భారాస.. కాంగ్రెస్ కలిసిపోయాయ్
కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఉంటేనే తెలంగాణలో సంపూర్ణ అభివృద్ధి జరుగుతుందని భాజపా అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా అన్నారు. మూడోసారి నరేంద్ర మోదీని ప్రధానిగా చేస్తే తెలంగాణలో అవినీతిని అంతం చేస్తారని ప్రకటించారు.
రాష్ట్రాన్ని దిల్లీకి ఏటీఎం చేసిన హస్తం పార్టీ
కేంద్రంలో మోదీ ప్రభుత్వంతోనే తెలంగాణ సంపూర్ణ అభివృద్ధి
ఇక్కడ 12 స్థానాల్లో భాజపాను గెలిపించండి
4 శాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం
సిద్దిపేట విశాల జనసభలో అమిత్షా
సిద్దిపేట, న్యూస్టుడే: కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఉంటేనే తెలంగాణలో సంపూర్ణ అభివృద్ధి జరుగుతుందని భాజపా అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా అన్నారు. మూడోసారి నరేంద్ర మోదీని ప్రధానిగా చేస్తే తెలంగాణలో అవినీతిని అంతం చేస్తారని ప్రకటించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తక్కువ సమయంలోనే తెలంగాణను దిల్లీకి ఏటీఎంగా మార్చిందని విమర్శించారు. రాష్ట్రంలో భారాస, కాంగ్రెస్ కలిసిపోయాయని ఆరోపించారు. భారాస అనేక కుంభకోణాలకు పాల్పడిందన్నారు. ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్ట్, భూ కుంభకోణాలపై కాంగ్రెస్ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం పార్టీ నిర్వహించిన విశాల జనసభలో అమిత్షా పాల్గొని ప్రసంగించారు. మెదక్ నుంచి పోటీ చేస్తున్న భాజపా అభ్యర్థి రఘునందన్రావుకు వేసే ఓటు మోదీని తిరిగి ప్రధానిగా చేసేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. ‘‘రాష్ట్రంలో 12 స్థానాల్లో భాజపాను గెలిపించండి. మజ్లిస్ పార్టీకి భయపడి భారాస, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ విమోచనదినాన్ని అధికారికంగా నిర్వహించలేదు. కానీ భాజపాకు మజ్లిస్ అంటే భయంలేదు. అందుకే సెప్టెంబరు 17ను తెలంగాణ విమోచనదినంగా అధికారికంగా నిర్వహిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్, భారాస ప్రభుత్వాలు ముస్లింలకు అమలు చేసిన 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తాం. ఈ వాటాను రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తాం. దేశ వ్యాప్తంగా మోదీకి 400 సీట్లను ఇవ్వండి. పదేళ్లలో ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపింది. ఐదేళ్లలో రామమందిరం కేసు గెలవడమే కాకుండా అయోధ్యలో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన.. విగ్రహప్రతిష్ఠ నిర్వహించి అందరూ జై శ్రీరాం అనేలా చేశాం. మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసి కశ్మీర్ను శాశ్వతంగా భారతదేశంలో అంతర్భాగం చేసింది’’ అని అమిత్షా వివరించారు.
ప్రసంగం 9 నిమిషాలే...
దిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన అమిత్షా ప్రత్యేక హెలికాప్టర్లో సిద్దిపేటకు చేరుకున్నారు. సభ అనంతరం మళ్లీ శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చి భువనేశ్వర్ వెళ్లారు. సిద్దిపేట బహిరంగ సభలో అమిత్షా ప్రసంగం దాదాపు 9 నిమిషాలు సాగింది. వాస్తవానికి ఆయన మధ్యాహ్నం 12 గంటలకు రావాలి. 1.55కి వచ్చారు. పది నిమిషాల్లోనే పర్యటన ముగిసింది. ఆలస్యం, భువనేశ్వర్లో పార్టీ కార్యక్రమం నేపథ్యంలో ఆయన సిద్దిపేటలో తక్కువసేపే గడిపారు.
మోసానికి పర్యాయపదం కాంగ్రెస్: రఘునందన్రావు
భాజపా అభ్యర్థి ఎం.రఘునందన్రావు మాట్లాడుతూ మోసానికి పర్యాయపదమే కాంగ్రెస్ అని ఆరోపించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, పింఛనుదారులకు రూ.4 వేలు, మహిళలకు నెలకు రూ.2,500 సాయం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ప్రజలను ఆ పార్టీ వంచించిందని అన్నారు. బీసీలకు అది అన్యాయం చేసిందని జిల్లా నుంచి బీసీ ఎమ్మెల్యేకు క్యాబినెట్లో స్థానం కల్పించలేదన్నారు. దుబ్బాక, ఇతర ప్రాంతాల్లో భాజపా చేపట్టిన అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి తెలుగులో రాసిన పుస్తకం పోస్టు చేశానని చెప్పారు. నాలుగు పార్టీలు మారిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ హయాంలో కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకు ప్రాజెక్టులు నిర్మించారన్నారు. దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయానని తనను విమర్శించే నాయకులు.. కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోయిన విషయాన్ని గుర్తించాలన్నారు. రిజర్వేషన్లను తొలగిస్తారంటూ భాజపాపై దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత తమకే దక్కిందన్నారు. సిద్దిపేట, గజ్వేల్కు రైలు తెచ్చిన ఘనత కూడా తమదేనని అన్నారు. భాజపాను ఓడించేందుకు సీఎం, మాజీ మంత్రి రహస్య ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. భారాస లోక్సభ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి కేసీఆర్ కాళ్లు మొక్కి 2021లో ఎమ్మెల్సీ అయ్యారని, అప్పటి నుంచి జిల్లా ప్రజల కోసం ఒక్క రూపాయి వెచ్చించలేదని, ఎంపీగా గెలిచిన తరువాత రూ.100 కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేస్తానని చెబుతున్నారని విమర్శించారు. ఈ సభలో భాజపా రాష్ట్రనేత ఈటల రాజేందర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు జి.ప్రేమేందర్రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు జి.మోహన్రెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు.
‘సహారా ఇండియా’ బాధితుల నిరసన
ఏళ్ల కిందట సహారా ఇండియా సంస్థలో పెట్టుబడులు పెట్టిన పలువురు తమ సొమ్ము ఇప్పించాలంటూ అమిత్షా ప్రసంగిస్తున్న సమయంలో సభా ప్రాంగణంలో ప్లకార్డులు ప్రదర్శించారు. సభలో నిల్చుని సుమారు రెండు నిమిషాలు నిరసన వ్యక్తం చేయగా.. అది గమనించి ముందు వరుసల్లో ఉండే పార్టీ శ్రేణులు జై మోదీ అంటూ నినదించారు.
తెలంగాణ ప్రజల మూడ్ అంతా మోదీతో కలిసి వెళ్లాలని ఉంది. ప్రతి స్థానంలో కూడా కమలానికి ఓటేసి భాజపాను గెలిపించి మోదీకి మద్దతుగా నిలవాలని ప్రజలు నిర్ణయించుకున్నారు.
అమిత్షా
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-1.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-6.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-7.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-4.png)
తాజా వార్తలు
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి