Suryapet: సూర్యాపేటలో ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి, నలుగురి పరిస్థితి విషమం

హైదరాబాద్‌ - విజయవాడ 65వ జాతీయ రహదారిపై సూర్యాపేట హైటెక్‌ బస్‌స్టాండ్‌ సమీపంలో ఘోర  ప్రమాదం జరిగింది. 

Updated : 04 Apr 2024 18:52 IST

సూర్యాపేట నేరవిభాగం: హైదరాబాద్‌ - విజయవాడ 65వ జాతీయ రహదారిపై సూర్యాపేట హైటెక్‌ బస్‌స్టాండ్‌ సమీపంలో గురువారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఆటో ఢీ కొట్టింది. ఈ ఘటనలో.. సూర్యాపేట పట్టణానికి చెందిన పుట్టా సరిత (41) (ఉపాధ్యాయురాలు) అక్కడిక్కడే మృతి చెందింది. సూర్యాపేట మండలం లక్ష్మీతండాకు చెందిన రుణావత్‌ రుక్కమ్మ(63), రెండేళ్ల చిన్నారి సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మిగిలిన క్షతగాత్రులకు వైద్య సేవలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిలో మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాద సమయంలో ఆటోలో 14 మంది ప్రయాణికులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని