ఆ డబ్బులు ఎప్పుడొస్తాయో?
జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు కాస్మొటిక్స్ ఛార్జీలు అందక ఇబ్బంది పడుతున్నారు. నెలనెలా అందాల్సిన నగదు రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో విడుదల చేయనందున పిల్లలు తల్లిదండ్రులపై ఆధారపడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలతో
సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు అందని కాస్మొటిక్ ఛార్జీలు
తల నూనె, సబ్బులు కరవాయే..!
గిరిజన గురుకుల పాఠశాల బాలికలు
జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు కాస్మొటిక్స్ ఛార్జీలు అందక ఇబ్బంది పడుతున్నారు. నెలనెలా అందాల్సిన నగదు రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో విడుదల చేయనందున పిల్లలు తల్లిదండ్రులపై ఆధారపడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలతో పాటు గురుకులాల్లో చదువుకుంటున్న వేలమంది విద్యార్థులకు పాఠశాలల పునః ప్రారంభం నుంచి ఇప్పటి వరకు తలకు నూనె, సబ్బులు, పేస్టు, బ్రష్ కొనడానికి డబ్బులు లేక బేలగా చూస్తున్నారు. నెల..నెలా ఇదిగో...అదిగో అంటున్నారు తప్ప.. డబ్బులు ఇచ్చిన దాఖలాల్లేవు.
వినుకొండ, న్యూస్టుడే ప్రతినెలా మెస్ ఛార్జీలతో పాటు విద్యార్థులకు వ్యక్తిగత శుభ్రతకు రోజు వారి వినియోగించే వస్తువులు కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పింది. ఫ్రీమెట్రిక్, పోస్టు మెట్రిక్ చదివే బాల, బాలికలకు కేటగిరీల వారిగా సగటున నెలకు రూ.160 వంతున చెల్లించాలి. బీసీలకు ఈ విద్యాసంవత్సరం ప్రారంభమైన తర్వాత ఆగస్టు నుంచి ఇప్పటి వరకు మూడు నెలల బకాయి ఉండగా, ఎస్సీ బాల, బాలికలకు గత విద్యా సంవత్సరంలో మూడు ఇప్పుడు మరో మూడు మొత్తం ఆరు నెలల డబ్బులు అందలేదు. గత రెండేళ్ల నుంచి డబ్బులు ఇవ్వలేదని ఎస్టీ విద్యార్థులు చెప్పి వాపోయారు. ఇందులో బాలికలకు మరికొంత అదనంగా రావాల్సి ఉన్నా గత ఏడాది నుంచి ఇవ్వలేదు
పిల్లలవి ఆపొద్దు
పేద పిల్లలకు ప్రతినెలా ఛార్జీలు చెల్లిస్తే వాటిని వినియోగించుకుంటారు. సకాలంలో ఇవ్వకుంటే ఇబ్బంది ఎదురవుతుంది. చాలామందితో మాట్లాడిన తర్వాత జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడాను. ఇంకా రాలేదన్నారు. ప్రభుత్వం పిల్లల డబ్బులు ఆపకూడదు వెంటనే చెల్లించాలి. అవసరమైతే రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తెస్తాను. - సుబ్బారావు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు
పోయిన సంవత్సరం నుంచి ఇవ్వలేదు
నేను 7వ తరగతిలో ఉన్నప్పుడు జనవరి నుంచి మూడు నెలలు రాలేదు. ఇప్పుడు మళ్లీ నాలుగు నెలలు గడిచింది. మొత్తం ఆరేడు నెలల నుంచి కాస్మొటిక్స్ ఛార్జీలు ఇవ్వాలి. అవి ఇస్తే మాకు వెసులుబాటుగా ఉంటుంది. నూనె, సబ్బులు కొనుక్కొని వాడుకుంటాం. - పల్లెపోగు నరసింహరావు, 8వ తరగతి, ఎస్సీ బాలుర వసతి గృహం
ఇంటి నుంచి తెచ్చుకుంటున్నాం
సబ్బులు, తల నూనె, రిబ్బన్ ఇతరత్రావి గత ఏడాది నుంచి ఇవ్వడం లేదు. అంతకు ముందు మాకు హాస్టల్కు తెచ్చి పంచేవారు. ఇప్పుడు ఇళ్ల వద్ద నుంచి తెచ్చి వాడుకుంటున్నాం. ఆ పరిస్థితి లేని వాళ్లు సర్దుకుపోతున్నారు. ప్రతి రోజు శుభ్రంగా విద్యార్థులు ఉండాలంటే ఏనెలకానెల ఇస్తే ఉపయోగించుకోవచ్చు. లేనప్పుడు ఈ ప్రభావంతో వ్యక్తిగత పరిశుభ్రత తగ్గుతుంది.
- వాగిబాయి, 9వ తరగతి విద్యార్థిని, ఎస్టీ బాలికల గురుకుల పాఠశాల
ఉన్నంతలో సర్దుబాటు..
డబ్బులివ్వనందున వాటిని కొనలేక తలకు నూనె రాసుకోకుండా వస్తున్నాం. మా అమ్మవాళ్ల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని చెప్పారు కానీ ఇప్పటి వరకు అవి రాలేదు. మా అమ్మ, నాన్న వ్యవసాయం చేస్తున్నారు వాళ్లను అడగాలంటే ఇబ్బందిగా ఉంది. అందుకనే ఉన్నంతలో సర్దుకుంటున్నాం. - బండారు శ్రీహరి, 6వ తరగతి విద్యార్థి, ఎస్సీ బాలుర సంక్షేమ వసతి గృహం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాలకులు కా‘పాడి’న పాపాన పోలేదు
[ 27-04-2024]
లీటరు పాలకు రూ.4 బోనస్ ఇస్తానని, పాడి రైతులను ఆదుకుంటానని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి హామీలు అమలు చేయకపోగా అమలులో ఉన్న పథకాలు రద్దు చేశారు. -
26 నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
బాపట్ల లోక్సభ, జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 150 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
తెదేపా గూటికి మాజీ మంత్రి డొక్కా
[ 27-04-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, దళితుల్లో సీనియర్ నేత, గుంటూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. -
బరిలో మిగిలేదెవరో?
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామపత్రాల సమర్పణ, పరిశీలన కార్యక్రమం ముగిసింది. ప్రధాన పార్టీలతో పాటు గుర్తింపు, నమోదైన పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు పెద్దఎత్తున నామపత్రాలు దాఖలు చేశారు. -
‘భూ’మంతర్ ఖాళీ
[ 27-04-2024]
రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతికతతో భూముల రీసర్వే నిర్వహిస్తున్నాం. భూవివాదాలన్నీ శాశ్వతంగా పరిష్కరిస్తాం. -
ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని మా లక్ష్యం
[ 27-04-2024]
-
గంజాయి బ్యాచ్ ఆగడాలపై నిరసన
[ 27-04-2024]
గంజాయి బ్యాచ్ ఆగడాలు భరించలేకున్నామంటూ.. వారిపై చర్యలు తీసుకోవాని శుక్రవారం రాత్రి గుంటూరు రాజీవ్గాంధీనగర్ వాసులు నిరసన తెలిపారు. -
నేత.. మొక్కల్లో మేత!
[ 27-04-2024]
అధికారమే అండగా ఆ ప్రజాప్రతినిధి కుటుంబం గుంటూరు నగరాన్ని చెరపట్టి మరీ దోచుకుంది. అల్లుడికి రోడ్లు, డ్రెయిన్ల కాంట్రాక్టు పనులు ఇప్పించుకోవడానికే పరిమితం కాలేదు. -
నిధులు నింపుకోవడానికి మేమే దొరికామా!
[ 27-04-2024]
ఎ.ఎన్.యు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్థికంగా దివాళ తీసే పరిస్థితిలో ఉందని, అందువల్లే మే 1 నుంచి ప్రారంభమయ్యే బీఈడీ పరీక్షలకు అదనంగా డబ్బులు చెల్లించాలని అధికారులు ఉత్తర్వులు ఇచ్చారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. -
నాకు తెలియదు.. నాకు తెలియదు
[ 27-04-2024]
పొన్నూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ భార్య, కుమార్తె ఆస్తుల వివరాలను అఫిడవిట్లో ఎందుకు పొందుపరచలేదని కూటమి నాయకులు ప్రశ్నిస్తే.. నాకు తెలియదు.. నాకు తెలియదు.. చెప్పడం ఏమిటిని పలువురు తప్పుపడుతున్నారు. -
‘బీసీలను నట్టేట ముంచిన జగన్’
[ 27-04-2024]
‘బీసీలు రాజ్యాధికారం చేపట్టాలంటే ఎన్డీఏ కూటమితోనే సాధ్యం. బీసీ ఉపప్రణాళిక నిధుల్ని దారి మళ్లించి జగన్ నమ్మక ద్రోహం చేశారు. -
గురువులపై బోధనేతర విధుల భారం
[ 27-04-2024]
గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులపై వైకాపా ప్రభుత్వం కక్ష గట్టినట్లు వ్యవహరిస్తోందని పలుమార్లు ఉపాధ్యాయ సంఘాలే నేరుగా విమర్శలు గుప్పించాయి. -
భూ కక్ష
[ 27-04-2024]
మండలంలోని సమగ్ర భూ సర్వేకు గత ఏడాది ఏప్రిల్లో రెవెన్యూ యంత్రాంగం శ్రీకారం చుట్టింది. నూరు సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమంలో అక్షాంశ, రేఖాంశాల సహితంగా ప్రతి ఒక్కరి పొలానికి పక్కా సరిహద్దులు నిర్ణయిస్తామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు