Kerala: మామ సంపదపై కన్నేసి.. రూ.100 కోట్లకుపైగా కాజేసి!
పిల్లనిచ్చిన మామ ఇంటికే కన్నం పెట్టాడో అల్లుడు. ఆయన సంపదపై కన్నేసి.. స్థిర, చరాస్తుల రూపంలో ఏకంగా రూ.100 కోట్లకుపైగా కొల్లగొట్టడం గమనార్హం. అల్లుడి చేతిలో మోసపోయినట్లు ఐదేళ్లకు గ్రహించిన ఆయన.. ఇటీవల పోలీసులను ఆశ్రయించారు. కేరళలో ఈ వ్యవహారం వెలుగుచూసింది.
తిరువనంతపురం: పిల్లనిచ్చిన మామ ఇంటికే కన్నం పెట్టాడో అల్లుడు. ఆయన సంపదపై కన్నేసి.. స్థిర, చరాస్తుల రూపంలో ఏకంగా రూ.100 కోట్లకుపైగా కొల్లగొట్టడం గమనార్హం. అల్లుడి చేతిలో మోసపోయినట్లు ఐదేళ్లకు గ్రహించిన ఆయన.. ఇటీవల పోలీసులను ఆశ్రయించారు. కేరళలో ఈ వ్యవహారం వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. దుబాయ్లో ఉండే అబ్దుల్ లాహీర్ హసన్ అనే వ్యాపారవేత్త.. కేరళకు చెందిన మహమ్మద్ హఫీజ్కు 2017లో తన కుమార్తెనిచ్చి వివాహం జరిపించారు. ఆ సమయంలో వెయ్యి సవర్ల బంగారాన్ని తన బిడ్డకు బహుమతిగా ఇచ్చారు.
ఈ క్రమంలోనే మామ ఆస్తిపై కన్నేసిన అతను.. క్రమంగా ఆయన ఆస్తులను తన పేరు మీద మార్చుకోవడం ప్రారంభించాడు. ఇలా సుమారు రూ.107 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను కాజేశాడు. సొంత అల్లుడే తనను మోసం చేశాడని ఎట్టకేలకు గుర్తించిన హసన్.. మూడు నెలల క్రితమే కేరళలోని అలువ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రూ.100 కోట్లకుపైగా మోసం, నిందితుడు పరారీలో ఉండటం తదితర కారణాలతో తాజాగా ఈ కేసును క్రైం బ్రాంచ్కు బదిలీ చేశారు. ఈ వ్యవహారంలో హఫీజ్తోపాటు అతని సహచరుడు అక్షయ్ థామస్ వైద్యన్ పాత్ర కూడా ఉందని హసన్ తన ఫిర్యాదు పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడుల్లో జరిమానా పడిందని, ఈ మొత్తాన్ని చెల్లించేందుకు దాదాపు రూ.4 కోట్లు కావాలని అడిగినప్పటి నుంచి ఈ మోసాల తంతు మొదలైందని హసన్ వెల్లడించారు. స్థలాల కొనుగోలు, చెప్పుల షోరూం ఏర్పాటు.. ఇలా రకరకాల సాకులు చెబుతూ రూ.92 కోట్ల వరకు రాబట్టాడని వాపోయారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా.. నిందితుడిని అరెస్టు చేయడంలో వారు విఫలమైనట్లు ఆయన ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ ఆరోపించారు. ఇప్పటివరకు అతని వద్ద నుంచి రూ.కోటిన్నర విలువైన కారును కూడా స్వాధీనం చేసుకోలేకపోయారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంతర్జాతీయ కోడ్తో వాట్సప్ కాల్స్!
బంజారాహిల్స్ వాసి దినేశ్కు +84 (వియత్నాం) కోడ్తో మొదలయ్యే నంబర్ నుంచి వాట్సప్ వీడియోకాల్ వచ్చింది. అది విదేశీ నంబర్ కావడంతో అనుమానంతో అతను లిఫ్ట్ చేయలేదు. -
ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు శుక్రవారం పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలోని నెమలిగూడకు చెందిన పొడియం ఇడుమయ్య అలియాస్ హరీశ్, ఉయికే ముత్యాలక్క లు భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఎదుట లొంగిపోయినట్లు తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏఎస్పీ తెలిపారు. -
‘మృత్యు’ ప్రయాణం!
సెలవులు...శుభకార్యాలు. వెరసి వేసవికాలంలో..ముఖ్యంగా మే నెలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారులు, హైవేల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదయ్యాయి. -
కొట్టేసిన ఫోన్లు సూడాన్కు.. స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
రాష్ట్రంలో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తున్న, వాటిని కొనుగోలు చేస్తున్న 12 మంది సభ్యులున్న ముఠాను హైదరాబాద్ సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. -
పెళ్లి వేడుకలో అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురి మృతి
బిహార్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. దర్భంగా ప్రాంతంలో జరిగిన ఓ వివాహ వేడుకలో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో ప్రమాదాలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శుక్రవారం రెండు వేర్వేరు చోట్ల ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. ఆ రెండు బస్సులూ కాలం చెల్లినవే కావడం గమనార్హం. -
ఆలిన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని ఆలిన్ ఫార్మసీ కంపెనీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
నీటి బకెట్లో పడి చిన్నారి మృతి
నీటి బకెట్లో పడి ఊపిరాడక 18 నెలల చిన్నారి స్నేహిత మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో జరిగింది. -
ఏనుగు దాడిలో మరో ఇద్దరి రైతుల మృతి
కుమురం భీం జిల్లాలో ఇటీవల ఇద్దరిని చంపిన ఏనుగు మహారాష్ట్రలో మరో ఇద్దరిని బలి తీసుకుంది. -
స్టాక్ ట్రేడింగ్లో లాభాలిస్తామని రూ.కోటి కాజేత
సైబర్ వలలో చిక్కుకున్న ఓ విద్యార్థిని రూ.కోటికి పైగా డబ్బు పోగొట్టుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్