TATA EVs: కొత్త బ్రాండ్తో టాటా విద్యుత్ వాహనాలు
TATA EVs: టాటా మోటార్స్ తమ విద్యుత్ వాహనాలను కొత్త బ్రాండ్తో తీసుకురానుంది. వినియోగదారులకు కొత్త అనుభూతిని పంచడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
దిల్లీ: విద్యుత్ వాహనాలకు ఆదరణ పుంజుకుంటున్న నేపథ్యంలో వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థ నుంచి వచ్చే ప్రయాణికుల విద్యుత్ వాహనాల (Electric Vehicles- EV)ను ‘టాటా.ఈవీ (TATA.ev)’ పేరిట తీసుకురానున్నట్లు ప్రకటించింది. 2026 నాటికి పది రకాల విద్యుత్ వాహనాలను విడుదల చేయాలని కంపెనీ ఇప్పటికే లక్ష్యంగా నిర్దేశించుకుంది.
ఈవీలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు కొత్తదనాన్ని కోరుకుంటున్నారని టాటా మోటార్స్ (Tata Motors) తెలిపింది. ఈ నేపథ్యంలో బ్రాండ్ నుంచి కార్లలోని ఫీచర్ల వరకు అన్నీ కొత్తగా ఉండాలని ఆశిస్తున్నారని వివరించింది. TATA.ev అనే కొత్త బ్రాండ్ తమ విద్యుత్ వాహన వ్యాపారానికి కొత్త గుర్తింపునిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. దీంతో తాము కొత్త శకంలోకి అడుగుపెడుతున్నట్లు ‘టాటా ప్యాసెంజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ’ మార్కెటింగ్ విభాగాధిపతి వివేక్ శ్రీవాస్తవ అన్నారు.
టాటా మోటార్స్ (Tata Motors)కు అనుబంధ సంస్థగా ఉన్న ‘టాటా ప్యాసెంజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్’ 2026 నాటికి రెండు బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా పది కొత్త విద్యుత్ వాహనాల (Electric Vehicles)ను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచించింది. వీటితో పాటు దేశవ్యాప్తంగా విద్యుత్ వాహనాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. 2030 నాటికి తమ వాహన విక్రయాల్లో సగం వాటా ఎలక్ట్రిక్ వాహనాలదే ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఈ కంపెనీ నెక్సాన్, టియాగో, టిగోర్, ఎక్స్ప్రెస్-టి వంటి మోడళ్లలో విద్యుత్ వేరియంట్లను విక్రయిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బజాజ్ కొత్త పల్సర్ NS400Z.. టాప్ స్పీడ్ 154kph
Bajaj Pulsar NS400Z: ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ ఆటో పల్సర్ ఎన్ఎస్400Z పేరుతో మరో కొత్త పల్సర్ను లాంచ్ చేసింది. ధర, ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేయండి. -
ఒకాయా ఇ-బైక్ డిస్రప్టర్
దిల్లీకి చెందిన ఒకాయా సంస్థ ప్రీమియం బ్రాండ్ ఫెరాటో, సరికొత్త విద్యుత్ బైక్ ‘డిస్రప్టర్’ను విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.1,59,999. విద్యుత్ వాహన రాయితీల తర్వాత దిల్లీలో ఈ బైకు రూ.1.40 లక్షలకు లభించనుంది. -
యాంపియర్ నుంచి విద్యుత్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 136 km
electric scooter: భారత్ మార్కెట్లోకి మరో కొత్త విద్యుత్ స్కూటర్ వచ్చేసింది. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి చెందిన యాంపియర్ ఈ స్కూటర్ను లాంచ్ చేసింది. -
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
Mahindra XUV 3XO: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఎక్స్యూవీ 3XOను లాంచ్ చేసింది. దీని ధర రూ.7.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. -
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
మారుతీ సుజుకీ త్వరలోనే అందుబాటు ధరలో హైబ్రిడ్ కార్లను తీసుకురావడంపై పని చేస్తోంది. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
325 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే.. ఆస్టన్ మార్టిన్ రూ.3.99 కోట్ల కారు
బ్రిటన్ విలాస కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ సరికొత్త ‘వాంటేజ్’ కారును దేశీయ విపణిలోకి విడుదల చేసింది. కొత్త తరం స్పోర్ట్కార్లలో ఇది రెండో మోడల్ అని కంపెనీ తెలిపింది. -
ధరలు తగ్గించిన ఓలా.. ఎస్1X ఇక రూ.69,999 నుంచే!
ఓలా తన ఎస్1 ఎక్స్ స్కూటర్ల ధరలను తగ్గించింది. ఇకపై వీటి ధరలు రూ.69వేల నుంచే ప్రారంభం కానున్నాయి. -
2023-24లో 5.5% తగ్గిన వాహన ఎగుమతులు
Automobile exports: 2024 ఆర్థిక సంవత్సరంలో వాహన ఎగుమతులు 5.5శాతం తగ్గాయని తయారీదార్ల సమాఖ్య వెల్లడించింది. -
ఓలా నుంచి త్వరలో మరో స్కూటర్.. ఎస్1 ఎక్స్ సిరీస్లో ఈ ఫీచర్లతో!
Ola Electric: ఓలా మరో స్కూటర్ తీసుకురాబోతోంది. ఎస్1 ఎక్స్ సిరీస్లో అప్డేట్ చేసిన వెర్షన్ వస్తోంది. -
విపణిలోకి ఎంజీ హెక్టార్ బ్లాక్స్టార్మ్
ఎంజీ (మోరిస్ గ్యారేజెస్) మోటార్ సంస్థ, తమ హెక్టార్ మోడల్లో సరికొత్త బ్లాక్స్టార్మ్ ఎడిషన్ను తీసుకొచ్చింది. -
స్విఫ్ట్, విటారా ధరల్ని పెంచిన మారుతీ సుజుకీ
Maruti Suzuki: మారుతీ సుజుకీ ఇండియా తన విపణిలోని కొన్ని మోడల్ వాహనాల ధరల్ని పెంచినట్లు బుధవారం ప్రకటించింది. -
బజాజ్ నుంచి కొత్త పల్సర్ N250
Bajaj Pulsar N250: ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ ఆటో కొత్త N250ని లాంచ్ చేసింది. ధర, ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేయండి. -
జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ @ రూ.20.5 లక్షలు
Jeep Compass: జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ విడుదలైంది. దీన్ని పూర్తిగా బ్లాక్-గ్లాస్ ఫినిష్తో తీర్చిదిద్దింది. -
2023-24 వాహన విక్రయాల్లో రెండంకెల వృద్ధి.. కార్లు, ట్రాక్టర్లలో రికార్డు!
Automobile retail sales: వాహనాల లభ్యత మెరుగవ్వడం, కొత్త మోడళ్ల విడుదల వంటి అంశాలు దోహదం చేయటంతో విక్రయాలు పుంజుకున్నట్లు ఫాడా అధ్యక్షుడు మనీశ్ రాజ్ సింఘానియా తెలిపారు. -
ఏథర్ నుంచి ఫ్యామిలీ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 160 km
ఏథర్ సంస్థ రిజ్తా పేరుతో ఫ్యామిలీ స్కూటర్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.1.10 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. -
టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్
టయోటా కిర్లోస్కర్ మోటార్ భారత్లో మరిన్ని ప్రీమియం మోడళ్లను తీసుకురావాలని భావిస్తోందని కంపెనీ డిప్యూటీ ఎండీ తడషి అసజుమా పేర్కొన్నారు. -
బీఎండబ్ల్యూ.. టాటా టెక్ జాయింట్ వెంచర్
BMW-Tata Tech: జాయింట్ వెంచర్ నుంచి బీఎండబ్ల్యూ (BMW) గ్రూప్నకు చెందిన ప్రీమియం వాహనాలకు కావాల్సిన సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వెహికల్ (SDV) సొల్యూషన్స్తో పాటు ఇతర ఐటీ సేవలను అందించనున్నారు. -
వాహన బీమా సంస్థల క్లెయిమ్స్ రేషియో ఎంతెంత?
దేశంలో సాధారణ బీమా సంస్థలకు సంబంధించి.. వాహన బీమా పాలసీల క్లెయిం సెటిల్మెంట్ రేషియో ఎంత ఉందో ఇక్కడ చూడండి. -
ట్రాక్టర్ల వ్యాపారానికి ఫోర్స్ మోటార్స్ గుడ్బై
Force Motors: ఆటో మొబైల్ కంపెనీ ఫోర్స్ మోటార్స్ వ్యవసాయ ట్రాక్టర్ల వ్యాపారం నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.