భారాస.. కాంగ్రెస్ కలిసిపోయాయ్
కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఉంటేనే తెలంగాణలో సంపూర్ణ అభివృద్ధి జరుగుతుందని భాజపా అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా అన్నారు. మూడోసారి నరేంద్ర మోదీని ప్రధానిగా చేస్తే తెలంగాణలో అవినీతిని అంతం చేస్తారని ప్రకటించారు.
రాష్ట్రాన్ని దిల్లీకి ఏటీఎం చేసిన హస్తం పార్టీ
కేంద్రంలో మోదీ ప్రభుత్వంతోనే తెలంగాణ సంపూర్ణ అభివృద్ధి
ఇక్కడ 12 స్థానాల్లో భాజపాను గెలిపించండి
4 శాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం
సిద్దిపేట విశాల జనసభలో అమిత్షా
సిద్దిపేట, న్యూస్టుడే: కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఉంటేనే తెలంగాణలో సంపూర్ణ అభివృద్ధి జరుగుతుందని భాజపా అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా అన్నారు. మూడోసారి నరేంద్ర మోదీని ప్రధానిగా చేస్తే తెలంగాణలో అవినీతిని అంతం చేస్తారని ప్రకటించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తక్కువ సమయంలోనే తెలంగాణను దిల్లీకి ఏటీఎంగా మార్చిందని విమర్శించారు. రాష్ట్రంలో భారాస, కాంగ్రెస్ కలిసిపోయాయని ఆరోపించారు. భారాస అనేక కుంభకోణాలకు పాల్పడిందన్నారు. ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్ట్, భూ కుంభకోణాలపై కాంగ్రెస్ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం పార్టీ నిర్వహించిన విశాల జనసభలో అమిత్షా పాల్గొని ప్రసంగించారు. మెదక్ నుంచి పోటీ చేస్తున్న భాజపా అభ్యర్థి రఘునందన్రావుకు వేసే ఓటు మోదీని తిరిగి ప్రధానిగా చేసేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. ‘‘రాష్ట్రంలో 12 స్థానాల్లో భాజపాను గెలిపించండి. మజ్లిస్ పార్టీకి భయపడి భారాస, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ విమోచనదినాన్ని అధికారికంగా నిర్వహించలేదు. కానీ భాజపాకు మజ్లిస్ అంటే భయంలేదు. అందుకే సెప్టెంబరు 17ను తెలంగాణ విమోచనదినంగా అధికారికంగా నిర్వహిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్, భారాస ప్రభుత్వాలు ముస్లింలకు అమలు చేసిన 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తాం. ఈ వాటాను రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తాం. దేశ వ్యాప్తంగా మోదీకి 400 సీట్లను ఇవ్వండి. పదేళ్లలో ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపింది. ఐదేళ్లలో రామమందిరం కేసు గెలవడమే కాకుండా అయోధ్యలో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన.. విగ్రహప్రతిష్ఠ నిర్వహించి అందరూ జై శ్రీరాం అనేలా చేశాం. మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసి కశ్మీర్ను శాశ్వతంగా భారతదేశంలో అంతర్భాగం చేసింది’’ అని అమిత్షా వివరించారు.
ప్రసంగం 9 నిమిషాలే...
దిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన అమిత్షా ప్రత్యేక హెలికాప్టర్లో సిద్దిపేటకు చేరుకున్నారు. సభ అనంతరం మళ్లీ శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చి భువనేశ్వర్ వెళ్లారు. సిద్దిపేట బహిరంగ సభలో అమిత్షా ప్రసంగం దాదాపు 9 నిమిషాలు సాగింది. వాస్తవానికి ఆయన మధ్యాహ్నం 12 గంటలకు రావాలి. 1.55కి వచ్చారు. పది నిమిషాల్లోనే పర్యటన ముగిసింది. ఆలస్యం, భువనేశ్వర్లో పార్టీ కార్యక్రమం నేపథ్యంలో ఆయన సిద్దిపేటలో తక్కువసేపే గడిపారు.
మోసానికి పర్యాయపదం కాంగ్రెస్: రఘునందన్రావు
భాజపా అభ్యర్థి ఎం.రఘునందన్రావు మాట్లాడుతూ మోసానికి పర్యాయపదమే కాంగ్రెస్ అని ఆరోపించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, పింఛనుదారులకు రూ.4 వేలు, మహిళలకు నెలకు రూ.2,500 సాయం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ప్రజలను ఆ పార్టీ వంచించిందని అన్నారు. బీసీలకు అది అన్యాయం చేసిందని జిల్లా నుంచి బీసీ ఎమ్మెల్యేకు క్యాబినెట్లో స్థానం కల్పించలేదన్నారు. దుబ్బాక, ఇతర ప్రాంతాల్లో భాజపా చేపట్టిన అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి తెలుగులో రాసిన పుస్తకం పోస్టు చేశానని చెప్పారు. నాలుగు పార్టీలు మారిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ హయాంలో కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకు ప్రాజెక్టులు నిర్మించారన్నారు. దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయానని తనను విమర్శించే నాయకులు.. కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోయిన విషయాన్ని గుర్తించాలన్నారు. రిజర్వేషన్లను తొలగిస్తారంటూ భాజపాపై దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత తమకే దక్కిందన్నారు. సిద్దిపేట, గజ్వేల్కు రైలు తెచ్చిన ఘనత కూడా తమదేనని అన్నారు. భాజపాను ఓడించేందుకు సీఎం, మాజీ మంత్రి రహస్య ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. భారాస లోక్సభ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి కేసీఆర్ కాళ్లు మొక్కి 2021లో ఎమ్మెల్సీ అయ్యారని, అప్పటి నుంచి జిల్లా ప్రజల కోసం ఒక్క రూపాయి వెచ్చించలేదని, ఎంపీగా గెలిచిన తరువాత రూ.100 కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేస్తానని చెబుతున్నారని విమర్శించారు. ఈ సభలో భాజపా రాష్ట్రనేత ఈటల రాజేందర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు జి.ప్రేమేందర్రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు జి.మోహన్రెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు.
‘సహారా ఇండియా’ బాధితుల నిరసన
ఏళ్ల కిందట సహారా ఇండియా సంస్థలో పెట్టుబడులు పెట్టిన పలువురు తమ సొమ్ము ఇప్పించాలంటూ అమిత్షా ప్రసంగిస్తున్న సమయంలో సభా ప్రాంగణంలో ప్లకార్డులు ప్రదర్శించారు. సభలో నిల్చుని సుమారు రెండు నిమిషాలు నిరసన వ్యక్తం చేయగా.. అది గమనించి ముందు వరుసల్లో ఉండే పార్టీ శ్రేణులు జై మోదీ అంటూ నినదించారు.
తెలంగాణ ప్రజల మూడ్ అంతా మోదీతో కలిసి వెళ్లాలని ఉంది. ప్రతి స్థానంలో కూడా కమలానికి ఓటేసి భాజపాను గెలిపించి మోదీకి మద్దతుగా నిలవాలని ప్రజలు నిర్ణయించుకున్నారు.
అమిత్షా
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రపంచం ముందు పాకిస్థాన్ను దోషిగా నిలబెట్టాం: కిషన్రెడ్డి
కాంగ్రెస్ హయాంలో దేశంలో అనేక కుంభకోణాలు జరిగాయని కేంద్ర మంత్రి, భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ఆరోపించారు. -
మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి: హరీశ్రావు
భారాస ప్రభుత్వ హయాంలో కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు ఇచ్చినట్లు మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్రావు గుర్తు చేశారు. -
9లోగా సంపూర్ణంగా రైతు భరోసా
‘‘రైతుభరోసా నిధులు జమ చేయలేదని కేసీఆర్, హరీశ్రావులు అంటున్నారు. డిసెంబరులోనే జమ చేయడం మొదలుపెట్టాం. -
కాంగ్రెసోళ్లు ఏమీ చేయరు
‘పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఎవరి మధ్య అంటే ఆగర్భ శ్రీమంతుడికి... భూగర్భ కార్మికుడికి మధ్య. కార్మికుడు గెలవాలా? ఆగర్భ శ్రీమంతుడు గెలవాలా? ఆలోచించండి. -
భాజపాకు ఓట్లు అడిగే అర్హత లేదు: మంత్రి ఉత్తమ్
భాజపాకు రాష్ట్రంలో ఓట్లు అడిగే అర్హత లేదని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రానికి భాజపా జాతీయ నాయకులు వరస కట్టారు.., కానీ తెలంగాణకు ఏం చేశారో చెప్పకుండా మతపరమైన విషయాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. -
‘ఇండియా’ కూటమికి ప్రధాని అభ్యర్థి ఎవరు?
భాజపా నుంచి ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ ఉన్నారని.. ‘ఇండియా’ కూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరని భాజపా నాయకురాలు తమిళిసై ప్రశ్నించారు. -
ఎవరికో ‘వరం’గల్..!
సాంస్కృతిక రాజధాని.. పర్యాటక కేంద్రాల నిలయం.. కాకతీయులు ఏలిన గడ్డ ఓరుగల్లులో లోక్సభ పోరు ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్లో ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో త్రిముఖపోరు నెలకొంది. -
అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్
అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. -
మాదిగలకు సీటివ్వని కాంగ్రెస్ను ఓడించాలి
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మాదిగలకు ఒక్క సీటూ ఇవ్వని కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. -
కాంగ్రెస్ వ్యతిరేక మార్పు మొదలైంది
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మార్పు మొదలైందని చెప్పిందో.. పార్లమెంటు ఎన్నికల్లో నిజంగానే కాంగ్రెస్కు వ్యతిరేకంగా మార్పు మొదలైందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టం చేశారు. -
రాజ్యాంగాన్ని మార్చేందుకే 400 సీట్లు అడుగుతున్నారు
‘‘దేశ ప్రజలందరూ స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో జీవించాలని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని మార్చాలన్న దుర్బుద్ధితోనే భాజపా నేతలు 400 లోక్సభ స్థానాలు గెలిపించాలంటున్నారు. -
గులాబీకి.. సవాలే
తెలంగాణ ఆవిర్భావం తర్వాత తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమిపాలైన భారాసకి.. వెంటనే వచ్చిన లోక్సభ ఎన్నికలు సవాలుగా మారాయి. -
100 సార్లకు పైగా రాజ్యాంగాన్ని మార్చిన కాంగ్రెస్
రిజర్వేషన్లను రద్దు చేసే ప్రసక్తే లేదని.. ప్రధాని మోదీ బతికున్నంత వరకు కొనసాగుతాయని ప్రకటించినా విషం చిమ్ముతున్నారని.. మళ్లీ ఆ ప్రస్తావన తెస్తే ప్రజలు తరిమికొట్టాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కోరారు. -
నేడు ఐదు బహిరంగ సభలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారం తార స్థాయికి చేరింది. అగ్రనేతల రాకతో మరింత పదునెక్కుతోంది. భాజపా, కాంగ్రెస్ జాతీయ నేతలు రాష్ట్రంలో వరుసగా సభల్లో పాల్గొననున్నారు. -
శాసనసభా పక్ష నేత పదవి బీసీలకు ఎందుకివ్వలేదు?
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను గెలిపిస్తే బలహీనవర్గాల(బీసీ)కు చెందిన వారిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి.. కనీసం శాసనసభాపక్ష నేత పదవి కూడా ఇవ్వలేదని.. దీనికి కారణమేమిటని కిషన్రెడ్డి, బండి సంజయ్లను మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ లేఖలో ప్రశ్నించారు. -
వాస్తవాలపై చర్చిద్దాం రండి
యూపీఏ పాలనలో, ఎన్డీయే హయాంలో తెలంగాణకు వచ్చిన కేంద్ర నిధులపై అర్థవంతమైన చర్చకు రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి కోరారు. -
మహిళలు, రైతులను మోసం చేసి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి: ఎంపీ అర్వింద్
మహిళలు, రైతులను మోసం చేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గద్దెనెక్కారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు.... -
గాడిద గుడ్డు ఇచ్చిన భాజపాకు కర్రు కాల్చి వాత పెట్టాలి: రేవంత్రెడ్డి
గజ్వేల్ నుంచి కేడీ వచ్చినా.. దిల్లీ నుంచి మోదీ వచ్చినా పాలమూరులో కాంగ్రెస్ను ఓడించలేరని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
కాంగ్రెస్ వచ్చిన ఐదు నెలల్లోనే రాష్ట్రం ఆగమైంది: కేసీఆర్
రాష్ట్రంలో పంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదని భారాస అధినేత కేసీఆర్ ఆరోపించారు. -
అబద్ధాల కాంగ్రెస్ను శిక్షించాల్సిందే: హరీశ్రావు
ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని, మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. -
కేసీఆర్.. కేంద్రంలోని ఏ సంకీర్ణంలో చేరతారు?: సీఎం రేవంత్
కేంద్రంలోని ఏ సంకీర్ణంలో చేరతారో కేసీఆర్ చెప్పాలని సీఎం రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. కొత్తగూడెంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు.
తాజా వార్తలు
-
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
-
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో