రాయలసీమలో వైకాపాను నేలకూల్చండి
రాయలసీమలో వైకాపాను నేలకూల్చాలని తెదేపా, జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. సీమను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం దోచుకుంటోందని ఆరోపించారు.
ఓటర్లకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ పిలుపు
సీమను దోచుకున్న పెద్దిరెడ్డి కుటుంబం
ఆ దోపీడీలో జగన్కూ వాటా ఉందని ధ్వజం
పవన్ను ఓడించడానికి ఎంపీ మిథున్రెడ్డి కుట్రలు
150 మంది ఎర్రచందనం స్మగ్లర్లతో పిఠాపురం వెళ్లారన్న కిరణ్కుమార్రెడ్డి
ఈనాడు - కడప
రాయలసీమలో వైకాపాను నేలకూల్చాలని తెదేపా, జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. సీమను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం దోచుకుంటోందని ఆరోపించారు. ప్రజల డబ్బంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్రెడ్డి, సోదరుడు ద్వారకనాథ్రెడ్డి వద్దే ఉందని వివరించారు. రాయలసీమలో రౌడీయిజాన్ని పెంచి పోషిస్తున్నారని, సామాన్యులు ప్రశ్నిస్తే దాడులు, హత్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అన్నమయ్య జిల్లా రాజంపేట, రైల్వేకోడూరుల్లో గురువారం నిర్వహించిన తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి బహిరంగసభల్లో చంద్రబాబు ప్రసంగిస్తూ జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే ఏం జరుగుతుందో ప్రజలంతా గమనించారన్నారు. రాజంపేట ప్రజల జీవితాలు బాగుపడాలంటే ఎంపీ మిథున్రెడ్డిని ఓడించాలని పిలుపునిచ్చారు. సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న కుటుంబం కిరణ్కుమార్రెడ్డిదని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నమయ్య ప్రాజెక్టును పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టు బాధితులను ఆదుకుంటామన్నారు. పేదలకు మూడు సెంట్ల చొప్పున స్థలమిచ్చి, ఇళ్లు కట్టిస్తామని వాగ్దానం చేశారు. గాలేరు- నగరి కాలువను పూర్తి చేసి, కృష్జా జలాలను తీసుకొస్తామన్నారు.
ఏప్రిల్ నుంచే నెలకు రూ.4 వేల పింఛను
ఏప్రిల్ నుంచే రూ.4 వేల పింఛను ఇంటి వద్దే ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. 3 నెలల బకాయిలు జులైలో ఇస్తామన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణానికే మూడు పార్టీలతో జత కట్టామని వివరించారు. పవన్ కల్యాణ్ రాష్ట్రం కోసం ఆలోచించే వ్యక్తి అని.. నన్ను అక్రమంగా జైలుకు పంపినప్పుడు ఆయన స్పందనను మీరందరూ చూశారని అన్నారు. వైకాపా తప్పుడు ప్రచారాలను నమ్మకుండా ఎన్డీయేను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. పోయిన ఎన్నికల్లో కోడికత్తి, ఇప్పుడు గులకరాయి దెబ్బ అంటూ జగన్ డ్రామాలాడుతున్నారని విమర్శించారు. విశ్వసనీయత లేని జగన్ను చిత్తుగా ఓడించి.. ప్రజలే ఆయన గాయాలకు చికిత్స చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాజంపేట ఎంపీగా పోటీ చేస్తున్న భాజపా అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డి, రాజంపేట తెదేపా అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యం, రైల్వేకోడూరులో జనసేన నుంచి పోటీ చేస్తున్న అరవ శ్రీధర్లను అఖండ మెజారిటీతో గెలిపించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
పెద్దిరెడ్డి అరాచకాన్ని అంతం చేద్దాం: పవన్ కల్యాణ్
వైకాపా ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేద్దామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. రాజ్యాధికారం కొన్ని కుటుంబాల చేతుల్లో ఉందని, ఇది మారాలని ఆకాంక్షించారు. యువత తలచుకుంటే మార్పు ఎందుకు రాదు? పెద్దిరెడ్డి మిథున్రెడ్డిని ఎదుర్కొనే గుండెబలం యువతకు లేదా అని ప్రశ్నించారు. ఉపాధి అవకాశాలు లేక యువత రోడ్లపై తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంపదంతా దోచుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్రెడ్డి, ద్వారకనాథ్రెడ్డిలపై ప్రజలు ఓటుతో తిరగబడాలన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు ప్రమాదంలో ఉందని ముందే హెచ్చరించారని, ఇసుక తోడేయడంతోనే ప్రమాద తీవ్రతతో 39 మంది చనిపోయారని ఆరోపించారు. ప్రాజెక్టు కొట్టుకుపోతున్నా పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి పట్టించుకోలేదు.. ప్రశాంతంగా కూర్చుని మద్యం వ్యాపారం చేసుకున్నారని పవన్ దుయ్యబట్టారు. రాజంపేట ప్రాంతానికి పరిశ్రమలు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పెద్దిరెడ్డి ఈ ప్రాంతం తన జాగీరు అన్నట్లు వ్యవహరిస్తున్నారని, అంగళ్లలో చంద్రబాబుపై దాడి చేయించడమే కాకుండా 5 కేసులు పెట్టించారని పవన్ మండిపడ్డారు. పుంగనూరులో అరాచకాలకు పాల్పడుతున్నారని, పులిచెర్లలో ప్రశ్నించిన వ్యక్తి చేతులు విరగ్గొట్టారని, మరోచోట వీరి దందాను ప్రశ్నించిన వ్యక్తి రెండు కాళ్లు నరికేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక టిప్పర్లపై తమ పేరుంటే ఎవరూ ఆపడానికి లేదని హుకుం జారీ చేశారన్నారు. పెద్దిరెడ్డి ప్రాంతానికి అమూల్ డెయిరీ రాదని.. శ్రీజ డెెయిరీని నాశనం చేశారని ఆరోపించారు. అన్నమయ్య ప్రాజెక్టులో ప్రమాదాన్ని గుర్తించి ఎన్నో ప్రాణాలను కాపాడిన లష్కర్ రామయ్యకు జనసేన తరఫున సాయం అందజేసి గౌరవించామన్నారు. సారా వ్యాపారం చేసుకునే మిథున్రెడ్డి నన్ను పిఠాపురంలో ఓడిస్తారట అని ఎద్దేవా చేశారు. పిఠాపురంలో తనను ఓడించడానికి వచ్చిన మిథున్రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
పెద్దిరెడ్డి కుటుంబం మీ ఆస్తులనూ దోచేస్తారు: నల్లారి
పెద్దిరెడ్డి కుటుంబం సహజవనరుల్ని దోచుకుందని, మరోసారి అవకాశం ఇస్తే మీ ఆస్తులనూ కాజేస్తుందని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి ప్రజలను హెచ్చరించారు. వారికి ఈ ఎన్నికల్లో తగిన శాస్తి చేయాలని కోరారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ను ఓడించడానికి ఎంపీ మిథున్రెడ్డి 150 మంది ఎర్రచందనం స్మగ్లర్లను తీసుకెళ్లినట్లు తనకు సమాచారం ఉందని ఆయన చెప్పారు. పవన్ను ఓడించడం ఎవరితరం కాదన్నారు.
మాజీ సీఎంల ముచ్చట్లు
మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కిరణ్కుమార్రెడ్డి తొలిసారిగా బహిరంగ వేదికపై కలిశారు. సభావేదికపైకి వచ్చిన చంద్రబాబుకు కిరణ్కుమార్రెడ్డి నమస్కరించబోయారు. మనిద్దరి మధ్య నమస్కారాలేంటి అంటూ చంద్రబాబు ఆయన చేతులు పట్టుకుని వారించారు. వేదికపైనే ఇద్దరూ కాసేపు కుశల ప్రశ్నలు వేసుకుని మాట్లాడుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సాయి ధరమ్తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత.. జనసైనికులపై వైకాపా వర్గీయుల దాడి
జనసేనాని పవన్ కల్యాణ్కు మద్దతుగా సినీ హీరో సాయి ధరమ్ తేజ్ చేపట్టిన ప్రచారంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో జనసైనికులపై వైకాపా వర్గీయులు ఆదివారం రాత్రి దాడికి పాల్పడ్డారు. -
మూడు కబ్జాలు.. ఆరు సెటిల్మెంట్లు.. ఇదీ వైకాపా పాలన: పవన్ కల్యాణ్
వైకాపా పాలన మూడు కబ్జాలు.. ఆరు సెటిల్మెంట్లుగా ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. -
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. ప్రజల మెడకు ఉరితాడు: చంద్రబాబు
సూపర్ సిక్స్, మోదీ హమీలు చూసి జగన్కు నిద్రపట్టడం లేదని తెదేపా(TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డిపై బదిలీ వేటు
ap dgp rajendranath reddy: ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. -
సీఎం రమేశ్పై దాడి.. జగన్ ఫ్రస్టేషన్కు ఉదాహరణ: గంటా శ్రీనివాసరావు
అనకాపల్లి లోక్సభ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్పై దాడిని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఖండించారు. -
పోస్టల్ బ్యాలెట్ల పోలింగ్ ప్రక్రియలో తీవ్ర గందరగోళం
పోస్టల్ బ్యాలెట్ల పోలింగ్ ప్రక్రియలో ఏర్పడిన గందరగోళం, అయోమయ పరిస్థితులు పోలింగ్ అధికారులను కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. -
మా మామ నీచుడు.. అతనికి ఓటేస్తే సమాజానికి చేటు: డాక్టర్ గౌతమ్
ఏపీ మంత్రి, సత్తెనపల్లి వైకాపా అభ్యర్థి అంబటి రాంబాబుకు ఓటు వేస్తే పవిత్రమైన ఎమ్మెల్యే పదవి అపవిత్రమవుతుందని ఆయన రెండో అల్లుడు గౌతమ్ అన్నారు. -
రాబోయేది ఎన్డీయేనే.. మళ్లీ ప్రధాని మోదీనే: ధర్మవరం సభలో చంద్రబాబు
దేశంలో రాబోయేది ఎన్డీయేనే.. మళ్లీ ప్రధాని అయ్యేది మోదీనే అని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. రాష్ట్రంలో ధర్మాన్ని గెలిపించేందుకు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. -
ఏపీలో చంద్రబాబు.. కేంద్రంలో మోదీ వస్తే రెండేళ్లలో పోలవరం పూర్తి: అమిత్షా
ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే తెదేపా, జనసేనతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని భాజపా అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్షా అన్నారు. -
ఏపీలో ఇద్దరు డీఎస్పీలపై ఈసీ బదిలీ వేటు
ఏపీలో ఇద్దరు డీఎస్పీలపై బదిలీ వేటు వేశారు. వారిపై అందిన ఫిర్యాదులపై మేరకు ఎన్నికల సంఘం ఈ చర్యలు తీసుకుంది. -
పొలాల్లో నాటిన హద్దు రాళ్లే.. జగన్ ఓటమికి శిలాఫలకాలు
జగనన్న భూరక్ష పేరిట రైతుల పొలాల్లో నాటిన హద్దురాళ్లే జగన్ ప్రభుత్వ ఓటమికి శిలాఫలకాలని, ఆ పథకం పెద్ద బోగస్ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. -
పార్టీ మారారని పొట్ట కొట్టిన వైకాపా నాయకులు
వైకాపా నాయకుల ఆగడాలు ఆగడం లేదు. తెదేపా సభలకు వెళ్లారని, ప్రచారంలో పాల్గొన్నారని, తమ పార్టీలో చేరలేదని వైకాపా శ్రేణులు... దాడులకు పాల్పడుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. -
అంగీకారం.. అభ్యంతరం.. రెండూ ఆయనవే!
‘ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ఎవరికైనా అభ్యంతరాలుంటే అప్పిలేట్ అథారిటీ (జిల్లా జడ్జి స్థాయి అధికారి) దృష్టికి తీసుకెళ్లొచ్చు. -
ప్రతి రంగంలోనూ మార్పులు తెచ్చాం
‘ఎన్నడూ లేని విధంగా ఈ 59 నెలల్లో రాష్ట్రంలోని ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తెచ్చాం. 2.31 లక్షల ఉద్యోగాలిచ్చాం. రూ.2.70 లక్షల కోట్లను అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం. -
జగన్ పాలనంతా బూతులు.. గోతులే
‘ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేసి పసుపు కుంకుమ కింద ఇచ్చే పొలాలకు జిరాక్స్ పత్రాలు ఇస్తామా? వాటికి విలువ ఉంటుందా? అందుకే వైకాపా ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ను వ్యతిరేకించాలని కోరుతున్నా. -
నరసాపురం.. కూటమిదే బలం!
సాగునీరందక పంట విరామం.. తాగునీరు కొనుక్కోవాల్సిన దుస్థితి.. ఆక్వా రంగానికి వెన్నెముకగా నిలిచిన భీమవరంలో జే ట్యాక్స్.. ఇంటికి పునాది పడితే ‘కే’ ట్యాక్స్.. ఇదీ నరసాపురం లోక్సభ నియోజకవర్గంలో పరిస్థితి. -
జగన్ ఇంటి సమీపంలో యువతిపై అఘాయిత్యం కేసులో చర్యలేవి?
సీఎం జగన్ ఇంటి సమీపంలో యువతిపై జరిగిన అఘాయిత్యం కేసు నిందితుల్ని ఇంతవరకు పోలీసులు ఎందుకు శిక్షించలేదని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామినీశర్మ ప్రశ్నించారు. -
మేం అధికారంలోకి వచ్చాక రౌడీలు జైల్లోకే!
ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక రౌడీలు దేశమైనా వదలాలి.. జైళ్లలోనైనా ఉండాలని తెదేపా ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. చట్టాలను అతిక్రమించినవారి భరతం పట్టేందుకే ‘రెడ్ బుక్’ ఉందని హెచ్చరించారు. -
దళిత, గిరిజనులను జగన్ బిచ్చగాళ్లలా చూశారు
ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి జగన్.. దళిత, గిరిజనులను అడుక్కునేవాళ్లలా చూశారని, వారి అభివృద్ధికి చేసిందేమీ లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విరుచుకుపడ్డారు. -
మంత్రాలయం ఎమ్మెల్యేకి నిరసన సెగ
కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం చిన్నకడబూరు గ్రామంలో శనివారం ఎన్నికల ప్రచార నిమిత్తం వచ్చిన మంత్రాలయం ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి వై.బాలనాగిరెడ్డికి చుక్కెదురైంది. -
పోస్టల్ బ్యాలెట్కు రూ.3 వేలు
తమకు ఓటేస్తే రూ.3 వేలు ఇస్తామని కొందరు ఉద్యోగులకు వైకాపా నాయకులు ఎర వేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం పోస్టల్ బ్యాలెట్ వినియోగించే కేంద్రాల్లోకి సెల్ఫోన్లు అనుమతించకూడదు.
తాజా వార్తలు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!