Road Accident: రోడ్డు ప్రమాదంలో కుటుంబమే కూలిపోయింది
విధి ఎవరిని ఎప్పుడు ఎలా బలితీసుకుంటుందో.. ఎవరికీ తెలియదు. శుభకార్యంలో పాల్గొనేందుకు ఆనందంగా కారులో వెళుతున్న ఓ కుటుంబాన్ని పంక్చరు రూపంలో మృత్యువు కబళించింది. దీంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలిన సంఘటన శనివారం సాయంత్రం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు...
నలుగురి దుర్మరణం
న్యూస్టుడే, బత్తలపల్లి, ధర్మవరం
విధి ఎవరిని ఎప్పుడు ఎలా బలితీసుకుంటుందో.. ఎవరికీ తెలియదు. శుభకార్యంలో పాల్గొనేందుకు ఆనందంగా కారులో వెళుతున్న ఓ కుటుంబాన్ని పంక్చరు రూపంలో మృత్యువు కబళించింది. దీంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలిన సంఘటన శనివారం సాయంత్రం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు... బత్తలపల్లి మండలం జ్వాలాపురం వద్ద జాతీయ రహదారిపై శనివారం కారు, లారీ ఢీకొన్న ఘటనలో అమ్మాజీ (50), ఆమె కొడుకు రెడ్డి బాషా (25), కూతురు రేష్మా (30), అల్లుడు బాబు బుడాన్ (36) మృతి చెందారు. జాస్మియాబాను అనే చిన్నారికి గాయాలయ్యాయి.
తనకల్లు మండలం పెద్దకడపలవారిపల్లికి చెందిన అమ్మాజీ, రెడ్డిపీరా కుటుంబం జీవనాధారం కోసం 15 ఏళ్ల కిందట చిత్తూరు జిల్లా మదనపల్లెకి వెళ్లింది. రెడ్డిపీరా క్రషర్ మిషన్లో పనిచేస్తూ జీవనం సాగించేవారు. ఏటా ఖరీఫ్లో పెద్దకడపలవారిపల్లికి వచ్చి పంటలు సాగు చేస్తుండేవారు. అనంతపురంలో ఆదివారం జరిగే బంధువుల వివాహ కార్యక్రమానికి వీరంతా మదనపల్లి నుంచి కారులో బయలుదేరారు. జ్వాలాపురం వద్దకు రాగానే కారు టైరు పంక్చరు కావడంతో అదుపుతప్పి అనంతపురం నుంచి చెన్నై వెళుతున్న లారీని ఢీకొంది. కారు - లారీ వేగంగా ఢీకొనడంతో సంఘటనా స్థలంలోనే నలుగురూ మృతి చెందారు. మృతదేహాలు కారులో ఇరుక్కుపోయాయి. సమాచారం అందుకున్న ధర్మవరం డీఎస్పీ రమాకాంత్, బత్తలపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీయించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం పెద్దకడపలవారిపల్లి, మదనపల్లెలో నక్కలదిన్నెలోని బంధువుల ఇళ్లలో తీవ్ర విషాదం నెలకొంది. రెడ్డిపీీరా కన్నీటిపర్యంతమయ్యారు. దేవుడా.. ఎంతపని చేశావయ్యా.. అంటూ గుండెలవిసేలా రోదించారు. ప్రమాద ఘటనపై బత్తలపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇక్కడే ఉన్నా బాగుండు..
తనకల్లు: అనంతపురంలో సమీప బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు మదనపల్లె నుంచి కారులో బయల్దేరిన అమ్మాజీ కుటుంబం తనకల్లులోని గ్యాస్ కార్యాలయ సమీపంలో నివాసముండే మేనమామ హుస్సేన్సాబ్ను కలిసింది. మేనమామ ఇంటికి వెళ్లి టీ తాగిన అమ్మాజీ, కుమార్తె రేష్మా, అల్లుడు బాబు, కుమారుడు రెడ్డిబాషాలు అనంతరం శనివారం సాయంత్రం అనంతపురానికి బయలుదేరారు. వివాహం ఆదివారం ఉన్నందున రాత్రికి ఇక్కడే ఉండి ఉదయం వెళ్లాలని చెప్పామని, తమమాట విని ఉంటే ప్రాణాలతో ఉండేవారని హుస్సేన్సాబ్ కుటుంబ సభ్యులు విలపించారు. తమ యోగక్షేమాలు ఆరా తీసి వెళ్లిన గంటలోనే ఇలాంటి విషాదకర మాట వినాల్సి వచ్చిందని రోదించారు.
మృత్యుంజయురాలు ఆ చిన్నారి
ఈ ప్రమాదంలో జాస్మియాబాను అనే అయిదేళ్ల చిన్నారి ప్రాణాలతో బయటపడింది. ప్రమాద సమయంలో చిన్నారి కారులో ఇరుక్కుపోగా స్థానికులు, పోలీసులు గమనించి బాలికను వెలికితీశారు. వెంటనే చికిత్స నిమిత్తం అనంతపురం నగరంలోని సవేరా ఆసుపత్రికి తరలించారు. అమ్మ, అమ్మమ్మ మధ్యన కూర్చొని ప్రయాణిస్తుండటం వల్లే చిన్నారి ప్రాణాపాయం నుంచి బయటపడిందని బత్తలపల్లి పోలీసులు తెలిపారు.
ప్రాణం నిలిపిన పింఛను
రెడ్డిపీరా తల్లి ఇమామ్బీ సైతం కారులో వివాహానికి బయలుదేరి వెళ్లింది. నవంబరు 1న వృద్ధాప్య పింఛను తీసుకోవాలన్న విషయం గుర్తు చేసుకున్నారు. మార్గమధ్యలోనే ఆమె స్వగ్రామం అనంతపురం జిల్లా తనకల్లు మండలం కడపలవారిపల్లెలో విడిచిపెట్టి వెళ్లారు. దీంతో వృద్ధురాలు ప్రాణాలతో బయటపడ్డారంటూ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
నక్కలదిన్నెలో విషాదం
రెడ్డిపీరా కుటుంబ సభ్యులు ఎంతో అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారని మదనపల్లెలో ఆయన నివాసం చుట్టుపక్కల వారు గుర్తు చేసుకుంటూ విలపించారు. మధ్యాహ్నమే ఎంతో ఆనందంగా బయలుదేరి వెళళ్లారని, ఇల్లును జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్లారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మాజీ వదిన షకీల భాను విషాద వార్త వినగానే స్పృహ కోల్పోయారు. ఇంటిని జాగ్రత్తగా చూసుకోమంటూ వెళ్లిన వారు... ఇంతలోనే ప్రాణాలు కోల్పోయారా... అంటూ విలపించారు. రెడ్డిపీరా ప్రస్తుతం అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. కుటుంబం స్థిరపడటంతో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. జనవరిలో గృహప్రవేశం చేయాల్సి ఉండగా ఈ పరిణామం జరిగింది. గత ఏడాది ఇదే పట్టణం నుంచి ఆధ్యాత్మిక యాత్రకు వెళుతూ కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. ఆ తర్వాత మరో ఘటన జరిగింది. శనివారం ఘటనలో మరణించిన వారి మృతదేహాలకు తనకల్లు మండలంలోని స్వగ్రామంలో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘోరం.. సెల్ఫోన్ టార్చ్లైట్ వెలుగులో ప్రసవం.. తల్లీబిడ్డ మృతి
ముంబయి మహానగరంలో కనీస సదుపాయాలు అందక ఓ నిండు గర్భిణీ ప్రాణాలు విడిచింది. ఆసుపత్రి తీవ్ర నిర్లక్ష్యం ఓ కుటుంబానికి తీరని నష్టాన్ని మిగిల్చింది. -
వైకాపా సర్పంచి వాహనంలో ‘ఎన్నికల’ మద్యం పట్టివేత
వైకాపాకు చెందిన గ్రామ సర్పంచి వాహనంలో మద్యం సీసాలు పట్టుబడ్డాయి. అధికారుల వివరాల మేరకు.. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల శివారులోని పల్నాడు బార్ అండ్ రెస్టారెంటులో గురజాల నియోజకవర్గం వీరాపురం గ్రామానికి చెందిన వైకాపా సర్పంచి సుంకర విజయరామారావు, కేసనపల్లి గ్రామానికి చెందిన గణేష్బాబు 1,056 మద్యం సీసాలు కొనుగోలు చేసి, వాహనంలో తీసుకెళ్తున్నారు. -
కానిస్టేబుల్కు విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చిన దుండగులు
కొందరు దుండగులు విషపూరిత ఇంజెక్షన్ ఇవ్వడంతో ఆసుపత్రిపాలైన ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. ముంబయిలో ఈ ఘటన చోటుచేసుకుంది. -
హోమియోపతి మందులతో నకిలీ మద్యం తయారీ
విశాఖ నగరంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి మద్యం తయారీకి వాడుతున్న రసాయనాలు, లేబుళ్లు, సీసాలను స్వాధీనం చేసుకున్నారు. -
గుంటూరులో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్
గుంటూరులోని నెహ్రూనగర్ ప్రాంతంలో గురువారం రాత్రి గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. అడ్డొచ్చిన వారిని కొడుతూ బీభత్సం సృష్టించింది. మహిళలు, వృద్ధులనీ చూడకుండా మత్తులో ఉన్న 15 మంది దాడులకు తెగబడ్డారు. -
ఎంత డబ్బో.. ఎవరి సొమ్మో!
ఎన్నికల నిబంధనల వేళ ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న రూ.2.40కోట్ల నగదును పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. -
పంట వ్యర్థాలకు నిప్పు.. మంటల ధాటికి రైతు బలి
వానాకాలం సాగుకు పొలాన్ని సిద్ధం చేయడానికి మొక్కజొన్న, పత్తి పంట వ్యర్థాలకు నిప్పు పెట్టిన రైతు.. మంటల వేడి, పొగ కారణంగా తనూ మృతి చెందిన విషాదకర సంఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకొంది. -
ఛత్తీస్గఢ్లో ఇద్దరిని హత్య చేసిన మావోయిస్టులు
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. వరుస ఎదురుదెబ్బలతో సతమతమవుతున్న మావోయిస్టులు బీజాపూర్ జిల్లాలోని తర్రెమ్ పోలీసుస్టేషన్ పరిధిలోని చుత్వాహి గ్రామానికి చెందిన సోదరులు మండవి జోగ(45), మండవి హుంగా(43)ను దారుణంగా హత్య చేశారు. -
ఫోన్ ట్యాప్ చేశారని ఫిర్యాదు
తమ సెల్ఫోన్లను ట్యాప్ చేశారని హైదరాబాద్ సరూర్నగర్లోని ద్వారకా తిరుమల కాలనీకి చెందిన ఇ.విజయపాల్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఏసీపీ టి.కృపాకర్ (ప్రస్తుతం కాజీపేటలో రైల్వే డీఎస్పీ), విశ్రాంత సీఐ దాసరి భూమయ్యలపై కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ జిల్లా జమ్మికుంట సీఐ వి.రవి గురువారం తెలిపారు. -
చెత్త కుప్పల మంటల్లో పడి కూలీ మృతి
తగలబడుతున్న చెత్తలో పడి ఓ నిర్మాణ కార్మికుడు సజీవ దహనం అయ్యాడు. రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన దొంపక బాబు(35) భార్య సంధ్యతో కలిసి రాయదుర్గం పరిధిలోని అంజయ్యనగర్లో ఉండేవాడు. -
తెనాలిలో వైకాపా రౌడీషీటర్ అరాచకం
గుంటూరు జిల్లా తెనాలిలో వైకాపా రౌడీషీటర్ ఇద్దరిని కొట్టాడు. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు.. రెండో పట్టణ పోలీసుస్టేషన్లో ఏ ప్లస్ రౌడీషీటర్గా ఉన్న సముద్రాల పవన్కుమార్ అలియాస్ లడ్డూ తన మిత్రుడితో కలిసి ఐతానగర్లో బుధవారం బైకుపై వెళుతుండగా మరో ద్విచక్రవాహనదారుడు వీరికి తగిలారు. -
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవం ఖరారు
అనంతపురానికి చెందిన గంగుల సూర్యనారాయణరెడ్డి అలియాస్ మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందితుడైన మలిశెట్టి భానుకిరణ్ అలియాస్ భానుకు కింది కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను ఖరారు చేస్తూ గురువారం హైకోర్టు తీర్పు వెలువరించింది.
తాజా వార్తలు (Latest News)
-
సునీత, వైఎస్ షర్మిల పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు
-
సూచీలకు ‘హెవీ’ స్ట్రోక్.. 700 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రోహిత్ తర్వాత పాండ్యనే కెప్టెన్.. మరింత బాధ్యతగా ఆడాలి: మాజీ క్రికెటర్
-
భారత కంపెనీపై దిల్లీ హైకోర్టుకు టెస్లా.. కారణం ఇదే..
-
నా స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేకపోయా: ముంబయి స్టార్ ఆల్రౌండర్
-
బజాజ్ కొత్త పల్సర్ NS400Z.. టాప్ స్పీడ్ 154kph