Wagon R Electric: మారుతీ సుజుకీ విద్యుత్ వ్యాగన్ఆర్ ఇదేనా?
జపాన్ వాహన దిగ్గజం సుజుకీ, ఇడబ్ల్యూఎక్స్ పేరుతో కారు కోసం పేటెంట్ దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భారత్లో మారుతీ సుజుకీ వ్యాగన్ఆర్కు ఇది విద్యుత్ వెర్షన్ అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
దిల్లీ: జపాన్ వాహన దిగ్గజం సుజుకీ, ఇడబ్ల్యూఎక్స్ పేరుతో కారు కోసం పేటెంట్ దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భారత్లో మారుతీ సుజుకీ వ్యాగన్ఆర్కు (Maruti Suzuki Wagon R Electric) ఇది విద్యుత్ వెర్షన్ అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2023 వాహన ప్రదర్శనలో సుజుకీ ఇడబ్ల్యూఎక్స్ మోడల్ను మొదటిసారి ప్రదర్శించింది. ఇది చూడటానికి వ్యాగన్ఆర్ డిజైన్ మాదిరిగానే ఉంటుంది. ముందువైపు సి ఆకృతి లైట్ క్లస్టర్లు, ప్లాస్టిక్ క్లాడింగ్ కలిగిన బంపర్, చక్రాలు, పక్కన పసుపు షేడ్స్ ఉంటాయి. ఒకసారి ఛార్జింగ్తో ఇడబ్ల్యూఎక్స్ 230 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని సుజుకీ ఇంతకు ముందు ప్రకటించింది. భారత్లో ఈ కారును వ్యాగన్ఆర్ ఎలక్ట్రిక్గా తీసుకువస్తారా, లేదా అన్న అంశంపై స్పష్టత లేదు. ప్రస్తుతం భారత్లో హైబ్రిడ్ వాహనాన్ని తీసుకొచ్చేందుకు మారుతీ సన్నాహాలు చేస్తోంది. 2025లో నెక్సా ఛానెల్ ద్వారా మొదటి విద్యుత్ కారు ఇవీఎక్స్ను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ కారు ఒకసారి ఛార్జింగ్తో 550 కి.మీ వరకు మైలేజీ ఇస్తుందని సమాచారం.
మెర్సిడెస్ బెంజ్ కొత్త కార్లు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల్లో రెండంకెల వృద్ధి ఆశిస్తున్నామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా వెల్లడించింది. హై ఎండ్ మోడళ్లకు అధిక గిరాకీ కొనసాగుతోందని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ (అమ్మకాలు, మార్కెటింగ్) ల్యాన్స్ బెనెట్ తెలిపారు. కంపెనీ బుధవారం దేశీయ విపణిలోకి లగ్జరీ మోడళ్లు- మేబాచ్ జీఎల్ఎస్ 600 4మేటిక్ ఎస్యూవీ, ఏఎంజీ ఎస్ 63 పెర్ఫార్మెన్స్ ఎడిషన్ 1లను తీసుకొచ్చింది. వీటి ధరలు వరుసగా రూ.3.35 కోట్లు, రూ.3.3 కోట్లుగా ఉన్నాయి. ప్రత్యేక ఎడిషన్ ధర రూ.3.8 కోట్ల నుంచి ప్రారంభమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
₹14.9 లక్షల బీఎండబ్ల్యూ స్కూటర్.. ఈ విశేషాలు తెలుసా?
BMW CE 04: జర్మనీకి చెందిన ప్రీమియం వాహనాల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ భారత్లో తొలి విద్యుత్ స్కూటర్ను విడుదల చేసింది. దీంట్లోని విశేషాలేంటో చూద్దాం. -
బీఎండబ్ల్యూ నుంచి కొత్త కార్లు
జర్మనీకి చెందిన విలాస కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ బుధవారం దేశీయ విపణిలోకి కొత్త కార్లను పరిచయం చేసింది. ఆల్-న్యూ 5 సిరీస్ లాంగ్ వీల్బేస్ ప్రారంభ ధర రూ.72.9 లక్షలుగా ఉంది. -
భారత్లో ఎక్స్-ట్రైల్ ఎస్యూవీని ఆవిష్కరించిన నిస్సాన్
Nissan X-Trail: నిస్సాన్ తమ ఎక్స్-ట్రైల్లో కొత్త వెర్షన్ను భారత్లో విడుదల చేయనుంది. -
రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి గెరిల్లా 450.. ధర, ఫీచర్లు ఇవే..!
Royal Enfield Guerrilla 450: రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ కొత్త మోటార్ సైకిల్ గెరిల్లా 450ని లాంచ్ చేసింది. దీని ధర రూ.2.39 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
బజాజ్ బాటలో టీవీఎస్.. త్వరలో CNG స్కూటర్..?
TVS CNG scooter: టీవీఎస్ సంస్థ సీఎన్జీ ఆప్షన్తో ఓ స్కూటర్ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇది 2025 తొలి అర్ధభాగంలో వచ్చే అవకాశం ఉంది. -
ఎస్యూవీలపై టాటా, మహీంద్రా బిగ్ డిస్కౌంట్
Tata motors- Mahindra price cut: ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీలైన టాటా, మహీంద్రా తమ ఎస్యూవీల ధరలను తగ్గించాయి. -
మహీంద్రా ఎక్స్యూవీ 700పై ₹2 లక్షల వరకు తగ్గింపు
Mahindra XUV700: మూడో వార్షికోత్సవం సందర్భంగా ఎక్స్యూవీ 700పై మహీంద్రా అండ్ మహీంద్రా డిస్కౌంట్ ప్రకటించింది. -
హైబ్రిడ్ వాహనాలపై ఆ రాష్ట్రం గుడ్ న్యూస్.. రోడ్డు ట్యాక్స్ మాఫీ
Hybrid Vehicles: హైబ్రిడ్ వాహనాలపై 100శాతం రోడ్డు ట్యాక్స్ను మాఫీ చేస్తూ యూపీ ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. దీంతో అక్కడ ఈ కార్ల ధరలు దాదాపు రూ.3లక్షల వరకు తగ్గనున్నాయి. -
త్వరలో సీఎన్జీ ఆటో ట్యాక్సీ.. ప్రకటించిన బజాజ్ ఆటో
Bajaj Auto: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ సీఎన్జీతో పనిచేసే తొలి ఆటో ట్యాక్సీని త్వరలోనే తీసుకురానున్నట్లు ప్రకటించింది. -
ప్రపంచంలోనే తొలి CNG బైక్ వచ్చేసింది.. ధర, ఇతర వివరాలు ఇవే..!
Bajaj CNG Bike: ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ను బజాజ్ ఆటో ఆవిష్కరించింది. మూడు వేరియంట్లలో ఈ బైక్ లభిస్తుంది. -
ట్రయంఫ్ స్పీడ్, స్క్రాంబ్లర్ మోటార్ సైకిళ్లపై డిస్కౌంట్
Triumph Motorcycles: ట్రయంఫ్ స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400 ఎక్స్.. బైక్లపై ట్రయంఫ్ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. -
బజాజ్ నుంచి సీఎన్జీ బైక్.. రిలీజ్కు ముందే వివరాలు లీక్!
Bajaj CNG Bike: బజాజ్ సీఎన్జీ బైక్ జులై 5న విడుదల కానుంది. ఈనేపథ్యంలో కొన్ని వివరాలు బయటకొచ్చాయి. -
జూన్లో తగ్గిన ఈవీ విక్రయాలు.. కారణం ఇదేనా..?
EV sales: దేశంలో జూన్ నెలలో విద్యుత్ వాహన విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. దీనికి వివిధ కారణాలు ఉన్నాయి. -
ఈ అయిదు ప్రశ్నలు వేసుకోకుండా ‘షేర్’ చేయొద్దు: ఐక్యరాజ్య సమితి
Social Media: ఏటా జూన్ 30న సామాజిక మాధ్యమాల దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. సోషల్ మీడియా ప్రభావం, వాటి సద్వినియోగంపై అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం. -
రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీగా మరో బైక్.. ఇండియాకు రానున్న బ్రిటీష్ బ్రాండ్
దేశీయ మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్కు గట్టి పోటీనిచ్చేందుకు మరో అంతర్జాతీయ కంపెనీ దేశంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. -
హీరో మోటోకార్ప్ వాహన ధరలు పెంపు.. 1 నుంచి కొత్త ధరలు
Hero MotoCorp: హీరో మోటోకార్ప్ వాహన ధరలు పెరగనున్నాయి. సవరించిన ధరలు జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. -
జులై నుంచి టాటా వాహనాల ధరలు పెంపు
Tata Motors: జులై 1 నుంచి వాణిజ్య వాహనాల ధరల్ని పెంచుతున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. -
మహీంద్రా అదుర్స్.. దేశంలోనే రెండో అత్యంత విలువైన ఆటోమొబైల్ కంపెనీగా..
Mahindra & Mahindra: భారత్లోని అత్యంత విలువైన ఆటో మొబైల్ కంపెనీల స్థానంలో టాటా మెటార్స్ను వెనక్కి నెట్టి మహీంద్రా రెండో స్థానంలో నిలిచింది. -
పాత కారు కొంటున్నారా?
పాత కారు కొనాలని అనుకుంటున్నారా? దీనికోసం రుణం తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు చాలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఈ కార్లకూ రుణం ఇస్తున్నాయి. కాకపోతే కొన్ని నిబంధనలను మనం అర్థం చేసుకోవాలి. -
టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల రీకాల్.. కారణం ఇదే..
TVS Motor: టీవీఎస్ కొత్తగా మార్కెట్లోకి తీసుకొచ్చిన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను రీకాల్ చేసింది. 40వేల స్కూటర్లను వెనక్కి రప్పిస్తోంది. -
స్పోర్టీ లుక్తో మార్కెట్లోకి టాటా ఆల్ట్రోజ్ రేసర్ కారు.. ధర, వివరాలు ఇవే..
Tata Altroz Racer: టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ రేసర్ హ్యాచ్బ్యాక్ను విడుదల చేసింది. దీని ధర రూ.9.49 లక్షలుగా నిర్ణయించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?