భాజపా అంటే.. బ్రిటిష్ జనతా పార్టీ
‘‘వందల ఏళ్ల క్రితం భారతీయులను విభజించి పాలించిన ఈస్ట్ ఇండియా కంపెనీ తరహాలోనే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ప్రవర్తిస్తున్నారు.
హామీలు అమలు చేయనందుకే కార్ఖానాకు కారు
జీహెచ్ఎంసీలో విలీనంతోనే కంటోన్మెంట్ సమస్యల పరిష్కారం
అత్తాపూర్, కంటోన్మెంట్ రోడ్షోల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
ఈనాడు-హైదరాబాద్, రాజేంద్రనగర్, బోయిన్పల్లి కార్ఖానా, న్యూస్టుడే: ‘‘వందల ఏళ్ల క్రితం భారతీయులను విభజించి పాలించిన ఈస్ట్ ఇండియా కంపెనీ తరహాలోనే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ప్రవర్తిస్తున్నారు. సముద్రం పక్కన వ్యాపారం చేసుకుంటామంటూ ఈస్ట్ ఇండియా కంపెనీ గుజరాత్లోని సూరత్లో ప్రస్థానాన్ని ప్రారంభించి.. భారత్ను ఆక్రమించింది. బ్రిటిష్వారు పాలించినప్పుడు రిజర్వేషన్లు లేవు. వారి ఆలోచనలనే మోదీ, అమిత్షా అమలు చేయాలని చూస్తున్నారు. అందుకే భాజపా అంటే భారతీయ జనతా పార్టీ కాదు.. బ్రిటిష్ జనతా పార్టీ. ఆ పార్టీ అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించండి’’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. గురువారం కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్రెడ్డికి మద్దతుగా హైదరాబాద్లోని అత్తాపూర్ చౌరస్తాలో, కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా అన్నానగర్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్షోల్లో ఆయన ప్రసంగించారు.
నమో అంటే నమ్మించి మోసం..
‘‘పదేళ్లుగా ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీని నమో అంటున్నారు. నమో అంటే నమ్మించి మోసం చేయడం. రైతుల ఆదాయాన్ని అదానీ, అంబానీ, అమెజాన్ కంపెనీలకు తాకట్టు పెట్టారు. రాష్ట్ర విభజన అంశాల్లో కీలకమైన బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయలేదు. రైల్ కోచ్ ఫ్యాక్టరీని కాజీపేట నుంచి లాతూర్కు తరలించారు. ట్రిపుల్ ఐటీ ఇవ్వలేదు. ఐటీఐఆర్ను రద్దు చేశారు. అతికష్టమ్మీద గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఇచ్చారు.
ప్రజల పట్ల కేసీఆర్ దుర్మార్గం..
సీఎంగా తొమ్మిదిన్నరేళ్లు పాలించిన కేసీఆర్... ప్రజల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించారు. ఇచ్చిన హామీలను అమలు చేయనందుకే ఆయన కారును ప్రజలు కార్ఖానాకు పంపించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా పనిచేసిన సాయన్న విషయంలో కేసీఆర్ అనుచితంగా వ్యవహరించారు. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించలేదు. ఉద్యమకారుడు గద్దర్.. కేసీఆర్ను కలిసేందుకు ప్రగతిభవన్కు వెళ్తే నాలుగు గంటలపాటు బయటే నిలబెట్టి వెనక్కి పంపించారు. ప్రగతిభవన్ తలుపులు కేవలం కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకే తెరిచారు. సాయన్న, గద్దర్ల ఉసురు తగలడం వల్లే ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయారు. చేవెళ్లలో మంచివారైన కాసాని జ్ఞానేశ్వర్కు టికెట్ ఇచ్చి.. విశ్వేశ్వర్రెడ్డికి ఓట్లు వేయాలంటూ కేసీఆర్ సైగలు చేస్తున్నారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు తొలగిస్తామంటూ దేశాన్ని భాజపా కలుషితం చేస్తోంది. విశ్వేశ్వర్రెడ్డి కుటుంబానికి మంచి చరిత్ర ఉంది. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ.. మీ కుటుంబ చరిత్రను కలుషితం చేసుకోవద్దు.
రంజిత్రెడ్డిని గెలిపిస్తే మూసీ ప్రక్షాళన
మూసీనది ప్రక్షాళనకు రూ.లక్ష కోట్లు అవసరం. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు, నిధులు రావాలంటే చేవెళ్ల ఎంపీగా రంజిత్రెడ్డిని గెలిపించాలి. మూసీతో పాటు జంట జలాశయాలను అభివృద్ధి చేస్తాం. వికారాబాద్ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే ఈ ప్రాంతాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో కలపాలి. అందుకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూములు ఇస్తామన్నా ససేమిరా అన్నారు. ఎంపీ హోదాలో కంటోన్మెంట్ ప్రాంతంలోని సమస్యల్లో సాధ్యమైనన్ని పరిష్కరించాను.
కరోనా సమయంలో మిలిటరీ ఆసుపత్రి మూతపడితే.. రూ.5 కోట్ల నిధులిచ్చి తెరిపించాను. ప్రజలకు వైద్యసేవలు అందించాలన్న లక్ష్యంతో అల్వాల్లో టిమ్స్ ఆసుపత్రి నిర్మాణాన్ని వేగవంతం చేశాం’’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థులు గడ్డం రంజిత్రెడ్డి(చేవెళ్ల), సునీతా మహేందర్రెడ్డి(మల్కాజిగిరి), కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీగణేశ్, ఎమ్మెల్యే మనోహర్రెడ్డి, నాయకులు అనితా హరినాథ్రెడ్డి, చిగురింత పారిజాతారెడ్డి, కస్తూరి నరేందర్, నిజాముద్దీన్, పామేన భీంభరత్ తదితరులు పాల్గొన్నారు. అత్తాపూర్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి సిక్కులు పాగా చుట్టి.. కృపాణం బహూకరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-1.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-6.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-7.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-4.png)
తాజా వార్తలు
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ