Gannavaram: గన్నవరంలో తెదేపా కార్యకర్తలపై వైకాపా దాడి: ఇద్దరికి గాయాలు

కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు.

Updated : 07 Apr 2024 22:24 IST

గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు. తెదేపా కర్యకర్తల ఇళ్లపై కర్రలు, రాళ్లతో దాడికి దిగడంతో బేతాళ రవి, ఈశ్వర్‌లు గాయపడ్డారు. క్షతగాత్రులను గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తెదేపా నాయకులు అక్కడికి చేరుకుని మెరుగైన వైద్యం ఇద్దరినీ విజయవాడ ఆసుపత్రికి తరలించారు. గన్నవరం పోలీసులు బాధితుల నుంచి వివరాలు సేకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని