చెత్త కుప్పల మంటల్లో పడి కూలీ మృతి
తగలబడుతున్న చెత్తలో పడి ఓ నిర్మాణ కార్మికుడు సజీవ దహనం అయ్యాడు. రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన దొంపక బాబు(35) భార్య సంధ్యతో కలిసి రాయదుర్గం పరిధిలోని అంజయ్యనగర్లో ఉండేవాడు.
రాయదుర్గం, న్యూస్టుడే: తగలబడుతున్న చెత్తలో పడి ఓ నిర్మాణ కార్మికుడు సజీవ దహనం అయ్యాడు. రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన దొంపక బాబు(35) భార్య సంధ్యతో కలిసి రాయదుర్గం పరిధిలోని అంజయ్యనగర్లో ఉండేవాడు. అతడు కూలీ కాగా, భార్య ఇళ్లల్లో పని చేస్తుంటుంది. ఇటీవల వారు హఫీజ్పేటకు మకాం మార్చారు. అయినా, బాబు అంజయ్యనగర్కు తరచూ వెళ్లి స్నేహితులతో కలిసి మద్యం తాగుతుండేవాడు. బుధవారం రాత్రి హరి అనే మిత్రుడితో కలిసి మద్యం తాగి ఇంటికి వెళ్లకుండా అక్కడే ఉండిపోయాడు. గురువారం ఉదయం మళ్లీ ఇద్దరూ తాగి అంజయ్యనగర్లోని చెత్త కుప్పల సమీపంలో రోడ్డు పక్కన పడుకున్నారు. ఈ క్రమంలో చెత్తకుప్పలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. హరి మంటల సెగకు నిద్ర లేచి బాబును గమనించకుండానే అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. బాబు తప్పించుకునే క్రమంలో జారి మంటల్లో చిక్కుకుపోయాడు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి గమనించి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా.. సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పేలోపే ప్రాణాలు కోల్పోయాడు. రాయదుర్గం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాబుకు శ్రీకర్(11), నిహాల్(7) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగిత్యాల జిల్లాలో విషాదం.. అన్నదమ్ములను బలిగొన్న భూ తగాదా
భూ తగాదాల నేపథ్యంలో జరిగిన గొడవ ఓ కుటుంబంలో విషాదం నింపింది. -
హైదరాబాద్లో గంజాయి, ఎంఎండీఏ స్వాధీనం
కూకట్పల్లి ఠాణా పరిధిలోని శేషాద్రినగర్లో స్థానిక పోలీసులతో కలిసి ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. -
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అబ్బరాజు పృథ్వీరాజ్(30) దుర్మరణం పాలయ్యారు. -
మహిళా వైద్యాధికారులపై లైంగిక వేధింపుల వ్యవహారం.. కామారెడ్డి డీఎంహెచ్వో అరెస్టు
మహిళా వైద్యాధికారులపై లైంగిక వేధింపుల కేసులో కామారెడ్డి డీఎంహెచ్వో లక్ష్మణ్సింగ్ గురువారం అరెస్టు అయ్యారు. ఈ వ్యవహారంలోనే జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న శ్రీనివాస్నాయక్పై కూడా ఓ కేసు నమోదైంది. -
రూ.లక్ష... 50 వేలు... 30 వేలు!
రాష్ట్రంలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో గురువారం ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. వారిలో ఒకరు వ్యవసాయ, ఇద్దరు విద్యుత్తు ఉద్యోగులు ఉన్నారు. -
దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతం.. ఇద్దరి మృతి
విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృత్యువాత పడగా.. మరొకరికి గాయాలైన ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ఉసిరికపల్లిలో చోటుచేసుకుంది. -
చెరువులో మునిగి ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతి
చెరువులో దీపాలు వదిలేందుకు వెళ్లి, ప్రమాదవశాత్తు అందులో పడి ముగ్గురు అక్కాచెల్లెళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. -
నలభై ఏళ్ల తర్వాత ఖైదీ పట్టివేత
నలభై ఏళ్ల నుంచి తప్పించుకొని తిరుగుతున్న ఓ ఖైదీని ఎట్టకేలకు పట్టుకున్నారు. జైలు అధికారులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్ మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన ఎస్.వీరన్న మహబూబాబాద్లో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడు. -
టెస్కాబ్ ఉన్నతాధికారిణిని నమ్మి అడ్డంగా మోసపోయారు!
రాష్ట్ర సహకార ఎపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్)లో ఒక ఉన్నతాధికారిణి మాటలు నమ్మి అందులో పనిచేస్తున్న పలువురు అధికారులు, ఉద్యోగులు మోసపోయారు. -
బాలికలతో బలవంతంగా వ్యభిచారం
అంతర్ రాష్ట్ర వ్యభిచార రాకెట్తో ప్రమేయం ఉందనే ఆరోపణలపై ప్రభుత్వ అధికారులు సహా 21 మందిని అరుణాచల్ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ నిర్ణయం నాకు ముందే చెప్పాడు: కోహ్లీ
-
హింసపై ఈసీకి సీఈవో నివేదిక.. కీలక నేతల అరెస్టులకు అవకాశం?
-
రివ్యూ: విద్య వాసుల అహం.. ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎలా ఉందంటే?
-
పాక్ వద్ద అణ్వస్త్రాలున్నా.. నిర్వహణకు డబ్బుల్లేవు కదా! - మోదీ
-
ధోనీ నుంచి అసలైన షో చూడబోతున్నాం: భారత మాజీ క్రికెటర్
-
కేజ్రీవాల్ ఇంటి నుంచి వీడియో వెలుగులోకి.. ‘హిట్మ్యాన్’ అంటూ స్వాతీమాలీవాల్ పోస్టు