HRC: మంత్రి శ్రీనివాస్గౌడ్, ఆయన సోదరుడిపై హెచ్చార్సీలో ఫిర్యాదు
రాష్ట్ర మంత్రి శ్రీనివాస్గౌడ్, ఆయన సోదరుడు శ్రీకాంత్గౌడ్ల నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ మహబూబ్నగర్ జిల్లాకు చెందిన విశ్వనాథరావు, పుష్పలత దంపతులు బుధవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (ఎస్హెచ్ఆర్సీ)ని ఆశ్రయించారు.
నారాయణగూడ, న్యూస్టుడే: రాష్ట్ర మంత్రి శ్రీనివాస్గౌడ్, ఆయన సోదరుడు శ్రీకాంత్గౌడ్ల నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ మహబూబ్నగర్ జిల్లాకు చెందిన విశ్వనాథరావు, పుష్పలత దంపతులు బుధవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (ఎస్హెచ్ఆర్సీ)ని ఆశ్రయించారు. 2018 ఎన్నికల సమయంలో ఓ కేసులో శ్రీనివాస్గౌడ్కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పామని అక్రమ కేసులు పెట్టించి వేధింపులకు పాల్పడుతున్నారని కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. సీఐ మహేశ్వర్తో అర్ధరాత్రి వేళలో ఇంటిపై దాడులు చేయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఓ పైవేటు సంస్థలో పనిచేస్తున్న తమ ఇద్దరినీ ఉద్యోగాల్లోంచి తీయించేశారని ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా వేధింపులు ఆగకపోతే మంత్రి, ఆయన సోదరుడి పేర్లతో లేఖ రాసి ఠాణా ముందు ఆత్మహత్య చేసుకుంటామని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్