ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరిని హత్య చేసిన మావోయిస్టులు

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. వరుస ఎదురుదెబ్బలతో సతమతమవుతున్న మావోయిస్టులు బీజాపూర్‌ జిల్లాలోని తర్రెమ్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని చుత్వాహి గ్రామానికి చెందిన సోదరులు మండవి జోగ(45), మండవి హుంగా(43)ను దారుణంగా హత్య చేశారు.

Updated : 03 May 2024 06:25 IST

చర్ల, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. వరుస ఎదురుదెబ్బలతో సతమతమవుతున్న మావోయిస్టులు బీజాపూర్‌ జిల్లాలోని తర్రెమ్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని చుత్వాహి గ్రామానికి చెందిన సోదరులు మండవి జోగ(45), మండవి హుంగా(43)ను దారుణంగా హత్య చేశారు. బుధవారం రాత్రి ఈ ఇద్దరిని ఇంటి నుంచి పిలిపించిన మావోయిస్టులు గుండం అటవీ ప్రాంతంలో ప్రజాకోర్టు ఏర్పాటుచేసి అక్కడ ఈ హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన చుత్వాహి సీఆర్పీఎఫ్‌ క్యాంపునకు కొద్ది దూరంలోని అడవిలో చోటుచేసుకుంది. వీరిద్దరూ ఇన్‌ఫార్మర్లగా వ్యవహరిస్తున్నారనే నెపంతోనే మావోయిస్టులు ఈ హత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. దీంతో బెంబేలెత్తిన గ్రామస్థులు, బాధిత కుటుంబ సభ్యులు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసేందుకూ ముందుకు రాలేదు. ఈ ఘటనపై పూర్తి సమాచారం వచ్చాక వివరాలు వెల్లడిస్తామని బీజాపూర్‌ ఎస్పీ డాక్టర్‌ జితేంద్ర యాదవ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని