యువతిపై సామూహిక అత్యాచారం

యువతి(24)ని నమ్మించిన బాలుడు పథకం ప్రకారం ఆమెను ఒక ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ తన ఐదుగురు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి తెగబడ్డాడు. నిందితులంతా 17 ఏళ్ల వయసులోపు వారే. ఈ దారుణం శనివారం

Updated : 09 Feb 2020 07:40 IST

నిందితులు ఆరుగురూ మైనర్లే!

మహబూబాబాద్‌ రూరల్‌: యువతి(24)ని నమ్మించిన బాలుడు పథకం ప్రకారం ఆమెను ఒక ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ తన ఐదుగురు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి తెగబడ్డాడు. నిందితులంతా 17 ఏళ్ల వయసులోపు వారే. ఈ దారుణం శనివారం మహబూబాబాద్‌ గ్రామీణ మండలంలో వెలుగు చూసింది. ఓ తండాకు చెందిన బాలుడు (16) హైదరాబాద్‌లో క్యాటరింగ్‌ పనులు చేస్తుండేవాడు. అక్కడ అతనికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఇటీవల స్వగ్రామానికి వచ్చిన ఆ బాలుడు యువతికి ఫోన్‌చేసి తన ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించాడు. శుక్రవారం సాయంత్రం మహబూబాబాద్‌ పట్టణానికి చేరుకున్న ఆమెను తొలుత ఆటోలో తండాకు తీసుకెళ్లి అక్కడి నుంచి సమీపాన ఉన్న మామిడి తోటకు తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ తండాకే చెందిన ఇద్దరు, మహబూబాబాద్‌ పట్టణానికి చెందిన ఇద్దరు, తొర్రూరుకు చెందిన ఓ బాలుడు ఉన్నారు. పథకం ప్రకారం ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. రాత్రి 10 గంటల సమయంలో అరుపులు విని రహదారిపై వెళ్తున్న ఒకరు డయల్‌ 100కు సమాచారమందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకుని యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆరుగురిపై కేసు నమోదుచేసి పూర్తిస్థాయి దర్యాప్తు చేయనున్నట్లు సీఐ వెంకటరత్నం వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని