Toyota price hike: ఏప్రిల్‌ 1 నుంచి టయోటా కార్ల ధరల పెంపు

టయోటా సంస్థ కార్ల ధరలను పెంచనుంది. ఏప్రిల్‌ 1 నుంచి ఈ పెంపు చేపట్టనుంది. ఒక శాతం మేర ఈ పెంపు ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది.

Published : 28 Mar 2024 15:14 IST

Toyota price hike | దిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (Toyota Kirloskar Motor) కార్ల ధరలను పెంచనుంది. ఎంపిక చేసిన మోడళ్లపై 1 శాతం వరకు ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ముడి సరకుల ధరలు, నిర్వహణ ఖర్చులు పెరిగిన కారణంగా ఈ పెంపు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఏప్రిల్‌ 1 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని కంపెనీ ప్రకటించింది. దేశీయంగా టయోటా కంపెనీ గ్లాంజా వంటి హ్యాచ్‌బ్యాక్‌ల మొదలు ఫార్చూనర్‌ వంటి ఎస్‌యూవీల వరకు వివిధ రకాల కార్లను విక్రయిస్తోంది. టయోటా జనవరిలో ఒకసారి ధరల పెంపు చేపట్టింది. ఈ ఏడాది ధరలు పెంచడం రెండోసారి. మరోవైపు కార్ల తయారీ సంస్థ హోండా కూడా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ధరల పెంచుతున్నట్లు ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని