జగత్‌విఖ్యాత్‌ బెయిల్‌ పిటిషన్‌పై కౌంటర్‌ 

బోయిన్‌పల్లి అపహరణ కేసులో నిందితుడిగా ఉన్న భూమా అఖిలప్రియ సోదరుడు జగత్‌ విఖ్యాత్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై పోలీసులు సికింద్రాబాద్‌ కోర్టులో...

Published : 26 Jan 2021 01:40 IST

హైదరాబాద్‌: బోయిన్‌పల్లి అపహరణ కేసులో నిందితుడిగా ఉన్న భూమా అఖిలప్రియ సోదరుడు జగత్‌ విఖ్యాత్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై పోలీసులు సికింద్రాబాద్‌ కోర్టులో కౌంటర్‌ దాఖలు చేశారు. పరారీలో ఉన్న విఖ్యాత్‌ రెడ్డికి బెయిల్‌ మంజూరు చేస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని కౌంటర్‌లో పేర్కొన్నారు. భూ వివాదానికి సంబంధించి ముగ్గురు సోదరులను అపహరించిన కేసులో విఖ్యాత్‌ రెడ్డి బాధితులను తీవ్ర భయబ్రాంతులకు గురి చేశారని పిటిషన్‌లో తెలిపారు. 

మరోవైపు ఈ కేసులో విఖ్యాత్‌ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని, దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తారని ఆయన తరఫు న్యాయవాది ముందస్తు బెయిల్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. బెయిల్‌ పిటిషన్‌పై విచారణను సికింద్రాబాద్‌ న్యాయస్థానం ఈనెల 27కు వాయిదా వేసింది. 

ఇవీ చదవండి..
ఎన్నికలను రీషెడ్యూల్‌ చేసిన ఎస్‌ఈసీ

గల్ఫ్‌ ఏజెంట్‌ భారీ మోసం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని