గిరి విద్యార్థుల జయకేతనం
పది ఫలితాల్లో గిరి విద్యార్థులు రాణించారు. ఫలితాలపై పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్ ఆనందం వ్యక్తం చేశారు.
ప్రత్యేక శిక్షణ పొందిన విద్యార్థులతో ఐటీడీఏ పీవో, ఉపాధ్యాయులు
పాడేరు/పట్టణం, న్యూస్టుడే: పది ఫలితాల్లో గిరి విద్యార్థులు రాణించారు. ఫలితాలపై పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్ ఆనందం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులను అభినందించారు. గిరిజన సంక్షేమ విద్యాశాఖ ఈసారి వినూత్నంగా సూపర్ ఫిఫ్టీ విద్యార్థుల పేరిట వివిధ పాఠశాలలకు చెందిన 50 మంది విద్యార్థులకు పాడేరు మండలం మోదాపుట్టు గిరిజన సంక్షేమ పాఠశాల ప్రాంగణంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. వీరిలో కిలో ధారమణి(585/600), కిలో తిరుపతి(566/600), తాంగుల హరిలాల్ ప్రసాద్(562/600) తదితరులు మంచి మార్కులు సాధించినట్లు గిరిజన సంక్షేమశాఖ డీడీ కొండలరావు తెలిపారు.
ముంచంగిపుట్టు, అనంతగిరి గ్రామీణం, పెదబయలు గ్రామీణం, న్యూస్టుడే: : కిలగాడ కస్తూర్బా విద్యార్థిని అరిసెల శిరిషా 530 మార్కులు సాధించినట్లు ఎంఈవో కృష్ణమూర్తి తెలిపారు. గుమ్మకోట గురుకుల పాఠశాల విద్యార్థి జి.భార్గవ్కు 563 మార్కులు వచ్చాయి. కొత్తూరు కేజీబీవీ విద్యార్థిని సంజుల 540 మార్కులు కైవసం చేసుకున్నారు. పెదబయలు గురుకుల పాఠశాల విద్యార్థి గెమ్మెలి విజయ్కుమార్ 559 మార్కులు సాధించారు.
సీలేరు, కొయ్యూరు: సీలేరు ఏపీ జెన్కో డీఏవీ పాఠశాల విద్యార్థి 550, షేక్ జుబేదా 545, తేజశ్రీ 544 మార్కులు సాధించారు. కొయ్యూరు గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి 561 మార్కులు సాధించాడు.
అరకులోయ పట్టణం, న్యూస్టుడే: అరకులోయ శారదానికేతన్ పాఠశాలకు చెందిన కొర్ర కౌసిక్ 589 మార్కులు సాధించాడు.
రాజవొమ్మంగి, న్యూస్టుడే: రాజవొమ్మంగి గురుకుల పాఠశాలలో చదువుతున్న దూసరపాముకు చెందిన పెదపాటి యమల 553 మార్కులు సాధించింది.
రంపచోడవరం, న్యూస్టుడే: రంపచోడవరం మండలంలో పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 95 శాతం ఉత్తీర్ణత సాధించారని ఎంఈవో మల్లేశ్వరరావు తెలిపారు. 764 మంది పరీక్షలకు హాజరు కాగా, 720మంది పాసయ్యారు. స్థానిక గిరిజన సంక్షేమ గురుకుల బాలుర ఉన్నత పాఠశాలలో 100 శాతం ఉత్తీర్ణతను సాధించిందని ప్రిన్సిపల్ ఎస్కే అహ్మద్ ఆలీషా వెల్లడించారు.
మోతుగూడెం, న్యూస్టుడే: మోతుగూడెం జెన్కో డీఏవీ ఉన్నత పాఠశాల నుంచి 24 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, వారిలో అందరూ ఉత్తీర్ణులయ్యారు. వీరిలో దొడ్డి గణేశ్ 571, విఘ్నజితరాజు 565, డి.తన్విక 561 మార్కులు సాధించారు. మోతుగూడెం జడ్పీ ఉన్నత పాఠశాలలో 16 మంది, డొంకరాయి జడ్పీ ఉన్నత పాఠశాలలో 12 మంది, బాలికల ఆశ్రమ పాఠశాలలో 26 మంది, మంగంపాడు బాలుర ఉన్నత పాఠశాలలో 10 మంది ఉత్తీర్ణులయ్యారు.
చింతూరు, కూనవరం వరరామచంద్రాపురం, న్యూస్టుడే: కూనవరం మండలంలో 93.5 శాతం ఫలితాలు నమోదయ్యాయి. వరరామచంద్రాపురం మండలంలోని నాలుగు పాఠశాలల నుంచి 295 మంది విద్యార్థులు పది పరీక్షలు రాయగా, 259 మంది ఉత్తీర్ణులయ్యారని ఎంఈవో లక్ష్మీనారాయణ తెలిపారు. చింతూరు జిల్లా పరిషత్తు పాఠశాలకు చెందిన విద్యార్థి వసుందర 570, ఏజీహెచ్ఎస్ నర్సింహపురం విద్యార్థిని నవ్య 560, కూనవరం ఏపీఆర్ పాఠశాలకు చెందిన విద్యార్ధిని హర్షిత 559 మార్కులు సాధించారు. వీరికి నగదు బహుమతులు అందజేస్తామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కావూరి చైతన్య ప్రకటించారు.
ఎటపాక, అడ్డతీగల: ఎటపాక మండలంలో మొత్తం పది పాఠశాలలకు చెందిన 286 మంది విద్యార్ధులు పరీక్షలు రాయగా వారిలో 272 మంది ఉత్తీర్ణత సాధించారు.
అడ్డతీగల మండలంలో పదో తరగతి పరీక్షలకు 387 మంది విద్యార్థులు హాజరుకాగా 356మంది ఉత్తీర్ణత సాధించారు.
దేవీపట్నం: ఇందుకూరుపేట ఉన్నత పాఠశాలలో 58 మంది విద్యార్థులకు గాను 58 మంది ఉత్తీర్ణత సాధించారు. గ్రామానికి చెందిన గొర్రెల లోకేష్ 571 మార్కులు సాధించగా ఇదే గ్రామానికి చెందిన అయినాల సాయిశ్రీ వల్లి 561 మార్కులు సాధించారు.
మారేడుమిల్లి, గంగవరం, న్యూస్టుడే: మారుడుమిల్లి మండలంలో తొమ్మిది పాఠశాలల నుంచి 308 మంది విద్యార్థులు హాజరుకాగా, వారిలో 301 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గంగవరం మండలంలోమొత్తం 251 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా 243 మంది ఉత్తీర్ణులయ్యారని ఎంఈఓ వై. మల్లేశ్వరరావు తెలిపారు. వేములోవ ఆశ్రమ పాఠశాల విద్యార్థిని బి.కావ్య 555 మార్కులు సాధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జననేతనన్నావు.. జలమేదీ జగన్?
[ 04-05-2024]
బటన్లు నొక్కే జగన్కు జనాల బాధలు పట్టడం లేదు. ఈ అయిదేళ్లలో తాగునీటి పథకాలకు పార్టీ రంగులు వేసి ప్రచారం చేసుకోవాలని చూశారు తప్ప ప్రజల గొంతు తడిపే ప్రయత్నమే చేయలేదు. వైకాపా పాలనలో గ్రామాల్లో కొత్తగా నీళ్ల కుండీలను నిర్మించిందీ లేదు. -
జగన్ను ఇంటికి పంపితేనే మన్యం అభివృద్ధి
[ 04-05-2024]
అధ్వాన పాలనతో రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రంపచోడవరం అసెంబ్లీ కూటమి అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి ఎద్దేవా చేశారు. -
జగనన్న కక్ష.. అవ్వాతాతలకు శిక్ష
[ 04-05-2024]
పింఛను సొమ్ము సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేసే అవకాశం ఉన్నా తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగులను బలిపశువులను చేసింది. -
వైకాపా పతనం ఖాయం
[ 04-05-2024]
త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపు తథ్యమని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు, తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి దొన్నుదొర పేర్కొన్నారు. -
వైకాపా వాహనం స్వాధీనం
[ 04-05-2024]
అనుమతులు లేకుండా వైకాపా ప్రచార సామగ్రి తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎంపీడీవో, ఎన్నికల అధికారి వెంకటరావు తెలిపారు. -
తెదేపాలో భారీగా చేరికలు
[ 04-05-2024]
దామనాపల్లి, సంకాడ పంచాయతీల నుంచి వైకాపా, సీపీఎంలకు చెందిన కార్యకర్తలు భారీగా తెదేపాలోకి చేరారు. మాడెం, బంధవీధి, దొడ్డికొండరెల్లివీధి, చిన్నజడుమూరు గ్రామాలనుంచి సుమారు 200 మంది పాడేరు కూటమి అసెంబ్లీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. -
ఉద్యోగాలిప్పిస్తామని టోకరా
[ 04-05-2024]
ఉద్యోగాలిప్పిస్తామని గిరిజన యువతను ఇద్దరు మహిళలు మోసం చేశారు. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. -
పేదల పొట్టకొట్టిన జగమొండి
[ 04-05-2024]
అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలితో ఉన్నవారి కడుపునింపడంలోనూ రాజకీయాలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుంది. ఓపక్క పేదల పక్షపాతినని ఊదరగొడుతూనే మరోవైపు అదే పేదల పొట్టకొట్టారు. -
‘జగన్కు ఒక్క అవకాశమిచ్చి అందరం మోసపోయాం’
[ 04-05-2024]
‘గత ఎన్నికల్లో జగన్ ఒక్క అవకాశం అని అడిగితే ఇచ్చి అందరం మోసపోయాం. ఈ ఐదేళ్లలో అభివృద్ధి లేదు. సంక్షేమంలో ఆశ్రిత పక్షపాతం పెరిగిపోయింది. -
తెదేపాలో చేరిన వైకాపా నాయకులు
[ 04-05-2024]
ఎలమంచిలిలోని దిమిలిరోడ్డులో శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించనున్న నందమూరి బాలకృష్ణ సభకు తెదేపా నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కూడలిని జెండాలతో అందంగా తయారు చేశారు. -
కాంగ్రెస్తోనే ప్రత్యేక హోదా
[ 04-05-2024]
కాంగ్రెస్ గెలుపుతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవచ్చని ఆ పార్టీ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి సతక బుల్లిబాబు అన్నారు. మంప, రేవళ్లు పంచాయతీల్లోని గ్రామాల్లో శుక్రవారం సీపీఐ నేతలతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. -
జగనన్నా.. ఏమిటీ పింఛన్ వెతలు..
[ 04-05-2024]
పింఛన్లకోసం బ్యాంకులకు వచ్చిన వృద్ధులకు రెండో రోజు కష్టాలు తప్పలేదు. వీఆర్పురం మండలం రేఖపల్లిలో బ్యాంకు వద్ద రేఖపల్లి, జీడిగుప్పల పీహెచ్సీల వైద్యులు శిబిరం ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు
-
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
-
హైదరాబాద్లో స్థానికేతరులకే పట్టం
-
అంతేలేని ప్రజ్వల్ రేవణ్ణ ఆగడాలు.. ఒక్కొక్కరుగా స్పందిస్తున్న బాధితులు
-
పెళ్లయిన నెలకే బావను కడతేర్చారు.. చెల్లి ప్రేమ వివాహం ఇష్టం లేని బావమరుదుల ఘాతుకం
-
మేనమామనన్నావ్.. మా కిట్లు ఆపేశావ్