నినాదాలు తప్ప.. నిధులివ్వని మోదీ
‘మోదీ వల్లే తెలంగాణకు అన్యాయం జరిగింది. భాజపా పదేళ్ల పాలనలో ఏ వర్గానికీ న్యాయం జరగలేదు. తీవ్ర నష్టం జరిగింది. మేకిన్ ఇండియా, సబ్కా సాథ్- సబ్కా వికాస్, బేటీ బచావో, బేటీ పఢావో లాంటి నినాదాలు తప్ప మోదీ రాష్ట్రానికి నిధులిచ్చింది లేదు.
ఆయన వల్లే తెలంగాణకు అన్యాయం
భువనగిరిలో భాజపా, కాంగ్రెస్ కుమ్మక్కు
రైతులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి లెక్కలేదు
రోడ్షోలో భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్
ఈనాడు, నల్గొండ: ‘మోదీ వల్లే తెలంగాణకు అన్యాయం జరిగింది. భాజపా పదేళ్ల పాలనలో ఏ వర్గానికీ న్యాయం జరగలేదు. తీవ్ర నష్టం జరిగింది. మేకిన్ ఇండియా, సబ్కా సాథ్- సబ్కా వికాస్, బేటీ బచావో, బేటీ పఢావో లాంటి నినాదాలు తప్ప మోదీ రాష్ట్రానికి నిధులిచ్చింది లేదు. దేశవ్యాప్తంగా దళితులు, మహిళలపై దాడులు, నిరుద్యోగం, పేదరికం పెరిగాయి. 18 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఏ ఒక్కటీ నింపలేదు. భాజపా ఓట్ల కోసం వస్తుంటే.. కాంగ్రెస్ ఒట్లతో వస్తోంది. యువత, రైతులు, మహిళలు ఆలోచించి పరిణతితో భారాసకు ఓటేయాలి’ అని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కేసీఆర్ ‘పోరుబాట బస్సుయాత్ర’ రెండోరోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొనసాగింది. భువనగిరిలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన రోడ్షోలో కేసీఆర్ పాల్గొన్నారు. అనంతరం పార్టీ అభ్యర్థి క్యామ మల్లేశ్కు మద్దతుగా నిర్వహించిన కూడలి సమావేశంలో ప్రసంగించారు. డాలర్తో రూపాయి విలువ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.83కి చేరిందని.. ఇదంతా భాజపా, మోదీ పాలన ఫలితమేనని కేసీఆర్ దుయ్యబట్టారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. మైనార్టీలను ఉద్దేశించి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్కు ఓటేస్తే భాజపాకు ఓటేసినట్లేనని, భారాస లౌకిక పార్టీ అన్నారు. తన బిడ్డను అరెస్టు చేసినా భయపడటం లేదని, మోదీతో పోరాడతామని తెలిపారు. మళ్లీ భారాస సర్కారే వస్తుందని, మైనార్టీలకు గతంలో ఇచ్చిన అన్ని పథకాలనూ అందిస్తామన్నారు.
భువనగిరిలో భాజపా, కాంగ్రెస్ మిలాఖత్
‘యాదాద్రిలో అద్భుతంగా దేవాలయం నిర్మించుకున్నాం. యాదగిరిగుట్టను ఏనాడూ ఓట్ల కోసం వాడుకోలేదు. భాజపాకు భారాస బీటీం అని కొంత మంది విమర్శిస్తున్నారు. భువనగిరి మున్సిపాలిటీలో భాజపా, కాంగ్రెస్ మిలాఖత్ అయి.. కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తికి ఛైర్మన్, భాజపాకు వైస్ ఛైర్మన్ ఇచ్చారు. ఇప్పుడు ఎవరు ఎవరికి బీ టీం? భాజపా హయాంలో ఒక్క నవోదయ పాఠశాల, వైద్య కళాశాల రాలేదు. ఎన్నోసార్లు లేఖలు రాసినా, దిల్లీ వెళ్లి మొరపెట్టుకున్నా కేంద్ర ప్రభుత్వం సాయం చేయలేదు. ప్రస్తుతం భాజపా నుంచి పోటీ చేస్తున్న వ్యక్తి గతంలో ఎంపీగా ఉన్నప్పుడు నవోదయ పాఠశాల తీసుకురాలేదు. అప్పుడు పని చేయనప్పుడు ఇప్పుడెలా చేస్తారు? ఆయనకు ఎందుకు ఓటేయాలి?
అక్షింతలు, ప్రసాదాలు, పులిహోరలపైనే దృష్టి
రాష్ట్రంలో గత ఎన్నికల్లో నలుగురు భాజపా ఎంపీలను గెలిపిస్తే ఒకరు కేంద్ర మంత్రి అయ్యారు. ఆయన రాష్ట్రానికి ఒక్క రూపాయి తీసుకురాలేదు. ఒక్క పనీ చేయలేదు. మళ్లీ వాళ్లను ఎందుకు గెలిపించాలి? అక్షింతలు, ప్రసాదాలు, పులిహోరల పంపిణీపైనే వారి దృష్టి. మా వయసు మీద పడుతోంది. రేపటి తెలంగాణ మీది. యువత, మహిళలు, రైతులు ఆలోచించి బుద్ధితో భారాసకు ఓటెయ్యాలి. ఎవరు గెలిస్తే లాభమో ఆలోచించాలి. సమైక్య పాలనలో తెలంగాణలో వలసలు, వ్యాపారాలు దెబ్బతింటే పదేళ్ల భారాస పాలనలో అన్ని వర్గాలకూ న్యాయం జరిగింది.
స్కూటీలు లేవు లూటీలే
ఎన్నికల్లో అడ్డగోలు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చారు. వారికి స్కూటీలు రాలేదు కానీ.. రాష్ట్రంలో లూటీ జరుగుతోంది. రైతులు మళ్లీ రాత్రిపూట పొలానికి వెళ్లి నీళ్లు పెట్టుకునే దుస్థితి వచ్చింది. గతంలో బంద్ అయిన రైతు ఆత్మహత్యలు మళ్లీ మొదలయ్యాయి. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల వివరాలు 48 గంటల్లో ఇవ్వాలని ముఖ్యమంత్రి సవాల్ చేస్తే.. 4 గంటల్లో 225 మంది వివరాలు సెల్ఫోన్ నంబర్లతో సహా ఇచ్చాం. కానీ ముఖ్యమంత్రి సహా ఎవరూ బాధిత కుటుంబాలను పరామర్శించలేదు. ఈ ప్రభుత్వానికి రైతులపై ప్రేమలేదు. గురుకులాల్లో కల్తీ, విషాహారం పెడుతున్నారు. ఇప్పటికే భువనగిరిలో ఒక విద్యార్థి మరణించాడు. మెగా డీఎస్సీని దగా చేశారు. వరికి రూ.500 బోనస్ బోగస్ అయింది. ప్రైవేటు కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి అందలేదు. జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు’ అని కేసీఆర్ విమర్శించారు.
ఉమ్మడి నల్గొండలోనే రెండో రోజు
బస్సుయాత్రలో తొలిరోజు బుధవారం మిర్యాలగూడ, సూర్యాపేటల్లో రోడ్షో నిర్వహించిన కేసీఆర్.. రాత్రి సూర్యాపేటలోనే బస చేశారు. రెండోరోజు గురువారం అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు బయల్దేరి సూర్యాపేట జిల్లా అర్వపల్లి, తిరుమలగిరి మీదుగా జనగామ జిల్లా దేవరుప్పలకు చేరుకున్నారు. దారి పొడవునా భారాస కార్యకర్తలు, ప్రజలు, కేసీఆర్కు పూలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన జనగామ బైపాస్ మీదుగా ఆలేరు నుంచి భువనగిరికి చేరుకున్నారు. స్థానిక గాంధీ పార్కు నుంచి వినాయక చౌరస్తా వరకు ఎమ్మెల్యేలు జగదీశ్రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి, లోక్సభ అభ్యర్థి క్యామ మల్లేశ్లతో కలిసి రోడ్షో నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి పయనమయ్యారు. మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, గొంగిడి సునీత, చిరుమర్తి లింగయ్య, గాదరి కిశోర్, భిక్షమయ్యగౌడ్, మంచిరెడ్డి కిషన్రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, నాయకులు చింతల వెంకటేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దేవుడు నన్ను తెలంగాణ కోసమే పుట్టించాడు
భారాస ఓడినా బాధలేదు. క్యాడర్, ప్రజలు నాతోనే ఉన్నారు. తెలంగాణ ప్రజల గుండె చీలిస్తే కనిపించేది కేసీఆర్. కేసీఆర్ గుండె చీలిస్తే కనిపించేది తెలంగాణ. నన్ను తెలంగాణ కోసమే దేవుడు పుట్టించాడు. రాష్ట్రంలో రైతులకు, మహిళలకు ఏ కష్టం వచ్చినా నా ప్రాణం ఉన్నంత వరకు పోరాడతాను. రైతులకు మోసం జరిగితే సహించను.
భారాస అధినేత కేసీఆర్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళలు, రైతులను మోసం చేసి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి: ఎంపీ అర్వింద్
మహిళలు, రైతులను మోసం చేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గద్దెనెక్కారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు.... -
గాడిద గుడ్డు ఇచ్చిన భాజపాకు కర్రు కాల్చి వాత పెట్టాలి: రేవంత్రెడ్డి
గజ్వేల్ నుంచి కేడీ వచ్చినా.. దిల్లీ నుంచి మోదీ వచ్చినా పాలమూరులో కాంగ్రెస్ను ఓడించలేరని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
కాంగ్రెస్ వచ్చిన ఐదు నెలల్లోనే రాష్ట్రం ఆగమైంది: కేసీఆర్
రాష్ట్రంలో పంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదని భారాస అధినేత కేసీఆర్ ఆరోపించారు. -
అబద్ధాల కాంగ్రెస్ను శిక్షించాల్సిందే: హరీశ్రావు
ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని, మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. -
కేసీఆర్.. కేంద్రంలోని ఏ సంకీర్ణంలో చేరతారు?: సీఎం రేవంత్
కేంద్రంలోని ఏ సంకీర్ణంలో చేరతారో కేసీఆర్ చెప్పాలని సీఎం రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. కొత్తగూడెంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. -
నేను గెలిస్తే కరీంనగర్ నుంచి హైదరాబాద్కు రైలుమార్గం: భారాస అభ్యర్థి వినోద్ కుమార్
ఉన్నత విద్యా సంస్థలను కరీంనగర్కు తేవాలనేది తన లక్ష్యమని కరీంనగర్ భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ అన్నారు. -
పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రారంభం
లోక్సభ ఎన్నికలకు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ శుక్రవారం ప్రారంభమైంది. ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ముందుగానే ఓటు వేసే విధానాన్ని ఎన్నికల సంఘం గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నుంచి అమలులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. -
ఆదిలాబాద్ నేతల చేరిక నిలిపివేత: జగ్గారెడ్డి
ఇటీవల కాంగ్రెస్లో చేరిన ఆదిలాబాద్ జిల్లా నాయకుల చేరికలు తాత్కాలికంగా నిలిపివేసినట్లు పీసీసీ చేరికల కమిటీ సభ్యుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
రాహుల్ ప్రధాని కావాలి: దీపా దాస్మున్షీ
రాజ్యాంగాన్ని మార్చాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి దీపా దాస్మున్షీ విమర్శించారు. దేశం బాగుండాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. -
కాంగ్రెస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థిపై కేసు నమోదు
కాంగ్రెస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుపై శుక్రవారం రెండో ఠాణాలో కేసు నమోదైందని సీఐ విజయ్కుమార్ తెలిపారు. రాజేందర్రావు వ్యక్తిగత ఫేస్బుక్ ఖాతాలో భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అనని మాటలు అన్నట్లుగా నకిలీ వీడియోలు సృష్టించారంటూ ఆ పార్టీ సీనియర్ నాయకుడు కొట్టె మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు. -
33 శాతం మహిళా రిజర్వేషన్ల అమలుకు ప్రధాని కృషి
ప్రధాని నరేంద్ర మోదీ మహిళల పక్షపాతి అని, వారికి 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కొనియాడారు. -
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ భారాస అభ్యర్థి రాకేశ్రెడ్డి
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి భారాస అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డిని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు. -
సీఎం నాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరం
తనపై సీఎం రేవంత్రెడ్డి అనుచిత వాఖ్యలు చేయడం బాధాకరమని మెదక్ భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన పటాన్చెరులో మాట్లాడారు. -
హామీలు అమలు చేయలేకే తప్పుడు ప్రచారం: లక్ష్మణ్
సమాజంలో ఘర్షణపూరిత వాతావరణం సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్రెడ్డి కుతంత్రాలకు తెరతీశారని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆరోపించారు. -
భాజపాపై పోరాటంలో కమ్యూనిస్టులే ముందు: మంత్రి ఉత్తమ్
కాంగ్రెస్, సీపీఐలు సహజ మిత్రులని, రెండు పార్టీలు నిరుపేదల అభివృద్ధికి కృషి చేసేవే అని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన నాలుగు శాసనసభ నియోజకవర్గాల (సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ) స్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. -
ఏ ప్రభుత్వం తప్పు చేసినా.. ఎర్రజెండాకు ఎదిరించే శక్తి
‘పేదల పక్షాన పోరాడుతూ.. వారికి వ్యతిరేకంగా ఎవరు ఉన్నప్పటికీ ఎదిరించే శక్తి మాత్రం ఎర్రజెండాకే ఉంది. -
లోక్సభ ఎన్నికల తర్వాత భారాసలో చీలికలు
దేశ సంపదను మోదీ ప్రభుత్వం అదానీ, అంబానీలకు దోచిపెట్టిందని రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరోపించారు. -
భాజపా, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్
రాష్ట్రంలో భాజపా, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటై మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని.. తెలంగాణ ప్రజల అస్తిత్వమైన భారాసను లేకుండా చేయాలని కుట్ర పన్నాయని, మాజీ సీఎం కేసీఆర్ను దెబ్బతీయాలని చూస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. -
నేడు దళిత కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ దీక్ష
పీసీసీ దళిత కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం(నేడు) రాజ్యాంగ పరిరక్షణ దీక్ష చేపడుతున్నట్లు ఆ విభాగం ఛైర్మన్ ప్రీతం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. -
సీఎంపై ఎన్నికల ప్రధానాధికారికి భాజపా ఫిర్యాదు
ప్రధాని నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి అమిత్షాపై తప్పుడు ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భాజపా ఎన్నికల విభాగం లీగల్ సెల్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ను కలిసి ఫిర్యాదు చేశారు. -
ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రచారంలో ఉద్రిక్తత
భారాస ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ మండల కేంద్రంలో చేపట్టిన ఎన్నికల ప్రచారం ఉద్రిక్తతకు దారితీసింది.
తాజా వార్తలు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు