పొందే సంపద. దీనిపై హక్కులు ఎవరివి? -
ఆరోగ్య బీమా.. ఎంత ఉండాలి?
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు, బీమా తీసుకునే వ్యక్తి.. అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుని బీమా మొత్తాన్ని ఎంచుకోవడం చాలా అవసరం. -
మదుపు చేయాలి.. లక్ష్యం చేరేదాకా
స్టాక్ మార్కెట్లు కొంత అనిశ్చితితో ఉన్నప్పటికీ గరిష్ఠ స్థాయుల వద్ద కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈక్విటీల్లో ప్రత్యక్షంగా మదుపు చేస్తున్న వారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది. -
కష్టకాలంలో కుటుంబానికి ఆర్థిక ధీమా
అనుకోని ప్రమాదం కుటుంబంలో ఆర్జించే పెద్ద దిక్కును కోల్పోయేలా చేస్తుంది. ఆ వ్యక్తిపై ఆధారపడిన వారికి ఒక్కసారిగా ఏం చేయాలో తెలియని పరిస్థితి. -
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
Akshaya Tritiya 2024: అక్షయ తృతీయకు బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే హాల్మార్కింగ్ను ఎలా చెక్ చేయాలో తెలుసా? -
ఆరోగ్య బీమాలో నెట్వర్క్ ఆసుపత్రుల ప్రాధాన్యత ఏమిటి?
ప్రతి ఆరోగ్య బీమా సంస్థ తన పాలసీదారులకు నగదు రహిత చికిత్సనందించడానికి కొన్ని ఆసుపత్రులతో భాగస్వామ్యాన్ని (టై-అప్) కలిగి ఉంటుంది. దీని వల్ల పాలసీదారులకు ప్రయోజనమేంటో ఇక్కడ తెలుసుకుందాం.. -
తీవ్ర వ్యాధుల చికిత్సకు ఆర్థిక భరోసా
అనారోగ్యం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. ఓవైపు పెరుగుతున్న వైద్య చికిత్స ఖర్చులతో కేవలం ఆరోగ్య బీమా పాలసీ ఒక్కటే ఉంటే సరిపోని రోజులివి. -
వేతనంలోఎంత పొదుపు చేయాలంటే
వచ్చిన ఆదాయాన్నంతా ఖర్చు చేస్తే.. భవిష్యత్ లక్ష్యాలను సాధించడం కష్టమవుతుంది. కాబట్టి, పొదుపు, పెట్టుబడులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. -
ఫిక్స్డ్ డిపాజిట్.. ఈ పత్రాలు ఇచ్చారా?
బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయా? వీటిపై వచ్చే వడ్డీపై మూలం వద్ద పన్ను మినహాయింపు (టీడీఎస్) విధించకుండా ఫారం 15జీ / ఫారం15హెచ్ సమర్పించేందుకు సమయం ఇదే. -
ప్రభుత్వ సంస్థల్లో
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఒక ఈటీఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్) పథకాన్ని తీసుకొచ్చింది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ నిఫ్టీ పీఎస్ఈ ఈటీఎఫ్ అనే ఈ పథకం ఎన్ఎఫ్ఓ ముగింపు తేదీ ఈ నెల 16. కనీస పెట్టుబడి రూ.500. నిఫ్టీ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ (పీఎస్) ఇండెక్స్ ఆధారంగా రూపొందించిన ఓపెన్ ఎండెడ్ పథకం ఇది. -
క్రెడిట్ కార్డుల ద్వారా క్యాష్బ్యాక్ ఎలా సంపాదించాలి?
క్యాష్బ్యాక్ క్రెడిట్ కార్డులు మీరు వస్తువులను కొనుగోలు చేయడానికి మీ కార్డు స్వైప్ చేసినప్పుడు కొంత డబ్బును తిరిగి పొందేందుకు ఉపయోగపడతాయి. -
ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులున్నాయా? ఈ ప్రయోజనాలు తెలుసా?
Credit cards: సులభంగా క్రెడిట్ కార్డులు జారీ చేస్తుండటంతో చాలా మంది ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డుల్ని ఉపయోగిస్తున్నారు. వాటిని ఎలా సమర్థంగా వినియోగించాలో తెలుసుకోండిలా.. -
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!
Section 54F: వారసత్వంగా వచ్చిన ఆభరణాలను విక్రయించగా వచ్చిన మొత్తాన్ని ఇల్లు కొనుగోలుకు వినియోగిస్తే.. మూలధన లాభాల పన్ను వర్తించదని ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 54ఎఫ్ చెబుతోంది. -
ఆరోగ్య బీమా.. ఏ వయసులోనైతే మేలు..?
ఒక వ్యక్తి యుక్త వయసులోనే ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం వల్ల ప్రీమియం తగ్గింపు సహా అనేక ప్రయోజనాలుంటాయి. అవేంటో తెలుసుకోండి.. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇరాన్ను ఆదుకొన్న తుర్కియే డ్రోన్.. బైరక్తర్ అకిన్సి విశేషాలు..!
-
అధిక వడ్డీ ఆశచూపి రూ.200 కోట్లు మోసం.. పోలీసు స్టేషన్ వద్ద బాధితుల ఆందోళన
-
భారత జట్టుతోపాటు.. మీ నలుగురికి ఆల్ ది బెస్ట్: నీతా అంబానీ
-
అందుకే మధ్యతరగతి మహిళలు నాకంత ఆసక్తిగా అనిపించరు : సంజయ్ లీలా బన్సాలీ
-
బాధితుల గోడును ప్రసారం చేస్తే మీడియాపై కేసులా?: దేవినేని
-
చిన్నారి వైరల్ వీడియోపై విమర్శలు.. తల్లి ఆత్మహత్య