చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది.
చెన్నై చేరుకున్న గుకేశ్
చెన్నై
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. వందలాది విద్యార్థులు అక్కడ వరుస కట్టారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆ తల్లి ఆత్రుతతో ఉంది. ఆ అందరి ఎదురు చూపులు ఆ వీరుడి కోసమే. ఆ సమయం రానే వచ్చింది. భారత చదరంగ సంచలనం దొమ్మరాజు గుకేశ్ ఆ విమానాశ్రయంలో కనబడగానే కేరింతలు మిన్నంటాయి. చప్పట్లతో పరిసరాలు మార్మోగాయి. తల్లి పద్మను చూడగానే ఆ ఛాంపియన్ ముఖం నవ్వుతో వెలిగిపోయింది. వెంటనే వెళ్లి హత్తుకున్నాడు. అతనితో పాటు వచ్చిన తండ్రి రజనీకాంత్ కూడా ఆనందంలో మునిగిపోయాడు. ఇలా.. క్యాండిడేట్స్ టోర్నీ గెలిచి ప్రపంచ టైటిల్ పోరుకు అర్హత సాధించిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర లిఖించిన 17 ఏళ్ల గుకేశ్కు ఘనస్వాగతం లభించింది. సోమవారం కెనడాలోని టొరంటోలో ప్రకంపనలు సృష్టించిన గుకేశ్ స్వదేశానికి చేరుకున్నాడు. స్వాగతం పలికేందుకు అంత రాత్రిలోనూ అతను చదువుకునే వేలమ్మాల్ విద్యాలయ విద్యార్థులు తరలిరావడం విశేషం. ‘‘ఇలా స్వదేశానికి చేరుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఇదెంతో ప్రత్యేకమైన ఘనత. టోర్నీ (క్యాండిడేట్స్) ఆరంభం నుంచి మంచి లయతోనే ఉన్నా. గెలుస్తాననే ఆత్మవిశ్వాసంతో సాగా. అదృష్టం కూడా నా వైపు నిలిచింది. ఎంతో మంది చెస్ను ఆస్వాదిస్తుంటే ఆనందంగా ఉంది. ఈ టోర్నీ గెలవడంలో సాయపడ్డ నా తల్లిదండ్రులు, కోచ్, కుటుంబం, నా పాఠశాల, తమిళనాడు ప్రభుత్వానికి ధన్యవాదాలు’’ అని గుకేశ్ తెలిపాడు. విశ్వనాథన్ ఆనంద్ లేకపోతే ఈ స్థాయికి వచ్చేవాణ్నే కాదని గుకేశ్ అన్నాడు. వెస్ట్బ్రిడ్జ్ ఆనంద్ చెస్ అకాడమీలో శిక్షణ పొందిన గుకేశ్.. ఆనంద్ తర్వాత క్యాండిడేట్స్ టోర్నీ గెలిచిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. ‘‘నాతో పాటు ప్రతి ఒక్కరికీ విషీ సర్ స్ఫూర్తి. నా కెరీర్లో ఆయన ప్రధాన పాత్ర పోషించాడు. ఆయన అకాడమీ నుంచి ఎంతో లబ్ధి పొందా. ఆయనకు రుణపడి ఉంటా. ఆయన లేకపోతే ఈ స్థాయి కాదు కదా దరిదాపుల్లోకి కూడా వచ్చేవాణ్ని కాదు’’ అని అతను పేర్కొన్నాడు. ప్రపంచ టైటిల్ కోసం ఈ ఏడాది చివర్లో డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్ (చైనా)తో గుకేశ్ తలపడనున్నాడు. ‘‘డింగ్తో పోరుకు ముందు నా సన్నాహకం సాగే తీరు, సరైన మానసిక దృక్పథంతో ఉండటమే సవాలు. నాపై చాలా అంచనాలున్నాయి. నాపై నాకు నమ్మకముంది. ఇదే వ్యూహంతో సాగుతా. మంచి ఫలితమే వస్తుందని ఆశిస్తున్నా’’ అని గుకేశ్ పేర్కొన్నాడు.
అందుకే ధోనీని ఆరాధిస్తా
తీవ్రమైన ఒత్తిడిని కూడా గొప్పగా ఎదుర్కొనే టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, టెన్నిస్ దిగ్గజం జకోవిచ్లను తాను ఆరాధిస్తానని గుకేశ్ చెప్పాడు. ‘‘తీవ్రమైన ఒత్తిడిని కూడా ధోని, జకోవిచ్ ఎదుర్కొనే తీరు గొప్పగా ఉంటుంది. వాళ్లు పెద్ద ఆటగాళ్లు. ఎప్పుడూ అత్యుత్తమ ప్రదర్శన చేస్తారు. అందుకే వీళ్లకు ఆకర్షితుడినయ్యా. ఇటీవల ఎక్కువగా క్రికెట్ను అనుసరించడం లేదు. కానీ అన్ని క్రీడలను, ముఖ్యంగా టెన్నిస్ను ఆస్వాదిస్తా. ఆటలతో ప్రేమలో పడ్డా’’ అని అతను తెలిపాడు. ఆధునిక చెస్ దిగ్గజంగా ఎదిగిన కార్ల్సన్ నుంచి ఎంతో నేర్చుకోవచ్చని గుకేశ్ అన్నాడు. ‘‘కార్ల్సన్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. కేవలం చెస్ పరంగానే కాదు మానసిక దృక్పథం గురించి కూడా నేర్చుకోవచ్చు. ప్రపంచంలో ఏ క్రీడలో చూసినా సరే అత్యుత్తమ మానసిక దృక్పథాన్ని కలిగి ఉన్నది మాత్రం కార్ల్సనే. ప్రతి ఒక్కరూ ఒత్తిడికి లోనవుతారు. కానీ అనుభవంతో దాన్ని అధిగమించడం నేర్చుకుంటారు. పరిణతి, ప్రాక్టీస్తో మెరుగవుతారు’’ అని అతను పేర్కొన్నాడు. టొరంటోలో భారత భూకంపంగా గుకేశ్ను చెస్ దిగ్గజం కాస్పరోవ్ ప్రశంసించిన సంగతి తెలిసిందే. ‘‘నా హీరోల్లో కాస్పరోవ్ ఒకరు. ఆల్టైమ్ అత్యుత్తమ చెస్ ఆటగాళ్లలో ఆయన ఒకరు. ఆయన నుంచి ఇలాంటి ప్రశంస పొందడం నాకెంతో ముఖ్యమైంది. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ కోసం త్వరలోనే ప్రాక్టీస్ మొదలెడతా. దీన్ని ఆస్వాదిస్తాననే అనుకుంటున్నా’’ అని గుకేశ్ పేర్కొన్నాడు.
ప్రపంచ చెస్ పోరు ఇక్కడే నిర్వహించాలని..
యువ కెరటం దొమ్మరాజు గుకేశ్, డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్ మధ్య జరగబోయే ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ ఆతిథ్యానికి భారత్ ప్రయత్నాలు చేస్తోంది. అఖిల భారత చెస్ సమాఖ్య కార్యదర్శి దేవ్ పటేల్ గురువారం ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ ఏడాది మధ్యలో జరిగే ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ తేదీలు, వేదిక ఇంకా ఖరారు కాలేదు. ‘‘ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్కు ఆతిథ్యం ఇవ్వడానికి ఫిడేతో చర్చలు మొదలుపెట్టాం. ఈ టోర్నీని నిర్వహించడానికి సంసిద్ధంగా ఉన్నాం. భారత్లో ఈ ఈవెంట్ జరగడం ద్వారా చెస్కు మరింత ప్రాచుర్యం తీసుకు రావడం మా ఉద్దేశం’’ అని ఇటీవలే కార్యదర్శిగా ఎంపికైన దేవ్ పటేల్ తెలిపాడు. ఇటీవల టొరంటోలో జరిగిన క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన గుకేశ్.. లిరెన్తో ప్రపంచ టైటిల్ పోరుకు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. గత ఏడాది చెస్ ప్రపంచకప్ చెన్నైలోనే జరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
డోపింగ్ పరీక్షకు శాంపిల్ ఇవ్వని కారణంగా రెజ్లర్ బజరంగ్ పునియాపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) సస్పెన్షన్ వేటు వేసింది. -
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
ఐపీఎల్ 17వ సీజన్లో సిరాజ్ తొలిసారి అత్యుత్తమ బౌలింగ్తో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించాడు. బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించాడు. -
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
క్రికెట్ అభిమానులను అలరించడానికి ప్రతి దేశం ఓ లీగ్ను నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటికే భారత్లో ఐపీఎల్, పాక్లో పీఎస్ఎల్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే, వచ్చే ఏడాది ఈ రెండు ఒకే సమయంలో జరిగే అవకాశం ఉంది. -
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
బెంగళూరు చేతిలో ఓటమితో గుజరాత్ కూడా ప్లేఆఫ్స్ అవకాశాలను దాదాపు దూరం చేసుకుంది. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. -
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్కు సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ ఎదురైంది. అతడూ ఘాటుగానే సమాధానం ఇచ్చాడు. -
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
బైక్ పార్కింగ్ విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న
-
ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈఓ రియాక్షన్ ఇదే..
-
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!