కేపీహెచ్‌బీలో బాలిక ఆత్మహత్య  

పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన పద్నాలుగేళ్ల బాలిక తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పరిధి...

Published : 16 Mar 2020 00:55 IST

కేపీహెచ్‌బీ కాలనీ: పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన పద్నాలుగేళ్ల బాలిక తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పరిధి సర్దార్‌ పటేల్‌ నగర్‌లో శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మియాపూర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థిని చదువుకుంటోంది. ‘మీ కూతురుగా బతకడానికి అర్హురాలిని కాదు’ అంటూ తల్లిదండ్రులకు లేఖ రాసి బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలిక చదువుకుంటున్న పాఠశాలలో జరిగిన ఏదైనా సంఘటన వల్ల ఆత్మహత్యకు పాల్పడిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని