విద్యుదాఘాతంతో రైతు మృతి

విశాఖ జిల్లా మునగపాక మండలం మడకపాలెం గ్రామానికి చెందిన రైతు దవులూరి చిలుకునాయుడు (40) ఆదివారం సాయంత్రం విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..

Published : 06 Dec 2021 06:33 IST

మునగపాక, న్యూస్‌టుడే: విశాఖ జిల్లా మునగపాక మండలం మడకపాలెం గ్రామానికి చెందిన రైతు దవులూరి చిలుకునాయుడు (40) ఆదివారం సాయంత్రం విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. చిలుకునాయుడు పొలంలోకి వెళ్తుండగా అప్పటికే తెగిపడి ఉన్న విద్యుత్తుతీగపై కాలు వేయడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.ప్రమాద స్థలాన్ని ఆర్‌ఈసీఎస్‌ అధికారులు, పోలీసులు పరిశీలించారు. చిలుకునాయుడుకు ముగ్గురు పిల్లలు. భార్య వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని