Summer: కార్లలో వీటిని ఉంచొద్దు.. ప్రమాదకరం..!
వేసవిలో కార్లకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వాటిని ఎండలో ఉంచేటప్పుడు అందులో కొన్ని రకాల వస్తువులు ఉంటే ప్రమాదకరం.
ఇంటర్నెట్డెస్క్: మార్చి మొదటి నాటికే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉండటంతో పాటు పొడి వాతావరణం కారణంగా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటోంది. సాధారణంగా వేసవి సీజన్లో కార్లలో అగ్ని ప్రమాదాలు కూడా ఎక్కువగానే జరుగుతుంటాయి. ఎండలో నిలిపిన కారులో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటం.. అద్దాలు బద్దలు కావడం వంటి ఘటనలను తరచూ చూస్తుంటాం. మనం ఏముందిలే అని పట్టించుకోకుండా వదిలేసే చిన్న విషయాలే వీటికి ప్రధాన కారణంగా నిలుస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముందు జాగ్రత్తలు తీసుకొంటే ఇలాంటివాటిని నివారించవచ్చని పేర్కొంటున్నారు.
కారులో మంటలు, పేలుడుకు కారణమయ్యేవి..
సన్గ్లాస్లు: కార్లు వాడే వారికి సాధారణంగా సన్గ్లాస్లు ధరించే అలవాటు ఉంటుంది. అలాంటివారు వాటిని డ్యాష్బోర్డ్పై పెట్టేస్తారు. ఎండలో పార్క్ చేసిన సమయంలో అవి భూతద్దంలా పనిచేసి అగ్ని ప్రమాదానికి కారణం అవుతాయి. ప్లాస్టిక్ ఫ్రేమ్ కళ్లజోడు అయితే వేడికి కరిగిపోయే ప్రమాదం ఉంది.
స్ప్రే క్యాన్లు: సెంట్లు, రూం స్ప్రేలు వంటి క్యాన్లు ఉంచకూడదు. వీటిల్లోని స్పిరిట్ కారణంగా ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ ఆ డబ్బాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఒక దశలో ఇవి పేలే ప్రమాదం ఉంది.
లైటర్లు: ధూమపానం చేసే అలవాటు ఉన్నవారు పొరబాటున కూడా లైటర్లను కార్లలో వదిలేయవద్దు. వాహనం ఎక్కువసేపు ఎండలో ఉంటే వీటినుంచి మంటలు వ్యాపించే ప్రమాదం ఉంది.
బ్యాటరీలు: వినియోగించిన పాత లేదా కొత్త బ్యాటరీలను కారు లోపల ఉంచొద్దు. అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద ఇవి లీక్ అయ్యే ప్రమాదం ఉంది. వీటిల్లోని యాసిడ్లు విషపూరితమైనవి. దీంతోపాటు కారు ఇంటీరియర్ దెబ్బతినొచ్చు.
మేకప్ సామగ్రి: మహిళలు వినియోగించే మేకప్ సామగ్రిని వాహనాల్లో ఉంచకూడదు. అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద వీటికి మండే స్వభావం ఉంటుంది. కొన్ని కరిగిపోయి దెబ్బతినవచ్చు.
కొవ్వొత్తులు: కొవ్వొత్తులు వంటి వాటిని గ్లాస్ కంటైనర్లలో ఉంచి కార్లలో దాచడం ప్రమాదకరం. ఇవి పేలే అవకాశం కూడా ఉంది.
మద్యం: మద్యం సీసాలు, క్యాన్లు కార్లలో ఉంచి వాటిని ఎండలో పార్క్ చేయడం ప్రమాదకరం. కార్బొనేటెడ్ డ్రింక్స్ ఉన్నవి పేలే ప్రమాదం ఉంది.
హ్యాండ్ శానిటైజర్లు: కొవిడ్ కారణంగా చాలామంది కార్లలో హ్యాండ్ శానిటైజర్లను వినియోగిస్తున్నారు. కానీ, వీటిల్లో ఆల్కహాల్ ఉన్నవి అధిక ఉష్ణోగ్రత వద్ద మంటలు సృష్టిస్తాయి.
మరికొన్ని జాగ్రత్తలు..
- ఎండలో నిలిపిన కారులో పసి పిల్లలు, పెంపుడు జంతువులను ఉంచొద్దు. ఇది ప్రాణాంతకం. కిటికీలు తీసి ఉంచినా.. లోపల ఉష్ణోగ్రతలు శరవేగంగా పెరిగిపోతాయి.
- సన్ క్రీమ్లు అధిక ఉష్ణోగ్రతల వద్ద దెబ్బతింటాయి.
- ఎలక్ట్రానిక్ వస్తువులను ఉంచి ఎండలో పార్క్ చేస్తే.. వాటిల్లో బ్యాటరీలు, చిప్స్ వంటి వాటి పనితీరు మందగించవచ్చు.
- ఔషధాలను ఉంచొద్దు.. సాధారణంగా చాలావరకు ఔషధాలను గది ఉష్ణోగ్రతల వద్ద సూర్యకాంతికి దూరంగా ఉంచాల్సి ఉంటుంది.
- సముద్ర స్నానాలు చేసిన తర్వాత తడిసిన టవల్స్ వంటివి ఉంచడం వల్ల ఇన్ఫెక్షన్లు వేగంగా వ్యాపించే అవకాశం ఉంటుంది.
- మొక్కలను ఉంచితే అవి కొన్ని గంటల్లోనే చనిపోయే ప్రమాదం ఉంది. లేకపోతే.. వాటిల్లో తేమశాతం పూర్తిగా పడిపోతోంది.
- వేసవి సీజన్లో ఆహార పదార్థాలను ఉంచడం వల్ల త్వరగా దెబ్బతిని విషపూరితమవుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
₹14.9 లక్షల బీఎండబ్ల్యూ స్కూటర్.. ఈ విశేషాలు తెలుసా?
BMW CE 04: జర్మనీకి చెందిన ప్రీమియం వాహనాల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ భారత్లో తొలి విద్యుత్ స్కూటర్ను విడుదల చేసింది. దీంట్లోని విశేషాలేంటో చూద్దాం. -
బీఎండబ్ల్యూ నుంచి కొత్త కార్లు
జర్మనీకి చెందిన విలాస కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ బుధవారం దేశీయ విపణిలోకి కొత్త కార్లను పరిచయం చేసింది. ఆల్-న్యూ 5 సిరీస్ లాంగ్ వీల్బేస్ ప్రారంభ ధర రూ.72.9 లక్షలుగా ఉంది. -
భారత్లో ఎక్స్-ట్రైల్ ఎస్యూవీని ఆవిష్కరించిన నిస్సాన్
Nissan X-Trail: నిస్సాన్ తమ ఎక్స్-ట్రైల్లో కొత్త వెర్షన్ను భారత్లో విడుదల చేయనుంది. -
రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి గెరిల్లా 450.. ధర, ఫీచర్లు ఇవే..!
Royal Enfield Guerrilla 450: రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ కొత్త మోటార్ సైకిల్ గెరిల్లా 450ని లాంచ్ చేసింది. దీని ధర రూ.2.39 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
బజాజ్ బాటలో టీవీఎస్.. త్వరలో CNG స్కూటర్..?
TVS CNG scooter: టీవీఎస్ సంస్థ సీఎన్జీ ఆప్షన్తో ఓ స్కూటర్ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇది 2025 తొలి అర్ధభాగంలో వచ్చే అవకాశం ఉంది. -
ఎస్యూవీలపై టాటా, మహీంద్రా బిగ్ డిస్కౌంట్
Tata motors- Mahindra price cut: ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీలైన టాటా, మహీంద్రా తమ ఎస్యూవీల ధరలను తగ్గించాయి. -
మహీంద్రా ఎక్స్యూవీ 700పై ₹2 లక్షల వరకు తగ్గింపు
Mahindra XUV700: మూడో వార్షికోత్సవం సందర్భంగా ఎక్స్యూవీ 700పై మహీంద్రా అండ్ మహీంద్రా డిస్కౌంట్ ప్రకటించింది. -
హైబ్రిడ్ వాహనాలపై ఆ రాష్ట్రం గుడ్ న్యూస్.. రోడ్డు ట్యాక్స్ మాఫీ
Hybrid Vehicles: హైబ్రిడ్ వాహనాలపై 100శాతం రోడ్డు ట్యాక్స్ను మాఫీ చేస్తూ యూపీ ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. దీంతో అక్కడ ఈ కార్ల ధరలు దాదాపు రూ.3లక్షల వరకు తగ్గనున్నాయి. -
త్వరలో సీఎన్జీ ఆటో ట్యాక్సీ.. ప్రకటించిన బజాజ్ ఆటో
Bajaj Auto: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ సీఎన్జీతో పనిచేసే తొలి ఆటో ట్యాక్సీని త్వరలోనే తీసుకురానున్నట్లు ప్రకటించింది. -
ప్రపంచంలోనే తొలి CNG బైక్ వచ్చేసింది.. ధర, ఇతర వివరాలు ఇవే..!
Bajaj CNG Bike: ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ను బజాజ్ ఆటో ఆవిష్కరించింది. మూడు వేరియంట్లలో ఈ బైక్ లభిస్తుంది. -
ట్రయంఫ్ స్పీడ్, స్క్రాంబ్లర్ మోటార్ సైకిళ్లపై డిస్కౌంట్
Triumph Motorcycles: ట్రయంఫ్ స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400 ఎక్స్.. బైక్లపై ట్రయంఫ్ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. -
బజాజ్ నుంచి సీఎన్జీ బైక్.. రిలీజ్కు ముందే వివరాలు లీక్!
Bajaj CNG Bike: బజాజ్ సీఎన్జీ బైక్ జులై 5న విడుదల కానుంది. ఈనేపథ్యంలో కొన్ని వివరాలు బయటకొచ్చాయి. -
జూన్లో తగ్గిన ఈవీ విక్రయాలు.. కారణం ఇదేనా..?
EV sales: దేశంలో జూన్ నెలలో విద్యుత్ వాహన విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. దీనికి వివిధ కారణాలు ఉన్నాయి. -
ఈ అయిదు ప్రశ్నలు వేసుకోకుండా ‘షేర్’ చేయొద్దు: ఐక్యరాజ్య సమితి
Social Media: ఏటా జూన్ 30న సామాజిక మాధ్యమాల దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. సోషల్ మీడియా ప్రభావం, వాటి సద్వినియోగంపై అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం. -
రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీగా మరో బైక్.. ఇండియాకు రానున్న బ్రిటీష్ బ్రాండ్
దేశీయ మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్కు గట్టి పోటీనిచ్చేందుకు మరో అంతర్జాతీయ కంపెనీ దేశంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. -
హీరో మోటోకార్ప్ వాహన ధరలు పెంపు.. 1 నుంచి కొత్త ధరలు
Hero MotoCorp: హీరో మోటోకార్ప్ వాహన ధరలు పెరగనున్నాయి. సవరించిన ధరలు జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. -
జులై నుంచి టాటా వాహనాల ధరలు పెంపు
Tata Motors: జులై 1 నుంచి వాణిజ్య వాహనాల ధరల్ని పెంచుతున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. -
మహీంద్రా అదుర్స్.. దేశంలోనే రెండో అత్యంత విలువైన ఆటోమొబైల్ కంపెనీగా..
Mahindra & Mahindra: భారత్లోని అత్యంత విలువైన ఆటో మొబైల్ కంపెనీల స్థానంలో టాటా మెటార్స్ను వెనక్కి నెట్టి మహీంద్రా రెండో స్థానంలో నిలిచింది. -
పాత కారు కొంటున్నారా?
పాత కారు కొనాలని అనుకుంటున్నారా? దీనికోసం రుణం తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు చాలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఈ కార్లకూ రుణం ఇస్తున్నాయి. కాకపోతే కొన్ని నిబంధనలను మనం అర్థం చేసుకోవాలి. -
టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల రీకాల్.. కారణం ఇదే..
TVS Motor: టీవీఎస్ కొత్తగా మార్కెట్లోకి తీసుకొచ్చిన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను రీకాల్ చేసింది. 40వేల స్కూటర్లను వెనక్కి రప్పిస్తోంది. -
స్పోర్టీ లుక్తో మార్కెట్లోకి టాటా ఆల్ట్రోజ్ రేసర్ కారు.. ధర, వివరాలు ఇవే..
Tata Altroz Racer: టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ రేసర్ హ్యాచ్బ్యాక్ను విడుదల చేసింది. దీని ధర రూ.9.49 లక్షలుగా నిర్ణయించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?