Tata Motors: టాటా ప్రీమియం ఎస్‌యూవీల కోసం కొత్త పెట్రోల్‌ ఇంజిన్‌!

Tata Motors | హ్యారియర్‌, సఫారీ వంటి ప్రీమియం ఎస్‌యూవీ కార్లలో రానున్న రోజుల్లో కొత్త పెట్రోల్‌ ఇంజిన్‌ను తీసుకురానున్నట్లు టాటా మోటార్స్‌ తెలిపింది.

Published : 22 Oct 2023 12:49 IST

దిల్లీ: ప్రీమియం ‘స్పోర్ట్స్‌ యుటిలిటీ వాహనాల (SUV)’ కోసం కొత్త పెట్రోల్‌ ఇంజిన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు టాటా మోటార్స్‌ వెల్లడించింది. రానున్న రోజుల్లో వీటిని హ్యారియర్‌, సఫారీలో ఉపయోగించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ రెండు మోడళ్లలో 2-లీటర్ల డీజిల్‌ ఇంజిన్‌ను వాడుతున్నారు. ఏటా రెండు లక్షల ప్రీమియం ఎస్‌యూవీలు అమ్ముడవుతున్నట్లు కంపెనీ ప్రయాణికుల వాహన విభాగం డైరెక్టర్‌ శైలేష్‌ చంద్ర తెలిపారు. వీటిలో 80 శాతం డీజిల్‌ వాహనాలే. ఈ నేపథ్యంలోనే ఈ సెగ్మెంట్‌పై దృష్టి సారించి 1.5 లీటర్‌ జీడీఐ ఇంజిన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ దిశగా పనులు ముమ్మరంగా సాగుతున్నట్లు పేర్కొన్నారు. టాటా మోటార్స్‌ గతవారం హ్యారియర్‌, సఫారీలో వరుసగా రూ.15.49 లక్షలు, రూ.16.19 లక్షల ధరతో కొత్త వెర్షన్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. భద్రత విషయంలో వీటిని అత్యాధునికంగా తీర్చిదిద్దినట్లు కంపెనీ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని