Crime: దిల్లీలో దారుణం.. ఇంట్లోకి చొరబడి యువతిపై కాల్పులు

కొందరు గుర్తుతెలియని దుండగులు ఓ యువతి ఇంట్లోకి చొరబడి హత్యకు పాల్పడ్డారు. 

Published : 28 Oct 2023 16:40 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ (Delhi)లో ఓ యువతి హత్యకు గురైంది. శుక్రవారం రాత్రి వేళ దుండగులు ఆమె ఇంట్లోనే ఈ దారుణానికి పాల్పడ్డారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..

జైత్‌పుర్‌ ప్రాంతంలో 24 ఏళ్ల యువతి నివాసముంటోంది. రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆ యువతి ఇంట్లోకి చొరబడి తుపాకీతో ఆమెపై కాల్పులు జరిపారు. తుపాకీ శబ్ధం విన్న పొరుగువారు పరుగున యువతి ఇంటికి వచ్చారు. ఆమెని హత్య చేసి పారిపోతున్న నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించారు.

‘చంపి పాతిపెడతాం.. ఎవరొస్తారో చూస్తాం!’

స్థానికుల నుంచి తప్పించుకునే తరుణంలో దుండగులు తమ ద్విచక్రవాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యారు. నిందితులు ముఖానికి మాస్క్‌లు ధరించడంతో వారిని గుర్తించలేకపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితురాలిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఐదు రోజుల క్రితం ఓ మహిళ మృతదేహాన్ని దిల్లీ మెట్రో స్టేషన్‌ సమీపంలో కనుగొన్నారు. దుండగులు ఆమెపై రాళ్లతో దాడి చేసి చంపినట్లుగా పోలీసులు గుర్తించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని