భాజపా అంటే.. బ్రిటిష్ జనతా పార్టీ
‘‘వందల ఏళ్ల క్రితం భారతీయులను విభజించి పాలించిన ఈస్ట్ ఇండియా కంపెనీ తరహాలోనే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ప్రవర్తిస్తున్నారు.
హామీలు అమలు చేయనందుకే కార్ఖానాకు కారు
జీహెచ్ఎంసీలో విలీనంతోనే కంటోన్మెంట్ సమస్యల పరిష్కారం
అత్తాపూర్, కంటోన్మెంట్ రోడ్షోల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
ఈనాడు-హైదరాబాద్, రాజేంద్రనగర్, బోయిన్పల్లి కార్ఖానా, న్యూస్టుడే: ‘‘వందల ఏళ్ల క్రితం భారతీయులను విభజించి పాలించిన ఈస్ట్ ఇండియా కంపెనీ తరహాలోనే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ప్రవర్తిస్తున్నారు. సముద్రం పక్కన వ్యాపారం చేసుకుంటామంటూ ఈస్ట్ ఇండియా కంపెనీ గుజరాత్లోని సూరత్లో ప్రస్థానాన్ని ప్రారంభించి.. భారత్ను ఆక్రమించింది. బ్రిటిష్వారు పాలించినప్పుడు రిజర్వేషన్లు లేవు. వారి ఆలోచనలనే మోదీ, అమిత్షా అమలు చేయాలని చూస్తున్నారు. అందుకే భాజపా అంటే భారతీయ జనతా పార్టీ కాదు.. బ్రిటిష్ జనతా పార్టీ. ఆ పార్టీ అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించండి’’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. గురువారం కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్రెడ్డికి మద్దతుగా హైదరాబాద్లోని అత్తాపూర్ చౌరస్తాలో, కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా అన్నానగర్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్షోల్లో ఆయన ప్రసంగించారు.
నమో అంటే నమ్మించి మోసం..
‘‘పదేళ్లుగా ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీని నమో అంటున్నారు. నమో అంటే నమ్మించి మోసం చేయడం. రైతుల ఆదాయాన్ని అదానీ, అంబానీ, అమెజాన్ కంపెనీలకు తాకట్టు పెట్టారు. రాష్ట్ర విభజన అంశాల్లో కీలకమైన బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయలేదు. రైల్ కోచ్ ఫ్యాక్టరీని కాజీపేట నుంచి లాతూర్కు తరలించారు. ట్రిపుల్ ఐటీ ఇవ్వలేదు. ఐటీఐఆర్ను రద్దు చేశారు. అతికష్టమ్మీద గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఇచ్చారు.
ప్రజల పట్ల కేసీఆర్ దుర్మార్గం..
సీఎంగా తొమ్మిదిన్నరేళ్లు పాలించిన కేసీఆర్... ప్రజల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించారు. ఇచ్చిన హామీలను అమలు చేయనందుకే ఆయన కారును ప్రజలు కార్ఖానాకు పంపించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా పనిచేసిన సాయన్న విషయంలో కేసీఆర్ అనుచితంగా వ్యవహరించారు. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించలేదు. ఉద్యమకారుడు గద్దర్.. కేసీఆర్ను కలిసేందుకు ప్రగతిభవన్కు వెళ్తే నాలుగు గంటలపాటు బయటే నిలబెట్టి వెనక్కి పంపించారు. ప్రగతిభవన్ తలుపులు కేవలం కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకే తెరిచారు. సాయన్న, గద్దర్ల ఉసురు తగలడం వల్లే ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయారు. చేవెళ్లలో మంచివారైన కాసాని జ్ఞానేశ్వర్కు టికెట్ ఇచ్చి.. విశ్వేశ్వర్రెడ్డికి ఓట్లు వేయాలంటూ కేసీఆర్ సైగలు చేస్తున్నారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు తొలగిస్తామంటూ దేశాన్ని భాజపా కలుషితం చేస్తోంది. విశ్వేశ్వర్రెడ్డి కుటుంబానికి మంచి చరిత్ర ఉంది. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ.. మీ కుటుంబ చరిత్రను కలుషితం చేసుకోవద్దు.
రంజిత్రెడ్డిని గెలిపిస్తే మూసీ ప్రక్షాళన
మూసీనది ప్రక్షాళనకు రూ.లక్ష కోట్లు అవసరం. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు, నిధులు రావాలంటే చేవెళ్ల ఎంపీగా రంజిత్రెడ్డిని గెలిపించాలి. మూసీతో పాటు జంట జలాశయాలను అభివృద్ధి చేస్తాం. వికారాబాద్ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే ఈ ప్రాంతాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో కలపాలి. అందుకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూములు ఇస్తామన్నా ససేమిరా అన్నారు. ఎంపీ హోదాలో కంటోన్మెంట్ ప్రాంతంలోని సమస్యల్లో సాధ్యమైనన్ని పరిష్కరించాను.
కరోనా సమయంలో మిలిటరీ ఆసుపత్రి మూతపడితే.. రూ.5 కోట్ల నిధులిచ్చి తెరిపించాను. ప్రజలకు వైద్యసేవలు అందించాలన్న లక్ష్యంతో అల్వాల్లో టిమ్స్ ఆసుపత్రి నిర్మాణాన్ని వేగవంతం చేశాం’’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థులు గడ్డం రంజిత్రెడ్డి(చేవెళ్ల), సునీతా మహేందర్రెడ్డి(మల్కాజిగిరి), కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీగణేశ్, ఎమ్మెల్యే మనోహర్రెడ్డి, నాయకులు అనితా హరినాథ్రెడ్డి, చిగురింత పారిజాతారెడ్డి, కస్తూరి నరేందర్, నిజాముద్దీన్, పామేన భీంభరత్ తదితరులు పాల్గొన్నారు. అత్తాపూర్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి సిక్కులు పాగా చుట్టి.. కృపాణం బహూకరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను భాజపా కాపాడుతుంది: అమిత్ షా
కేంద్రంలో మరోసారి మోదీ సర్కార్ వస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. -
తెలంగాణ ఉద్యమం అయిపోలేదు.. ఇంకా ఉంది: కేసీఆర్
తెలంగాణలో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా భారాస ప్రభుత్వమే వస్తుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. -
వాళ్లది రాజ్యాంగాన్ని మార్చే సమూహం: రాహుల్
భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. -
ప్రపంచం ముందు పాకిస్థాన్ను దోషిగా నిలబెట్టాం: కిషన్రెడ్డి
కాంగ్రెస్ హయాంలో దేశంలో అనేక కుంభకోణాలు జరిగాయని కేంద్ర మంత్రి, భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ఆరోపించారు. -
మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి: హరీశ్రావు
భారాస ప్రభుత్వ హయాంలో కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు ఇచ్చినట్లు మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్రావు గుర్తు చేశారు. -
9లోగా సంపూర్ణంగా రైతు భరోసా
‘‘రైతుభరోసా నిధులు జమ చేయలేదని కేసీఆర్, హరీశ్రావులు అంటున్నారు. డిసెంబరులోనే జమ చేయడం మొదలుపెట్టాం. -
కాంగ్రెసోళ్లు ఏమీ చేయరు
‘పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఎవరి మధ్య అంటే ఆగర్భ శ్రీమంతుడికి... భూగర్భ కార్మికుడికి మధ్య. కార్మికుడు గెలవాలా? ఆగర్భ శ్రీమంతుడు గెలవాలా? ఆలోచించండి. -
భాజపాకు ఓట్లు అడిగే అర్హత లేదు: మంత్రి ఉత్తమ్
భాజపాకు రాష్ట్రంలో ఓట్లు అడిగే అర్హత లేదని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రానికి భాజపా జాతీయ నాయకులు వరస కట్టారు.., కానీ తెలంగాణకు ఏం చేశారో చెప్పకుండా మతపరమైన విషయాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. -
‘ఇండియా’ కూటమికి ప్రధాని అభ్యర్థి ఎవరు?
భాజపా నుంచి ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ ఉన్నారని.. ‘ఇండియా’ కూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరని భాజపా నాయకురాలు తమిళిసై ప్రశ్నించారు. -
ఎవరికో ‘వరం’గల్..!
సాంస్కృతిక రాజధాని.. పర్యాటక కేంద్రాల నిలయం.. కాకతీయులు ఏలిన గడ్డ ఓరుగల్లులో లోక్సభ పోరు ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్లో ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో త్రిముఖపోరు నెలకొంది. -
అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్
అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. -
మాదిగలకు సీటివ్వని కాంగ్రెస్ను ఓడించాలి
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మాదిగలకు ఒక్క సీటూ ఇవ్వని కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. -
కాంగ్రెస్ వ్యతిరేక మార్పు మొదలైంది
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మార్పు మొదలైందని చెప్పిందో.. పార్లమెంటు ఎన్నికల్లో నిజంగానే కాంగ్రెస్కు వ్యతిరేకంగా మార్పు మొదలైందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టం చేశారు. -
రాజ్యాంగాన్ని మార్చేందుకే 400 సీట్లు అడుగుతున్నారు
‘‘దేశ ప్రజలందరూ స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో జీవించాలని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని మార్చాలన్న దుర్బుద్ధితోనే భాజపా నేతలు 400 లోక్సభ స్థానాలు గెలిపించాలంటున్నారు. -
గులాబీకి.. సవాలే
తెలంగాణ ఆవిర్భావం తర్వాత తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమిపాలైన భారాసకి.. వెంటనే వచ్చిన లోక్సభ ఎన్నికలు సవాలుగా మారాయి. -
100 సార్లకు పైగా రాజ్యాంగాన్ని మార్చిన కాంగ్రెస్
రిజర్వేషన్లను రద్దు చేసే ప్రసక్తే లేదని.. ప్రధాని మోదీ బతికున్నంత వరకు కొనసాగుతాయని ప్రకటించినా విషం చిమ్ముతున్నారని.. మళ్లీ ఆ ప్రస్తావన తెస్తే ప్రజలు తరిమికొట్టాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కోరారు. -
నేడు ఐదు బహిరంగ సభలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారం తార స్థాయికి చేరింది. అగ్రనేతల రాకతో మరింత పదునెక్కుతోంది. భాజపా, కాంగ్రెస్ జాతీయ నేతలు రాష్ట్రంలో వరుసగా సభల్లో పాల్గొననున్నారు. -
శాసనసభా పక్ష నేత పదవి బీసీలకు ఎందుకివ్వలేదు?
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను గెలిపిస్తే బలహీనవర్గాల(బీసీ)కు చెందిన వారిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి.. కనీసం శాసనసభాపక్ష నేత పదవి కూడా ఇవ్వలేదని.. దీనికి కారణమేమిటని కిషన్రెడ్డి, బండి సంజయ్లను మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ లేఖలో ప్రశ్నించారు. -
వాస్తవాలపై చర్చిద్దాం రండి
యూపీఏ పాలనలో, ఎన్డీయే హయాంలో తెలంగాణకు వచ్చిన కేంద్ర నిధులపై అర్థవంతమైన చర్చకు రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి కోరారు. -
మహిళలు, రైతులను మోసం చేసి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి: ఎంపీ అర్వింద్
మహిళలు, రైతులను మోసం చేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గద్దెనెక్కారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు.... -
గాడిద గుడ్డు ఇచ్చిన భాజపాకు కర్రు కాల్చి వాత పెట్టాలి: రేవంత్రెడ్డి
గజ్వేల్ నుంచి కేడీ వచ్చినా.. దిల్లీ నుంచి మోదీ వచ్చినా పాలమూరులో కాంగ్రెస్ను ఓడించలేరని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.