ఫోన్‌ ట్యాప్‌ చేశారని ఫిర్యాదు

తమ సెల్‌ఫోన్లను ట్యాప్‌ చేశారని హైదరాబాద్‌ సరూర్‌నగర్‌లోని ద్వారకా తిరుమల కాలనీకి చెందిన ఇ.విజయపాల్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఏసీపీ టి.కృపాకర్‌ (ప్రస్తుతం కాజీపేటలో రైల్వే డీఎస్పీ), విశ్రాంత సీఐ దాసరి భూమయ్యలపై కేసు నమోదు చేసినట్లు కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట సీఐ వి.రవి గురువారం తెలిపారు.

Published : 03 May 2024 04:12 IST

ఏసీపీ, విశ్రాంత సీఐలపై కేసు నమోదు

జమ్మికుంట, న్యూస్‌టుడే: తమ సెల్‌ఫోన్లను ట్యాప్‌ చేశారని హైదరాబాద్‌ సరూర్‌నగర్‌లోని ద్వారకా తిరుమల కాలనీకి చెందిన ఇ.విజయపాల్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఏసీపీ టి.కృపాకర్‌ (ప్రస్తుతం కాజీపేటలో రైల్వే డీఎస్పీ), విశ్రాంత సీఐ దాసరి భూమయ్యలపై కేసు నమోదు చేసినట్లు కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట సీఐ వి.రవి గురువారం తెలిపారు. జమ్మికుంట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన క్రైం నంబరు 30/2019 కేసు విషయంలో ఉన్నతాధికారుల అనుమతి లేకుండా అప్పటి హుజూరాబాద్‌ ఏసీపీ కృపాకర్‌, జమ్మికుంట సీఐ భూమయ్యలు.. తన సెల్‌ఫోన్లతో పాటు డ్రైవర్‌ సురేశ్‌గౌడ్‌ సెల్‌ఫోన్‌లను ట్యాప్‌ చేశారని విజయపాల్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఐటీ చట్టం సెక్షన్లు 66, 72 కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ రవి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని