Driving License: డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్.. టెస్ట్ కోసం ఆర్టీవో ఆఫీసుకు వెళ్లక్కర్లేదు!
Driving License: డ్రైవింగ్ లైసెన్స్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మరింత సరళతరం చేసింది. ఇకపై డ్రైవింగ్ టెస్ట్ కోసం ఆర్టీవో కార్యాయాలకు వెళ్లాల్సిన అసవరం లేదు. డాక్యుమెంటేషన్ ప్రక్రియను సైతం కుదించింది.
Driving License | ఇంటర్నెట్ డెస్క్: ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ కోసం ఆర్టీవో కార్యాలయానికి వెళ్లాల్సిన అసవరం లేదు. పెద్ద మొత్తంలో డాక్యుమెంట్లూ సమర్పించక్కర్లేదు. ఈ మేరకు జూన్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ ఇటీవల మార్గదర్శకాలు జారీ చేసింది. డ్రైవింగ్ లైసెన్స్ను (Driving License) పొందే విధానాన్ని మరింత సులభతరం చేస్తూ వీటిని తీసుకొచ్చింది. వీటికి రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలను నోటిఫై చేయాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు దరఖాస్తు చేసుకుంటే వారికి అనుమతులు మంజూరు చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఎవరూ వీటి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం లేదు.
కీలక మార్పులివే..
- ఇకపై డ్రైవింగ్ టెస్ట్ (Driving Test) కోసం ప్రాంతీయ రవాణా కార్యాలయాలకు (RTO) వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ డ్రైవింగ్ స్కూళ్లలోనే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. దరఖాస్తుదారుడు టెస్ట్లో ఉత్తీర్ణత సాధిస్తే స్కూళ్లు వారికి ఒక ధ్రువపత్రాన్ని జారీ చేస్తాయి. వాటితో ఆర్టీవో కార్యాలయంలో లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. డ్రైవింగ్ టెస్ట్ను నిర్వహించేందుకు అనుమతి ఇస్తూ కేంద్రం ప్రైవేట్ సంస్థలకు సర్టిఫికెట్లు జారీ చేస్తోంది. అవి లేని స్కూళ్లలో డ్రైవింగ్ నేర్చుకుంటే మాత్రం కచ్చితంగా ఆర్టీవోల్లో టెస్ట్కు హాజరుకావాల్సిందే.
- లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే గరిష్ఠంగా రూ.2,000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మైనర్లు డ్రైవ్ చేస్తున్నట్లు గుర్తిస్తే దాదాపు రూ.25,000 వరకు పెనాల్టీ కట్టాలి. పైగా ఆ వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ను రద్దు చేస్తారు. 25 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆ మైనర్ లైసెన్స్కు అనర్హుడవుతాడు.
- లైసెన్స్ (Driving License) దరఖాస్తు కోసం కావాల్సిన పత్రాల సంఖ్యను కుదించారు. ఇవి వాహనాన్ని బట్టి (ద్విచక్ర, త్రిచక్ర, భారీ వాహనాలు..) వేర్వేరుగా ఉంటాయి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానాన్ని మాత్రం కేంద్రం మార్చలేదు.
- వాతావరణ కాలుష్యాన్ని తగ్గించటంలో భాగంగా పెద్ద మొత్తంలో ప్రభుత్వ వాహనాలను తొలగించాలని నిర్ణయించింది. ఇతర వెహికల్స్కు ఉద్గార ప్రమాణాలను పెంచారు. పరోక్షంగా విద్యుత్తు వాహన వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహించినట్లైంది.
మారుతీ సుజుకీ విద్యుత్ వ్యాగన్ఆర్ ఇదేనా?
కొత్త నిబంధనల ప్రకారం వివిధ రకాల ఫీజులు..
- లెర్నర్స్ లైసెన్స్ - రూ.200
- లెర్నర్స్ లైసెన్స్ రెన్యువల్ - రూ.200
- ఇంటర్నేషనల్ లైసెన్స్ - రూ.1,000
- శాశ్వత లైసెన్స్ - రూ.200
- శాశ్వత లైసెన్స్ రెన్యువల్ - రూ.200
- రెన్యువల్ చేసిన డ్రైవర్ లైసెన్స్ జారీ - రూ.200
- లైసెన్స్ వివరాల్లో మార్పులు - రూ.200
ప్రైవేట్ డ్రైవింగ్ స్కూళ్లకు మార్గదర్శకాలు..
- డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలకు కనీసం ఒక ఎకరం స్థలం ఉండాలి. పెద్ద వాహనాల శిక్షణకైతే రెండు ఎకరాలు.
- స్కూళ్లలో డ్రైవింగ్ టెస్ట్ నిర్వహణకు సంబంధించిన వసతులు తప్పనిసరి.
- శిక్షణనిచ్చేవాళ్లకు కనీసం హైస్కూల్ డిప్లొమా (సమానమైన అర్హత) ఉండాలి. డ్రైవింగ్లో కనీసం ఐదేళ్ల అనుభవం తప్పనిసరి. బయోమెట్రిక్స్ సహా ఐటీ సిస్టమ్స్పై అవగాహన అవసరం.
- లైట్ మోటార్ వాహనాలకు గరిష్ఠంగా నాలుగువారాల్లో 29 గంటల శిక్షణనివ్వాలి. 21 గంటలు ప్రాక్టికల్, 9 గంటలు థియరీ సెషన్గా విభజించారు. మీడియం, హెవీ వెహికల్స్కు అయితే ఆరు వారాల్లో కనీసం 38 (31 + 8) గంటల శిక్షణ అందించాలి.
- ట్రైనింగ్ ఇవ్వకుండా లైసెన్స్ జారీ లేదా రెన్యువల్ చేస్తే డ్రైవింగ్ స్కూళ్లు రూ.5,000 ఫైన్ కట్టాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 లక్షల స్కూటర్లు రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ మోడల్ ఉందా?
Suzuki Motorcycle: సుజుకీ కంపెనీ దాదాపు 4 లక్షల వాహనాలను రీకాల్ చేసింది. ఆయా వాహనాల్లో ఉన్న లోపాన్ని గుర్తించి ఈ రీకాల్ చేపట్టింది. -
₹14.9 లక్షల బీఎండబ్ల్యూ స్కూటర్.. ఈ విశేషాలు తెలుసా?
BMW CE 04: జర్మనీకి చెందిన ప్రీమియం వాహనాల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ భారత్లో తొలి విద్యుత్ స్కూటర్ను విడుదల చేసింది. దీంట్లోని విశేషాలేంటో చూద్దాం. -
బీఎండబ్ల్యూ నుంచి కొత్త కార్లు
జర్మనీకి చెందిన విలాస కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ బుధవారం దేశీయ విపణిలోకి కొత్త కార్లను పరిచయం చేసింది. ఆల్-న్యూ 5 సిరీస్ లాంగ్ వీల్బేస్ ప్రారంభ ధర రూ.72.9 లక్షలుగా ఉంది. -
భారత్లో ఎక్స్-ట్రైల్ ఎస్యూవీని ఆవిష్కరించిన నిస్సాన్
Nissan X-Trail: నిస్సాన్ తమ ఎక్స్-ట్రైల్లో కొత్త వెర్షన్ను భారత్లో విడుదల చేయనుంది. -
రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి గెరిల్లా 450.. ధర, ఫీచర్లు ఇవే..!
Royal Enfield Guerrilla 450: రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ కొత్త మోటార్ సైకిల్ గెరిల్లా 450ని లాంచ్ చేసింది. దీని ధర రూ.2.39 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
బజాజ్ బాటలో టీవీఎస్.. త్వరలో CNG స్కూటర్..?
TVS CNG scooter: టీవీఎస్ సంస్థ సీఎన్జీ ఆప్షన్తో ఓ స్కూటర్ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇది 2025 తొలి అర్ధభాగంలో వచ్చే అవకాశం ఉంది. -
ఎస్యూవీలపై టాటా, మహీంద్రా బిగ్ డిస్కౌంట్
Tata motors- Mahindra price cut: ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీలైన టాటా, మహీంద్రా తమ ఎస్యూవీల ధరలను తగ్గించాయి. -
మహీంద్రా ఎక్స్యూవీ 700పై ₹2 లక్షల వరకు తగ్గింపు
Mahindra XUV700: మూడో వార్షికోత్సవం సందర్భంగా ఎక్స్యూవీ 700పై మహీంద్రా అండ్ మహీంద్రా డిస్కౌంట్ ప్రకటించింది. -
హైబ్రిడ్ వాహనాలపై ఆ రాష్ట్రం గుడ్ న్యూస్.. రోడ్డు ట్యాక్స్ మాఫీ
Hybrid Vehicles: హైబ్రిడ్ వాహనాలపై 100శాతం రోడ్డు ట్యాక్స్ను మాఫీ చేస్తూ యూపీ ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. దీంతో అక్కడ ఈ కార్ల ధరలు దాదాపు రూ.3లక్షల వరకు తగ్గనున్నాయి. -
త్వరలో సీఎన్జీ ఆటో ట్యాక్సీ.. ప్రకటించిన బజాజ్ ఆటో
Bajaj Auto: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ సీఎన్జీతో పనిచేసే తొలి ఆటో ట్యాక్సీని త్వరలోనే తీసుకురానున్నట్లు ప్రకటించింది. -
ప్రపంచంలోనే తొలి CNG బైక్ వచ్చేసింది.. ధర, ఇతర వివరాలు ఇవే..!
Bajaj CNG Bike: ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ను బజాజ్ ఆటో ఆవిష్కరించింది. మూడు వేరియంట్లలో ఈ బైక్ లభిస్తుంది. -
ట్రయంఫ్ స్పీడ్, స్క్రాంబ్లర్ మోటార్ సైకిళ్లపై డిస్కౌంట్
Triumph Motorcycles: ట్రయంఫ్ స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400 ఎక్స్.. బైక్లపై ట్రయంఫ్ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. -
బజాజ్ నుంచి సీఎన్జీ బైక్.. రిలీజ్కు ముందే వివరాలు లీక్!
Bajaj CNG Bike: బజాజ్ సీఎన్జీ బైక్ జులై 5న విడుదల కానుంది. ఈనేపథ్యంలో కొన్ని వివరాలు బయటకొచ్చాయి. -
జూన్లో తగ్గిన ఈవీ విక్రయాలు.. కారణం ఇదేనా..?
EV sales: దేశంలో జూన్ నెలలో విద్యుత్ వాహన విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. దీనికి వివిధ కారణాలు ఉన్నాయి. -
ఈ అయిదు ప్రశ్నలు వేసుకోకుండా ‘షేర్’ చేయొద్దు: ఐక్యరాజ్య సమితి
Social Media: ఏటా జూన్ 30న సామాజిక మాధ్యమాల దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. సోషల్ మీడియా ప్రభావం, వాటి సద్వినియోగంపై అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం. -
రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీగా మరో బైక్.. ఇండియాకు రానున్న బ్రిటీష్ బ్రాండ్
దేశీయ మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్కు గట్టి పోటీనిచ్చేందుకు మరో అంతర్జాతీయ కంపెనీ దేశంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. -
హీరో మోటోకార్ప్ వాహన ధరలు పెంపు.. 1 నుంచి కొత్త ధరలు
Hero MotoCorp: హీరో మోటోకార్ప్ వాహన ధరలు పెరగనున్నాయి. సవరించిన ధరలు జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. -
జులై నుంచి టాటా వాహనాల ధరలు పెంపు
Tata Motors: జులై 1 నుంచి వాణిజ్య వాహనాల ధరల్ని పెంచుతున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. -
మహీంద్రా అదుర్స్.. దేశంలోనే రెండో అత్యంత విలువైన ఆటోమొబైల్ కంపెనీగా..
Mahindra & Mahindra: భారత్లోని అత్యంత విలువైన ఆటో మొబైల్ కంపెనీల స్థానంలో టాటా మెటార్స్ను వెనక్కి నెట్టి మహీంద్రా రెండో స్థానంలో నిలిచింది. -
పాత కారు కొంటున్నారా?
పాత కారు కొనాలని అనుకుంటున్నారా? దీనికోసం రుణం తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు చాలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఈ కార్లకూ రుణం ఇస్తున్నాయి. కాకపోతే కొన్ని నిబంధనలను మనం అర్థం చేసుకోవాలి. -
టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల రీకాల్.. కారణం ఇదే..
TVS Motor: టీవీఎస్ కొత్తగా మార్కెట్లోకి తీసుకొచ్చిన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను రీకాల్ చేసింది. 40వేల స్కూటర్లను వెనక్కి రప్పిస్తోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు