మందులు పక్కదారి..
డయాలసిస్ చేయించుకునే కిడ్నీ బాధితులకు ప్రభుత్వం అపోలో ద్వారా సరఫరా చేస్తున్న విలువైన మందులు పక్కదారి పడుతున్నాయి.
తిరువూరు, న్యూస్టుడే
డయాలసిస్ చేయించుకునే కిడ్నీ బాధితులకు ప్రభుత్వం అపోలో ద్వారా సరఫరా చేస్తున్న విలువైన మందులు పక్కదారి పడుతున్నాయి. ఎ.కొండూరు మండలంలో అత్యధికంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. క్రియాటిన్ ఎక్కువగా ఉన్న వారికి అవసరమైన డయాలసిస్ చేయడానికి వీలుగా తిరువూరు ప్రాంతీయ వైద్యశాలలో రూ.3 కోట్లతో నిర్మించిన డయాలసిస్ కేంద్రాన్ని 2021 అక్టోబరు 11న ప్రారంభించారు. మందులను ఇక్కడి కేంద్రంలో పనిచేస్తున్న సాంకేతిక నిపుణుడు పక్కదారి పట్టిస్తున్న వైనం సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా వెలుగు చూశాయి. మంగళవారం మధ్యాహ్నం తాను అద్దెకు ఉంటున్న ఇంట్లో ఐదు బాక్సులు, రెండు సంచుల్లో దాచిన మందులను రిక్షాపై బస్టాండ్ కూడలి సమీపంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. డయాలసిస్ కేంద్రంలో సాంకేతిక నిపుణుడి ఉద్యోగాన్ని నెల రోజుల కిందట మానేశాడు. ఈక్రమంలో తన సొంత ఊరుకు వెళ్లేక్రమంలో అద్దెకు తీసుకున్న గదిని ఖాళీ చేయడానికి మంగళవారం వచ్చాడు. తాను ఉంటోన్న గది మొదటి అంతస్తులో ఉంది. అక్కడ నిల్వ ఉంచిన మందులను ప్రైవేటు ఆస్పత్రిలోని మెడికల్ షాపు నిర్వాహ కుడు, రిక్షా కార్మికుడి సాయంతో కిందకు దించడం, వాటిని తరలించడం సీసీ కెమెరాలో నమోదయ్యింది. దీనితో పాటుగా ఇటీవల సంక్రాంతి పండుగ సమయంలో కొన్ని బాక్సులు కారులో తరలించడం కూడా వెలుగులోకి వచ్చింది. డయాలసిస్ కోసం వచ్చే వారికి అవసరమైన పరీక్షలు ఆస్పత్రిలోనే ఉచితంగా చేసి, ప్రభుత్వం నుంచి వచ్చే మందులతో ఉన్నత వైద్యసేవలు అందించాల్సి ఉంది. దీనికి విరుద్ధంగా ప్రైవేట్ ఆస్పత్రులతో కుమ్మక్కై వాటాల కోసం కొన్ని పరీక్షలు, మందుల కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాలంటూ రిఫర్ చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
మందుల బాక్సులను రిక్షాలో వేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రి ఉద్యోగి, డయాలసిస్ కేంద్రం టెక్నీషియన్
విచారణ జరుపుతాం..
దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గార్గెయను వివరణ కోరగా డయాలసిస్ కేంద్రం బాధ్యత అపోలోకు అప్పగించినట్లు తెలిపారు. మందులు పక్కదారి పట్టిన విషయం తనకు తెలియదని బదులిచ్చారు. అపోలో జిల్లా ఇన్ఛార్జి మధుకిరణ్ను వివరణ కోరగా సాంకేతిక నిపుణుడు నెల రోజులుగా విధులకు హాజరుకావడం లేదని తెలిపారు. మందులు పక్కదారి పట్టిన వైనంపై విచారణ జరుపుతామని ఆయన వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
[ 27-04-2024]
ఉంగుటూరు మండలం ఎలుకపాడులో సర్వే నంబరు 31/1లో 50 మంది దళితులకు అసైన్డ్ భూమి కేటాయించారు. పాసుపుస్తకాలు కూడా అందాయి. వీరిలో నలుగురి వివరాలే ఆన్లైన్ అయ్యాయి. -
ఎంపీ బాలశౌరిపై.. పేర్ని కుతంత్రాలు!
[ 27-04-2024]
జనసేన, తెదేపా, భాజపా కూటమి అభ్యర్థిగా.. మచిలీపట్నం లోక్సభ బరిలో దిగిన.. ఎంపీ బాలశౌరికి జనంలో వస్తున్న ఆదరణను చూసి.. వైకాపా జిల్లా అధ్యక్షుడు పేర్ని నానికి ఓటమి భయం పట్టుకుంది. బాలశౌరిని నేరుగా ఢీకొట్టలేక.. అడ్డదారుల్లో ఓడించాలని తీవ్రంగా కుతంత్రాలు ఆరంభించారు. -
బందరులో ఓ తిక్కసన్నాసి ఉన్నారు: బాలశౌరి
[ 27-04-2024]
విజయం అనేది కష్టపడితే వస్తుంది..ప్రజలకు మేలు చేస్తే ఆశీర్వదిస్తారు.. కానీ బందరులో ఓ తిక్కసన్నాసి ఉన్నారు.. ఓటమి భయం పట్టుకుని తన పేరుతో ఉన్న వ్యక్తులతో నామినేషన్లు వేయించారని ఎమ్మెల్యే పేర్ని నానీని ఉద్దేశించి కూటమి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరి పరోక్షంగా విమర్శించారు. -
113 నామపత్రాలకు ఆమోదం
[ 27-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు దాఖలైన వాటిలో 113 నామపత్రాలు సక్రమంగా ఉన్నట్లు ఎన్నికల అధికారులు నిర్ధారించారు. అన్ని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో శుక్రవారం నామపత్రాలు పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. -
‘ఏ ముఖం పెట్టుకుని ఓట్లడగడానికి వస్తారు’
[ 27-04-2024]
గన్నవరం నియోజకవర్గానికి చెందిన అంబాపురం పంచాయతీ నగరానికి చేరువుగా ఉన్నా.. అభివృద్ధి జాడ మాత్రం కన్పించడం లేదు. అంతరవలయ రహదారికి ఒకవైపు నగరపాలకసంస్థ అందమైన రహదారులతో, తాగునీరు, కాలువలతో సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంటే.. -
తలపడలేక.. తొండాట!
[ 27-04-2024]
సారూప్యం ఉన్న పేర్లతో నామినేషన్ల జిమ్మిక్కులు.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి ప్రత్యర్థికి నష్టం కలిగించే ఎత్తుగడలు.. అసంబద్ధ ఫిర్యాదులు.. ఇలా ఎన్నో వ్యూహాలు.. ఎత్తుగడల మధ్య నామినేషన్ల పరిశీలన క్రతువు ముగిసింది. -
మిగులు పనుల పూర్తికి ఐదేళ్లా..!
[ 27-04-2024]
తెదేపా హయాంలో కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో యాజమాన్యం వారు సొంత నిధులు వెచ్చించి వంతెన నిర్మించారు. కొన్ని పనులు మిగిలిపోయాయి. వాటిని పూర్తి చేయడానికి ఇంకా రూ.2.50 కోట్లు అవసరం. -
కాంగ్రెస్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా.. రుణమాఫీ
[ 27-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేకహోదా వస్తుందని, రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ అవుతుందని; పోలవరం, అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతుందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెప్పారు. -
గురువులపై కక్షగట్టి
[ 27-04-2024]
వైకాపా పాలనలో గురువులపై ఒత్తిడి పెరిగింది. పాఠాలు చెప్పడంతోనే వారి బాధ్యత తీరిపోలేదు. యాప్లో అటెండెన్స్ ఆలస్యంగా వేసినా, ఏదైనా ప్రధాన కారణం చేత స్పాట్ వాల్యుయేషన్కు హాజరు కాకపోయినా, బయోమెట్రిక్ వాడకపోయినా సంజాయిషీ తాఖీదు తప్పదు. -
సర్వే అన్నారు.. భూవిస్తీర్ణం తగ్గించారు
[ 27-04-2024]
భూ సంబంధిత సమస్యలన్నింటినీ శాశ్వతంగా పరిష్కరించడంతోపాటు వివాదాలు తలెత్తకుండా హద్దులు ఏర్పాటు చేసి అందరికీ మళ్లీ భూహక్కు పత్రాలు అందిస్తాం. దీని కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగిస్తున్నాం. -
ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపుతా
[ 27-04-2024]
ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజాప్రతినిధులను రీకాల్ చేసే విధానం రావాలని, పశ్చిమ నియోజకవర్గంలో ముస్లింలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని కేంద్ర మాజీ మంత్రి, ఎన్డీయే కూటమి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. -
విజయవాడ ఎంపీ బరిలో 19 నామినేషన్ల ఆమోదం
[ 27-04-2024]
విజయవాడ లోక్సభ స్థానానికి సంబంధించి నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. సక్రమంగా ఉన్న 19 నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. వివిధ కారణాలతో 15 నామినేషన్లను తిరస్కరించినట్టు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు