కొనుగోళ్లు చేయరు.. కన్నీళ్లు తుడవరు
నిత్యం ఆకాశం కారుమబ్బులతో నిండి ఉండటం, తరచూ వర్షం పడటంతో ధాన్యం రైతులు పంట విక్రయించడానికి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. తేమ పేరుతో కేంద్రాల నిర్వాహకులు కొర్రీలు పెట్టడం, మరోవైపు వీడని వర్షంతో ధాన్యాన్ని ఎలా అమ్మాలో, ఎట్లా రక్షించుకోవాలో తెలియని దుస్థితిలో అన్నదాతలున్నారు.
సిర్పూర్(టి) మండలం గంగాయిగూడలో వర్షం కురుస్తుండటంతో ధాన్యం సంచులపై టార్ఫాలిన్ కప్పుతున్న రైతులు
ఈనాడు, ఆసిఫాబాద్ : నిత్యం ఆకాశం కారుమబ్బులతో నిండి ఉండటం, తరచూ వర్షం పడటంతో ధాన్యం రైతులు పంట విక్రయించడానికి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. తేమ పేరుతో కేంద్రాల నిర్వాహకులు కొర్రీలు పెట్టడం, మరోవైపు వీడని వర్షంతో ధాన్యాన్ని ఎలా అమ్మాలో, ఎట్లా రక్షించుకోవాలో తెలియని దుస్థితిలో అన్నదాతలున్నారు. తూకం పేరుతో సైతం మోసాలు జరగడంతో కర్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో అతి తక్కువ ధరకు ప్రైవేటులో ధాన్యాన్ని విక్రయిస్తూ నష్టపోతున్నారు. లారీలు సైతం అందుబాటులో లేకపోవడంతో రెండు, మూడు వారాలపాటు కేంద్రాల్లోనే ధాన్యం నిల్వలు పేరుకుపోయి ఉంటున్నాయి.
జిల్లావ్యాప్తంగా 37 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 19,700 ఎకరాల్లో వరి సాగు చేయగా 46,894 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలనేది లక్ష్యం. ధాన్యం కొనుగోలు ప్రారంభం నుంచే వర్షాలు, ఈదురుగాలులు వీస్తున్నాయి. ధాన్యం తడిసి పోవడంతో తేమ తప్పనిసరిగా ఉంటుంది. పగలు కాస్త ఎండ రాగా ఆరబెట్టేలోపు మళ్లీ వరుణుడు విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో తడిచిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసి ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. ప్రభుత్వం సైతం ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచిస్తున్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని అన్నదాతలు అంటున్నారు.
కోతలు, తూకంలో మోసాలు
దహెగాం మండలంలోని ఒడ్డుగూడలో సహకారం సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టారు. నిర్వాహకులు ఎలక్ట్రానిక్ కాంటాలో ఏకంగా మార్పులు చేశారు. ఒక్కో బస్తాకు అర కిలో అదనంగా తీసుకుంటున్నామని చెప్పి, ఏకంగా రెండున్నర, మూడు కిలోల ధాన్యం అదనంగా తీసుకున్నారు. రైతుకు అనుమానం వచ్చి వేరొక కాంటాలో తూకం వేయగా ఈ బండారం బయటపడింది. రైతుల ఫిర్యాదుతో కదిలిన అధికారులు విచారణ చేయగా కాంటాలో మోసంతో నాలుగు క్వింటాళ్ల ధాన్యం పక్కదారి పట్టించినట్లు గుర్తించారు. మరోవైపు రైస్మిల్లుల్లో సైతం కోతలు పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కేంద్రాల్లో తూకానికి సంబంధించి రైతులకు ఎలాంటి రశీదులు ఇవ్వకపోవడం, రైస్మిల్లర్లు ఎంత చెబితే అంతే అనే విధానం ఉండటంతో కర్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇబ్బందులు లేకుండా చూస్తాం
నరసింహారావు, మేనేజర్, పౌరసరఫరాలశాఖ
ప్రతీ కొనుగోలు కేంద్రానికి రెండు లారీల చొప్పున అందుబాటులో ఉంచాం. ధాన్యాన్ని వెంట వెంటనే రైస్మిల్లులకు తరలిస్తున్నాం. తేమ ఉన్నా కొనుగోలు చేస్తాం. రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం.
ధాన్యం తెచ్చి ఇరవై రోజులు
ఎల్కరి సంతోష్, కర్జీ, దహెగాం మండలం
కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తెచ్చి ఇరవై రోజులవుతోంది. తరుచూ వర్షం పడటంతో ధాన్యం ఎండటం లేదు. అధికారులు ఈ ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసి ఆదుకోవాలి. మళ్లీ వరుసగా వర్షాలు కురుస్తున్నాయి.
తేమ ఉందని కొనడం లేదు
శోభ, సాండ్గాం, కౌటాల మండలం
ధాన్యాన్ని నిత్యం ఆరపెడుతున్నా.. వర్షాల కారణంగా తేమ పోవడం లేదు. అధికారులు 17 మించి తేమశాతం ఉండకూడదని అంటున్నారు. ఎండలు వస్తే తప్ప ఈ తేమ పోయే పరిస్థితి లేదు. మా గ్రామంలో రైతులందరిదీ ఇదే పరిస్థితి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ లింక్ క్లిక్ చేస్తే వాట్సాప్ హ్యాక్
[ 17-06-2024]
చేతిలో మొబైల్ ఉంది కదా అని గ్రూపులో వచ్చిన లింక్లను క్లిక్ చేసుకుంటూ పోతే మన చరవాణి హ్యాక్ అయిపోవడం ఖాయం. అంతేకాదు మన ఫోన్ నెంబరుతో ఇతరులకు సందేశాలు పంపించే ప్రమాదం ఉంది. -
కీలక సమయం.. జాగ్రత్తలే ప్రధానం
[ 17-06-2024]
వానాకాలం సీజన్ మొదలైనా వర్షాల జాడలేదు. ఏ విత్తనాలు విత్తుకోవాలి, మొక్కలను ఎలా కాపాడుకోవాలి, కలుపు మందు ఎప్పుడు పిచికారీ చేయాలి. ఎరువులు ఎలా వేయాలి, ఎంత వేయాలి, తెగుళ్ల నివారణకు ఏ మందులు వాడాలి. -
బాడుగకు కాడెడ్లు
[ 17-06-2024]
వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. చాలా మంది రైతులు విత్తనాలు విత్తుకోగా, మరికొంత మంది విత్తుకునేందుకు భూమిని సిద్ధం చేస్తున్నారు. యాంత్రికీకరణ పెరిగిన నేపథ్యంలో కొంతకాలంగా దుక్కులు దున్నడం, చదును చేసే పనులను అన్నదాతలు ట్రాక్టర్ల సాయంతోనే పూర్తి చేస్తున్నారు. -
కొత్త కార్డులు.. సన్న బియ్యం
[ 17-06-2024]
అర్హులందరికీ కొత్త రేషన్కార్డుల మంజూరు త్వరలోనే ఉంటుందని, దీనిపై రాష్ట్ర కేబినెట్ సమావేశంలో విధివిధానాలను రూపొందించినట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తాజాగా వెల్లడించడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. -
త్యాగానికి గుర్తు ‘బక్రీద్’
[ 17-06-2024]
ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా నిర్వహించుకునే పండగల్లో మొదటిది ఈద్ ఉల్ ఫితర్(రంజాన్). రెండోది ఈద్ ఉల్ అజా(బక్రీద్). రంజాన్లో దైవాన్ని సంతుష్ట పర్చటానికి అత్యంత కఠిన ఉపవాసాలు చేయటంతో పాటు దానధర్మాలు ఎక్కువగా చేస్తారు. -
గొర్రెలు లేవు.. డబ్బులు వెనక్కి!
[ 17-06-2024]
గొల్ల కుర్మ కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. మొదటి విడత పంపిణీ సవ్యంగా జరిగినా రెండో విడతలో కొంత మందికే అందించారు. -
గోంది అటవీప్రాంతంలో పులి కదలికలు?
[ 17-06-2024]
మండలంలోని గోంది అటవీప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. పిల్లలున్న ఆడ పులి అడ ప్రాజెక్టు కాలువ ప్రాంతంలో స్థావరం ఏర్పాటు చేసుకుని సమీప ప్రాంతాల్లో సంచరిస్తోంది. -
నిధులపై ఆశలు.. పరిష్కారానికి అడుగులు
[ 17-06-2024]
అనధికారిక ప్లాట్లు, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ(ఎల్ఆర్ఎస్) పెండింగ్ దరఖాస్తులు వేగంగా పరిష్కరించాలని ఈనెల 7న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరోసారి అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై గతంలో కదలిక వచ్చినా సార్వత్రిక ఎన్నికల కారణంగా మళ్లీ మొదటికొచ్చింది. -
మధ్యాహ్నం ఎండ.. సాయంత్రం వర్షం
[ 17-06-2024]
రుతుపవనాల విస్తరణ ప్రభావంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు గడిచిన వారంతో పోలిస్తే క్రమంగా తగ్గుతుండటంతో జిల్లా వాసులు కాస్త ఉపశమనం పొందుతున్నారు. -
ఏఆర్టీ కేంద్రం ఏర్పాటుకు కసరత్తు
[ 17-06-2024]
హెచ్ఐవీ బాధితులకు మంచిరోజులు వస్తున్నాయి. జిల్లాలో అందుబాటులోకి వచ్చిన ప్రభుత్వ వైద్యకళాశాలతో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఏఆర్టీ(యాంటీ రిట్రో వైరల్ థెరఫీ) కేంద్రం ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. -
దారి కష్టాలు తీరేనా?
[ 17-06-2024]
ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులకు వానాకాలంలో కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. గతసంవత్సరం ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు రెంకోనివాగు పొంగిపొర్లడంతో పాఠశాలకు వెళ్లే తాత్కాలిక రహదారి కొట్టుకుపోయింది. -
ప్రవేశాలకు పెరిగిన పోటీ
[ 17-06-2024]
సాధారణంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు పెద్దగా పోటీ కనిపించదు. చాలా చోట్ల విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా కొన్ని చోట్ల పాఠశాలలు ఎత్తేసే పరిస్థితి నెలకొందంటే అతిశయోక్తి లేదు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
తుపాను ముందు నిశ్శబ్దం.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
నేపాల్ను చిత్తు చేసిన బంగ్లాదేశ్.. సూపర్-8కి అర్హత
-
ఆ లింక్ క్లిక్ చేస్తే వాట్సాప్ హ్యాక్
-
2,100 అణ్వాయుధాలు ప్రయోగానికి సిద్ధం: సిప్రి నివేదిక
-
హెచ్పీసీఎల్ సీఎండీ పదవికీ సరైన అభ్యర్థి దొరకలేదు
-
జాతిపితపై అభిమానం.. ఇంటి ప్రహరీపై విగ్రహం