Vizag: కాగిత టోల్ప్లాజా సిబ్బందిపై వైకాపా నాయకుల దాడి..వీడియో వైరల్
విశాఖ జిల్లా నక్కపల్లి మండలం కాగిత టోల్ ప్లాజ్ వద్ద ఫీజు చెల్లించే విషయమై ప్లాజా సిబ్బందిపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు. పాయకరావు పేటకు చెందిన నాయకులు కారులో గేటు వద్దకు రాగా.. ఫీజు చెల్లించాలని అక్కడి సిబ్బంది కోరారు. దీనికి నిరాకరించిన నేతలు తాము ప్రజా ప్రతినిధులమంటూ వాగ్వాదానికి దిగారు. సహనం కోల్పోయిన నాయకులు కారులోంచి దిగి సిబ్బందిపై....
నక్కపల్లి: విశాఖ జిల్లా నక్కపల్లి మండలం కాగిత టోల్ ప్లాజ్ వద్ద సిబ్బందిపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు. పాయకరావు పేటకు చెందిన నాయకులు కారులో టోల్ గేటు వద్దకు రాగా.. ఫీజు చెల్లించాలని అక్కడి సిబ్బంది కోరారు. దీనికి నిరాకరించిన నేతలు తాము ప్రజా ప్రతినిధులమంటూ వాగ్వాదానికి దిగారు. సహనం కోల్పోయిన నాయకులు కారులోంచి దిగి సిబ్బందిపై దాడి చేశారు. ఈ క్రమంలో సిబ్బందిలో ఒకరి తల, కాలికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని నక్కపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. ఇంతలో బాధితుడి తరఫు బంధువులు, గ్రామస్థులు ఆస్పత్రికి చేరుకోగా ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు వారికి సర్ది చెప్పి అక్కడి నుంచి పంపేశారు. ఈ ఘటనపై ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి దృశ్యాలు ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెళ్లయిన నెలకే బావను కడతేర్చారు.. చెల్లి ప్రేమ వివాహం ఇష్టం లేని బావమరుదుల ఘాతుకం
తమ చెల్లెలు ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేని సోదరులు (పెదనాన్న కుమారులు) పగతో రగిలిపోయారు. పెద్ద మనుషులు విధించిన జరిమానా చెల్లించలేదన్న సాకుతో బావను కర్కశంగా కడతేర్చారు. -
మంటల్లో చిక్కుకుని రైతు మృతి
పొలంలోని వరి కొయ్యలు కాల్చేందుకు నిప్పుపెట్టిన రైతు ప్రమాదవశాత్తు ఆ మంటల్లోనే చిక్కుకుని మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పోత్నూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. -
వాణిజ్య పన్నులశాఖలో ఐదుగురు అధికారుల అరెస్టు
జీఎస్టీ ఎగవేతలకు సహకరిస్తూ అవినీతికి పాల్పడిన ఐదుగురు అధికారులను హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేయడం వాణిజ్య పన్నులశాఖలో సంచలనం సృష్టించింది. -
43,200 సీసాల గోవా మద్యం పట్టివేత
గోవా నుంచి రాష్ట్రానికి భారీగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
శంషాబాద్లో రూ.25 కోట్ల ఆభరణాల స్వాధీనం
ముంబయి నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న 34.78 కిలోల బంగారు, 43.60 కిలోల వెండి ఆభరణాలను శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకుంది. -
మార్ఫింగ్ కేసులో ఐదుగురికి బెయిల్
కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యల మార్ఫింగ్ వీడియో కేసులో కాంగ్రెస్ సామాజిక మాధ్యమ విభాగానికి చెందిన సభ్యులు ఐదుగురిని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు ప్రకటించారు. -
ప్రియురాలి ఇంటికి పార్సిల్బాంబు.. ఆమె భర్త, కుమార్తె మృతి
గుజరాత్లోని వడాలిలో ఓ వివాహిత ఇంటికి ఆమె ప్రియుడు పార్సిల్ బాంబు పంపాడు. అది పేలడంతో ఆమె భర్త, కుమార్తె మరణించారు. జీతూభాయ్ హీరాభాయ్ వంజారా(32) అనే వ్యక్తి కుటుంబం వడాలిలో ఉంటోంది.
తాజా వార్తలు (Latest News)
-
గులకరాయి ఘటనను.. ఎన్నికల్లో లబ్ధికి వినియోగించుకోకుండా అడ్డుకోండి
-
గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు
-
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
-
హైదరాబాద్లో స్థానికేతరులకే పట్టం
-
అంతేలేని ప్రజ్వల్ రేవణ్ణ ఆగడాలు.. ఒక్కొక్కరుగా స్పందిస్తున్న బాధితులు
-
పెళ్లయిన నెలకే బావను కడతేర్చారు.. చెల్లి ప్రేమ వివాహం ఇష్టం లేని బావమరుదుల ఘాతుకం