logo

జనసేనలో చేరికలు

ఎలమంచిలి 8వ వార్డు మున్సిపల్‌ కౌన్సిలర్‌ సాయిప్రసన్న భర్త ఓగిబోయిన చిరంజీవి సోమవారం జనసేనలో చేరారు.

Published : 23 Apr 2024 02:41 IST

జనసేనలో చేరిన యువకులతో కొణతాల

ఎలమంచిలి, అనకాపల్లి, న్యూస్‌టుడే: ఎలమంచిలి 8వ వార్డు మున్సిపల్‌ కౌన్సిలర్‌ సాయిప్రసన్న భర్త ఓగిబోయిన చిరంజీవి సోమవారం జనసేనలో చేరారు. జనసేన అభ్యర్థి సుందరపు విజయ్‌కుమార్‌ సమక్షంలో ఆయన తన అనుచరులతో కలిసి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. నాయకులు కొఠారు సాంబ, కొఠారు నరేష్‌, కరణం రవికుమార్‌, పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

స్థానిక విజయరామరాజుపేటకు చెందిన పలువురు యువకులు సోమవారం జనసేనలో చేరారు. వారందరికి కూటమి అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ కండువాలు వేసి స్వాగతించారు. జనసేన నాయకులు ఆరుగుల్లి అర్జున్‌ ఆధ్వర్యంలో 15 మంది జనసేనలో చేరారు. పంచాయతీ పరిషత్‌ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టరు వీరాంజనేయులు మర్యాద పూర్వకంగా కొణతాలను కలిసి సత్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే ఎంతో అనుభవం కలిగిన కొణతాల అసెంబ్లీలో ఉండాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని