Sangareddy: ముద్దు పెట్టకుంటే.. భవనం పైనుంచి తోసేస్తా
పిల్లలకు మంచి నడవడిక నేర్పి.. తీర్చిదిద్దాల్సిన వ్యాయామ ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడంతో గ్రామస్థులు అతడికి దేహశుద్ధి చేశారు.
పాఠశాల విద్యార్థినులతో పీఈటీ అసభ్య ప్రవర్తన
దేహశుద్ధి చేసి.. పోలీసులకు అప్పగించిన గ్రామస్థులు
సిర్గాపూర్, న్యూస్టుడే: పిల్లలకు మంచి నడవడిక నేర్పి.. తీర్చిదిద్దాల్సిన వ్యాయామ ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడంతో గ్రామస్థులు అతడికి దేహశుద్ధి చేశారు. ఈ నేపథ్యంలో పీఈటీతోపాటు ప్రధానోపాధ్యాయుడిని డీఈవో సస్పెండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. స్థానిక ఉన్నత పాఠశాల పీఈటీ సంగ్రాం.. మార్చిలో ముగ్గురు విద్యార్థినులను వేర్వేరుగా పాఠశాల భవనంపైకి తీసుకువెళ్లాడు. ముద్దు పెట్టాలని, లేకపోతే కిందకు తోసేస్తానంటూ భయపెట్టాడు. ఇటీవల పాఠశాల ప్రారంభమైనా.. ఆ బాలికలు బడికి వెళ్లడం లేదు. పీఈటీ ఉంటే భయంగా ఉందని ఆ బాలికలు తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో కోపోద్రిక్తులైన వారు గ్రామస్థులతో కలసి శుక్రవారం పాఠశాలకు వెళ్లారు. పీఈటీకి దేహశుద్ధి చేసి పోలీస్స్టేషన్లో అప్పగించారు. ప్రధానోపాధ్యాయుడు గురునాథ్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆయనపైనా దాడిచేశారు. సాయంత్రం వరకు పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఇదే సమయంలో బయటి నుంచి వచ్చిన హోంగార్డు ప్రతాప్ సింగ్ గ్రామస్థులను దూషించడంతో వారు అతడిపైనా చేయిచేసుకున్నారు. సంఘటన స్థలానికి డీఈఓ వెంకటేశ్వర్లు, కంగ్టి సీఐ రాజశేఖర్ వచ్చి తల్లిదండ్రులతో మాట్లాడారు. పీఈటీ, హెచ్ఎంలను సస్పెండ్ చేస్తూ అక్కడికక్కడే ఉత్తర్వులు జారీచేశారు. పీఈటీపై పోక్సో కేసు నమోదు చేస్తామని, హోంగార్డుపైనా చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెళ్లయిన నెలకే బావను కడతేర్చారు.. చెల్లి ప్రేమ వివాహం ఇష్టం లేని బావమరుదుల ఘాతుకం
తమ చెల్లెలు ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేని సోదరులు (పెదనాన్న కుమారులు) పగతో రగిలిపోయారు. పెద్ద మనుషులు విధించిన జరిమానా చెల్లించలేదన్న సాకుతో బావను కర్కశంగా కడతేర్చారు. -
మంటల్లో చిక్కుకుని రైతు మృతి
పొలంలోని వరి కొయ్యలు కాల్చేందుకు నిప్పుపెట్టిన రైతు ప్రమాదవశాత్తు ఆ మంటల్లోనే చిక్కుకుని మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పోత్నూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. -
వాణిజ్య పన్నులశాఖలో ఐదుగురు అధికారుల అరెస్టు
జీఎస్టీ ఎగవేతలకు సహకరిస్తూ అవినీతికి పాల్పడిన ఐదుగురు అధికారులను హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేయడం వాణిజ్య పన్నులశాఖలో సంచలనం సృష్టించింది. -
43,200 సీసాల గోవా మద్యం పట్టివేత
గోవా నుంచి రాష్ట్రానికి భారీగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
శంషాబాద్లో రూ.25 కోట్ల ఆభరణాల స్వాధీనం
ముంబయి నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న 34.78 కిలోల బంగారు, 43.60 కిలోల వెండి ఆభరణాలను శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకుంది. -
మార్ఫింగ్ కేసులో ఐదుగురికి బెయిల్
కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యల మార్ఫింగ్ వీడియో కేసులో కాంగ్రెస్ సామాజిక మాధ్యమ విభాగానికి చెందిన సభ్యులు ఐదుగురిని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు ప్రకటించారు. -
ప్రియురాలి ఇంటికి పార్సిల్బాంబు.. ఆమె భర్త, కుమార్తె మృతి
గుజరాత్లోని వడాలిలో ఓ వివాహిత ఇంటికి ఆమె ప్రియుడు పార్సిల్ బాంబు పంపాడు. అది పేలడంతో ఆమె భర్త, కుమార్తె మరణించారు. జీతూభాయ్ హీరాభాయ్ వంజారా(32) అనే వ్యక్తి కుటుంబం వడాలిలో ఉంటోంది.
తాజా వార్తలు (Latest News)
-
గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు
-
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
-
హైదరాబాద్లో స్థానికేతరులకే పట్టం
-
అంతేలేని ప్రజ్వల్ రేవణ్ణ ఆగడాలు.. ఒక్కొక్కరుగా స్పందిస్తున్న బాధితులు
-
పెళ్లయిన నెలకే బావను కడతేర్చారు.. చెల్లి ప్రేమ వివాహం ఇష్టం లేని బావమరుదుల ఘాతుకం
-
మేనమామనన్నావ్.. మా కిట్లు ఆపేశావ్