Crime News: శిశువును లాక్కొన్న హిజ్రా.. డబ్బు కోసం దారుణం

చంటి బిడ్డను తల్లి దగ్గర్నుంచి లాక్కున్న ఓ హిజ్రా.. డబ్బులిస్తేనే విడిచిపెడతానని డిమాండ్‌ చేశారు. చివరకు, 

Published : 21 Nov 2021 01:14 IST

చంటి బిడ్డను తల్లి దగ్గర్నుంచి లాక్కున్న ఓ హిజ్రా.. డబ్బులిస్తేనే విడిచిపెడతానని డిమాండ్‌ చేశారు. చివరకు, ఆ హిజ్రా ఒడిలోనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో ఈ విషాదం జరిగింది. బంగ్లా గ్రామంలో నివసించే మంపి సర్కార్‌ దంపతులకు అక్టోబర్‌ 29న ముగ్గురు పిల్లలు పుట్టారు. గత బుధవారం (నవంబర్‌ 17న) మధ్యాహ్నం కొంతమంది హిజ్రాలు సర్కార్‌ ఇంటికి వెళ్లారు. పిల్లలకు దీవెనలు అందిస్తామంటూ రూ.5 వేలు డిమాండ్‌ చేశారు. అంత మొత్తం ఇవ్వలేమనడంతో కుటుంబసభ్యులతో వాదనకు దిగారు. అంతలోనే ఔలద్‌ అలీ అనే హిజ్రా.. ఓ శిశువును తన ఒడిలోకి తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. తమ వద్ద ఉన్న రూ.500 ఇస్తానన్నా వినిపించుకోలేదు. శిశువుకు నలతగా ఉందని, పాలు పట్టాలని చెప్పినా వినిపించుకోలేదు. చివరికి హిజ్రా చేతిలోనే బిడ్డ ప్రాణం విడిచిందని శిశువు తల్లి బోరుమంది. ఈ వ్యవహారంపై కేసు నమోదుచేసిన పోలీసులు అలీని అరెస్టు చేశారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని