Crime: దిల్లీలో దారుణం.. ఇంట్లోకి చొరబడి యువతిపై కాల్పులు
కొందరు గుర్తుతెలియని దుండగులు ఓ యువతి ఇంట్లోకి చొరబడి హత్యకు పాల్పడ్డారు.
దిల్లీ: దేశ రాజధాని దిల్లీ (Delhi)లో ఓ యువతి హత్యకు గురైంది. శుక్రవారం రాత్రి వేళ దుండగులు ఆమె ఇంట్లోనే ఈ దారుణానికి పాల్పడ్డారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..
జైత్పుర్ ప్రాంతంలో 24 ఏళ్ల యువతి నివాసముంటోంది. రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆ యువతి ఇంట్లోకి చొరబడి తుపాకీతో ఆమెపై కాల్పులు జరిపారు. తుపాకీ శబ్ధం విన్న పొరుగువారు పరుగున యువతి ఇంటికి వచ్చారు. ఆమెని హత్య చేసి పారిపోతున్న నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించారు.
‘చంపి పాతిపెడతాం.. ఎవరొస్తారో చూస్తాం!’
స్థానికుల నుంచి తప్పించుకునే తరుణంలో దుండగులు తమ ద్విచక్రవాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యారు. నిందితులు ముఖానికి మాస్క్లు ధరించడంతో వారిని గుర్తించలేకపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితురాలిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఐదు రోజుల క్రితం ఓ మహిళ మృతదేహాన్ని దిల్లీ మెట్రో స్టేషన్ సమీపంలో కనుగొన్నారు. దుండగులు ఆమెపై రాళ్లతో దాడి చేసి చంపినట్లుగా పోలీసులు గుర్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రమాదం నుంచి బయటపడి... మరో కారు ఢీకొని...!
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అబ్బరాజు పృథ్వీరాజ్(30) దుర్మరణం పాలయ్యారు. -
చెరువులో మునిగి ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతి
చెరువులో దీపాలు వదిలేందుకు వెళ్లి, ప్రమాదవశాత్తు అందులో పడి ముగ్గురు అక్కాచెల్లెళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. -
రూ.లక్ష... 50 వేలు... 30 వేలు!
రాష్ట్రంలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో గురువారం ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. వారిలో ఒకరు వ్యవసాయ, ఇద్దరు విద్యుత్తు ఉద్యోగులు ఉన్నారు. -
దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతం.. ఇద్దరి మృతి
విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృత్యువాత పడగా.. మరొకరికి గాయాలైన ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ఉసిరికపల్లిలో చోటుచేసుకుంది. -
నలభై ఏళ్ల తర్వాత ఖైదీ పట్టివేత
నలభై ఏళ్ల నుంచి తప్పించుకొని తిరుగుతున్న ఓ ఖైదీని ఎట్టకేలకు పట్టుకున్నారు. జైలు అధికారులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్ మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన ఎస్.వీరన్న మహబూబాబాద్లో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడు. -
టెస్కాబ్ ఉన్నతాధికారిణిని నమ్మి అడ్డంగా మోసపోయారు!
రాష్ట్ర సహకార ఎపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్)లో ఒక ఉన్నతాధికారిణి మాటలు నమ్మి అందులో పనిచేస్తున్న పలువురు అధికారులు, ఉద్యోగులు మోసపోయారు. -
బాలికలతో బలవంతంగా వ్యభిచారం
అంతర్ రాష్ట్ర వ్యభిచార రాకెట్తో ప్రమేయం ఉందనే ఆరోపణలపై ప్రభుత్వ అధికారులు సహా 21 మందిని అరుణాచల్ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. -
మహిళా వైద్యాధికారులపై లైంగిక వేధింపుల వ్యవహారం.. కామారెడ్డి డీఎంహెచ్వో అరెస్టు
మహిళా వైద్యాధికారులపై లైంగిక వేధింపుల కేసులో కామారెడ్డి డీఎంహెచ్వో లక్ష్మణ్సింగ్ గురువారం అరెస్టు అయ్యారు. ఈ వ్యవహారంలోనే జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న శ్రీనివాస్నాయక్పై కూడా ఓ కేసు నమోదైంది.