విపణిలోకి మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ

కాంపాక్ట్‌ ఎస్‌యూవీ విభాగంలో సరికొత్త ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓను మహీంద్రా అండ్‌ మహీంద్రా విడుదల చేసింది.

Published : 30 Apr 2024 02:02 IST

ధర రూ.7.49 లక్షల నుంచి

ఈనాడు, హైదరాబాద్‌: కాంపాక్ట్‌ ఎస్‌యూవీ విభాగంలో సరికొత్త ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓను మహీంద్రా అండ్‌ మహీంద్రా విడుదల చేసింది. డీజిల్‌, పెట్రోలు విభాగాల్లో మొత్తం 5 వేరియంట్లలో ఈ కారు అందుబాటులో ఉంటుంది. పెట్రోలు వెర్షన్‌ ప్రారంభ ధర రూ.7.49 లక్షలు కాగా, డీజిల్‌ మోడల్‌ ధర రూ.9.99 లక్షలుగా ఉంది. ఏఎక్స్‌7ఎల్‌ డీజిల్‌ ఎస్‌యూవీ ధర రూ.14.99 లక్షలు, పెట్రోలులో ఎంటీ రూ.13.99 లక్షలు, ఏటీ మోడల్‌ ధర రూ.15.49 లక్షలుగా ఉంది. 4 డిస్క్‌ బ్రేకులు, 6 ఎయిర్‌ బ్యాగులు సహా దాదాపు 35కు పైగా ప్రామాణిక భద్రతా ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. హ్యాచ్‌బ్యాక్‌ నుంచి ఎస్‌యూవీకి మారేవారిని దృష్టిలో పెట్టకుని దీన్ని తీసుకొచ్చామని మహీంద్రా అండ్‌ మహీంద్రా ఆటోమోటివ్‌ విభాగం ప్రెసిడెంట్‌ విజయ్‌ నక్రా తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని