నినాదాలు తప్ప.. నిధులివ్వని మోదీ
‘మోదీ వల్లే తెలంగాణకు అన్యాయం జరిగింది. భాజపా పదేళ్ల పాలనలో ఏ వర్గానికీ న్యాయం జరగలేదు. తీవ్ర నష్టం జరిగింది. మేకిన్ ఇండియా, సబ్కా సాథ్- సబ్కా వికాస్, బేటీ బచావో, బేటీ పఢావో లాంటి నినాదాలు తప్ప మోదీ రాష్ట్రానికి నిధులిచ్చింది లేదు.
ఆయన వల్లే తెలంగాణకు అన్యాయం
భువనగిరిలో భాజపా, కాంగ్రెస్ కుమ్మక్కు
రైతులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి లెక్కలేదు
రోడ్షోలో భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్
ఈనాడు, నల్గొండ: ‘మోదీ వల్లే తెలంగాణకు అన్యాయం జరిగింది. భాజపా పదేళ్ల పాలనలో ఏ వర్గానికీ న్యాయం జరగలేదు. తీవ్ర నష్టం జరిగింది. మేకిన్ ఇండియా, సబ్కా సాథ్- సబ్కా వికాస్, బేటీ బచావో, బేటీ పఢావో లాంటి నినాదాలు తప్ప మోదీ రాష్ట్రానికి నిధులిచ్చింది లేదు. దేశవ్యాప్తంగా దళితులు, మహిళలపై దాడులు, నిరుద్యోగం, పేదరికం పెరిగాయి. 18 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఏ ఒక్కటీ నింపలేదు. భాజపా ఓట్ల కోసం వస్తుంటే.. కాంగ్రెస్ ఒట్లతో వస్తోంది. యువత, రైతులు, మహిళలు ఆలోచించి పరిణతితో భారాసకు ఓటేయాలి’ అని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కేసీఆర్ ‘పోరుబాట బస్సుయాత్ర’ రెండోరోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొనసాగింది. భువనగిరిలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన రోడ్షోలో కేసీఆర్ పాల్గొన్నారు. అనంతరం పార్టీ అభ్యర్థి క్యామ మల్లేశ్కు మద్దతుగా నిర్వహించిన కూడలి సమావేశంలో ప్రసంగించారు. డాలర్తో రూపాయి విలువ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.83కి చేరిందని.. ఇదంతా భాజపా, మోదీ పాలన ఫలితమేనని కేసీఆర్ దుయ్యబట్టారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. మైనార్టీలను ఉద్దేశించి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్కు ఓటేస్తే భాజపాకు ఓటేసినట్లేనని, భారాస లౌకిక పార్టీ అన్నారు. తన బిడ్డను అరెస్టు చేసినా భయపడటం లేదని, మోదీతో పోరాడతామని తెలిపారు. మళ్లీ భారాస సర్కారే వస్తుందని, మైనార్టీలకు గతంలో ఇచ్చిన అన్ని పథకాలనూ అందిస్తామన్నారు.
భువనగిరిలో భాజపా, కాంగ్రెస్ మిలాఖత్
‘యాదాద్రిలో అద్భుతంగా దేవాలయం నిర్మించుకున్నాం. యాదగిరిగుట్టను ఏనాడూ ఓట్ల కోసం వాడుకోలేదు. భాజపాకు భారాస బీటీం అని కొంత మంది విమర్శిస్తున్నారు. భువనగిరి మున్సిపాలిటీలో భాజపా, కాంగ్రెస్ మిలాఖత్ అయి.. కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తికి ఛైర్మన్, భాజపాకు వైస్ ఛైర్మన్ ఇచ్చారు. ఇప్పుడు ఎవరు ఎవరికి బీ టీం? భాజపా హయాంలో ఒక్క నవోదయ పాఠశాల, వైద్య కళాశాల రాలేదు. ఎన్నోసార్లు లేఖలు రాసినా, దిల్లీ వెళ్లి మొరపెట్టుకున్నా కేంద్ర ప్రభుత్వం సాయం చేయలేదు. ప్రస్తుతం భాజపా నుంచి పోటీ చేస్తున్న వ్యక్తి గతంలో ఎంపీగా ఉన్నప్పుడు నవోదయ పాఠశాల తీసుకురాలేదు. అప్పుడు పని చేయనప్పుడు ఇప్పుడెలా చేస్తారు? ఆయనకు ఎందుకు ఓటేయాలి?
అక్షింతలు, ప్రసాదాలు, పులిహోరలపైనే దృష్టి
రాష్ట్రంలో గత ఎన్నికల్లో నలుగురు భాజపా ఎంపీలను గెలిపిస్తే ఒకరు కేంద్ర మంత్రి అయ్యారు. ఆయన రాష్ట్రానికి ఒక్క రూపాయి తీసుకురాలేదు. ఒక్క పనీ చేయలేదు. మళ్లీ వాళ్లను ఎందుకు గెలిపించాలి? అక్షింతలు, ప్రసాదాలు, పులిహోరల పంపిణీపైనే వారి దృష్టి. మా వయసు మీద పడుతోంది. రేపటి తెలంగాణ మీది. యువత, మహిళలు, రైతులు ఆలోచించి బుద్ధితో భారాసకు ఓటెయ్యాలి. ఎవరు గెలిస్తే లాభమో ఆలోచించాలి. సమైక్య పాలనలో తెలంగాణలో వలసలు, వ్యాపారాలు దెబ్బతింటే పదేళ్ల భారాస పాలనలో అన్ని వర్గాలకూ న్యాయం జరిగింది.
స్కూటీలు లేవు లూటీలే
ఎన్నికల్లో అడ్డగోలు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చారు. వారికి స్కూటీలు రాలేదు కానీ.. రాష్ట్రంలో లూటీ జరుగుతోంది. రైతులు మళ్లీ రాత్రిపూట పొలానికి వెళ్లి నీళ్లు పెట్టుకునే దుస్థితి వచ్చింది. గతంలో బంద్ అయిన రైతు ఆత్మహత్యలు మళ్లీ మొదలయ్యాయి. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల వివరాలు 48 గంటల్లో ఇవ్వాలని ముఖ్యమంత్రి సవాల్ చేస్తే.. 4 గంటల్లో 225 మంది వివరాలు సెల్ఫోన్ నంబర్లతో సహా ఇచ్చాం. కానీ ముఖ్యమంత్రి సహా ఎవరూ బాధిత కుటుంబాలను పరామర్శించలేదు. ఈ ప్రభుత్వానికి రైతులపై ప్రేమలేదు. గురుకులాల్లో కల్తీ, విషాహారం పెడుతున్నారు. ఇప్పటికే భువనగిరిలో ఒక విద్యార్థి మరణించాడు. మెగా డీఎస్సీని దగా చేశారు. వరికి రూ.500 బోనస్ బోగస్ అయింది. ప్రైవేటు కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి అందలేదు. జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు’ అని కేసీఆర్ విమర్శించారు.
ఉమ్మడి నల్గొండలోనే రెండో రోజు
బస్సుయాత్రలో తొలిరోజు బుధవారం మిర్యాలగూడ, సూర్యాపేటల్లో రోడ్షో నిర్వహించిన కేసీఆర్.. రాత్రి సూర్యాపేటలోనే బస చేశారు. రెండోరోజు గురువారం అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు బయల్దేరి సూర్యాపేట జిల్లా అర్వపల్లి, తిరుమలగిరి మీదుగా జనగామ జిల్లా దేవరుప్పలకు చేరుకున్నారు. దారి పొడవునా భారాస కార్యకర్తలు, ప్రజలు, కేసీఆర్కు పూలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన జనగామ బైపాస్ మీదుగా ఆలేరు నుంచి భువనగిరికి చేరుకున్నారు. స్థానిక గాంధీ పార్కు నుంచి వినాయక చౌరస్తా వరకు ఎమ్మెల్యేలు జగదీశ్రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి, లోక్సభ అభ్యర్థి క్యామ మల్లేశ్లతో కలిసి రోడ్షో నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి పయనమయ్యారు. మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, గొంగిడి సునీత, చిరుమర్తి లింగయ్య, గాదరి కిశోర్, భిక్షమయ్యగౌడ్, మంచిరెడ్డి కిషన్రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, నాయకులు చింతల వెంకటేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దేవుడు నన్ను తెలంగాణ కోసమే పుట్టించాడు
భారాస ఓడినా బాధలేదు. క్యాడర్, ప్రజలు నాతోనే ఉన్నారు. తెలంగాణ ప్రజల గుండె చీలిస్తే కనిపించేది కేసీఆర్. కేసీఆర్ గుండె చీలిస్తే కనిపించేది తెలంగాణ. నన్ను తెలంగాణ కోసమే దేవుడు పుట్టించాడు. రాష్ట్రంలో రైతులకు, మహిళలకు ఏ కష్టం వచ్చినా నా ప్రాణం ఉన్నంత వరకు పోరాడతాను. రైతులకు మోసం జరిగితే సహించను.
భారాస అధినేత కేసీఆర్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-1.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-6.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-7.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-4.png)
తాజా వార్తలు
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?