సర్వే అన్నారు.. భూవిస్తీర్ణం తగ్గించారు
భూ సంబంధిత సమస్యలన్నింటినీ శాశ్వతంగా పరిష్కరించడంతోపాటు వివాదాలు తలెత్తకుండా హద్దులు ఏర్పాటు చేసి అందరికీ మళ్లీ భూహక్కు పత్రాలు అందిస్తాం. దీని కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగిస్తున్నాం.
గందరగోళంగా జగనన్న శాశ్వత భూహక్కు - భూరక్ష
భూమికి హద్దులు ఏర్పాటు చేస్తున్న సిబ్బంది
భూ సంబంధిత సమస్యలన్నింటినీ శాశ్వతంగా పరిష్కరించడంతోపాటు వివాదాలు తలెత్తకుండా హద్దులు ఏర్పాటు చేసి అందరికీ మళ్లీ భూహక్కు పత్రాలు అందిస్తాం. దీని కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగిస్తున్నాం. ఈ ప్రక్రియ పూర్తయితే భూ సమస్యలే ఉండవు
సీఎం జగన్మోహన్రెడ్డితోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పిన మాటలు ఇవి.
ఏం సర్వేనో ఏమో...మా దస్తావేజుల్లో ఉన్న భూములు కంటే తగ్గించి ఇవిగో పత్రాలు అంటున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఇదిగో డిప్యూటీ తహసీల్దారును పంపిస్తున్నాం. సమస్య పరిష్కరిస్తారు అని చెప్పడమే తప్ప ఇంతవరకు పట్టించుకున్న దాఖలాలు లేవు.
ఇది రైతుల ఆవేదన
మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్టుడే: ప్రభుత్వం చేపట్టిన భూహక్కు...భూరక్ష పథకం అమల్లో తలెత్తుతున్న సమస్యలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే క్రమంలో చూపుతున్న నిర్లక్ష్యం కారణంగా పలువురు రైతులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయడంతోపాటు స్పందనలో అర్జీలు కూడా అందజేశారు. అయినా వారి గోడు పట్టించుకున్న వారు లేరు.
కొందరికే పత్రాలు
బందరు, పెడన నియోజకవర్గాల్లోని మండలాల్లో మూడు విడతలుగా పలు గ్రామాలను ఎంపిక చేసి సర్వే పూర్తి చేసినా అందరికీ భూహక్కు పత్రాలు పంపిణీ చేయలేదు. బంటుమిల్లి మండలంలోని కొర్లపాడు, రామవరపుమోడి, సాతులూరు, బర్రిపాడు, పెద పాండ్రాక, మద్దేటిపల్లిలోసర్వే పూర్తి చేయగా కొర్లపాడులో మాత్రమే భూహక్కు పత్రాలు పంపిణీ చేశారు. గూడూరు మండలంలో మొత్తం 10 గ్రామాల్లో సర్వే పూర్తి చేయగా ఇప్పటివరకు 5 గ్రామాల్లో మాత్రమే పూర్తిస్థాయిలో భూహక్కు పత్రాలు పంపిణీ చేశారు. కృత్తివెన్ను మండలంలో కొమళ్లపూడి, నీలిపూడి, ఎండపల్లి, మాట్లాం, చందాల, గరిశపూడి, తాడివెన్ను గ్రామాల్లో సర్వే పూర్తి చేయగా ఇక్కడ కూడా పూర్తిస్థాయిలో పత్రాలు పంపిణీ జరగకపోగా వివిధ సమస్యలు కూడా పరిష్కరించలేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. బందరు మండలంలోని పొట్లపాలెం, కొత్తపూడి గ్రామాల్లో సర్వే పూర్తి చేసినా హుస్సేన్పాలెంలో ఇంకా 13వ నోటిఫికేషన్ జారీ చేయకపోవడంతో ప్రక్రియ ఆగిపోయింది. పెడన మండలంలోని వివిధ గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
ఫిర్యాదులకు పరిష్కారం ఏదీ?..
సర్వే పూర్తయిన గ్రామాల్లో ప్రజల నుంచి వస్తున్న అభ్యంతరాలను అధికారులు పట్టించుకోవడం లేదని వివిధ ప్రాంతాల ప్రజలు వాపోతున్నారు. బందరు మండలం పొట్లపాలెంలో నెలకొన్న సమస్యలపై ఇప్పటికీ పలువురు తమ సమస్యలపై అదికారులకు అర్జీలు అందిస్తూనే ఉన్నారు.ఇటీవల కూడా ఆ గ్రామానికి చెందిన వారు కలెక్టరేట్లో నిర్వహించిన స్పందనలో అర్జీ అందించి నిరసన తెలియజేశారు. బంటుమిల్లి మండలంలోని పలువురు రైతులు సర్వే అనంతరం తమ భూమి విస్తీర్ణం తగ్గిందని అధికారులకు ఫిర్యాదు చేశారు. పెడన మండల పరిధిలోని కమలాపురం, కొంగంచర్ల తదితర గ్రామాల్లో రైతులు కూడా ఇదే సమస్యలతో ఆందోళన చెందుతున్నారు. కొన్ని చోట్ల భూ యజమానులు లేకుండానే వారి కుటుంబ సభ్యులో తెలిసినవాళ్లనో పిలిచి హద్దులు ఏర్పాటు చేసేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
48 సెంట్లు తగ్గింది
మా కుటుంబ సభ్యుల్లో ఒకరికి తొమ్మిది ఎకరాలకుపైగా వ్యవసాయభూమి ఉంటే సర్వే అనంతరం 48 సెంట్లు తగ్గింది. అదేంటి అంత విస్తీర్ణం తగ్గిందని అధికారులను అడిగితే ఇంతవరకు స్పందించిన దాఖలాలు లేవు. ఇదిగో వస్తాం మళ్లీ కొలతలు వేస్తామని కొందరు అంటుంటే, ఇంకొంతమంది సిబ్బంది ఎకరానికి 5సెంట్లు తగ్గడం సాధారణమే మీకున్న భూమి అంతే అని చెబుతున్నారు. ఏం చేయాలో తెలియడం లేదు.
రైతు, సాతులూరు, బంటుమిల్లి మండలం
సమస్య పరిష్కరించ లేదు
మాకున్న భూమిలోని ఓ సర్వే నెంబర్లో ఎకరం లోపు భూమి 26 సెంట్ల విస్తీర్ణం తగ్గించి హద్దులు ఏర్పాటు చేసి వెళ్లిపోయారు. అదేమని అడిగితే అధికారులు మాట్లాడడం లేదు. పలుమార్లు వచ్చి పొలం పరిశీలించి వెళ్లారు. మిగిలిన భూమి అప్పగించలేదు. సర్వే నెంబరులో ఉన్న భూమి మొత్తాన్ని కొలతలు వేసి మాది మాకు కేటాయించాలని కలెక్టరేట్లో కూడా అర్జీ అందించాం. అయినా సమస్య పరిష్కారం కాలేదు.
రైతు, పొట్లపాలెం, బందరు మండలం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటి వద్దే ఓటు వినియోగం
[ 08-05-2024]
మంచం పట్టిన పండుటాకులు, దివ్యాంగులకు ఎన్నికల కమిషన్ ఊతమిచ్చింది. ఇంటి వద్దే ఓటు హక్కు (హోమ్ ఓటింగ్) వినియోగించుకునే అవకాశం కల్పించింది. బారులు తీరే జనం మధ్య.. మండే ఎండల్లో పోలింగ్ కేంద్రాలకు వెళ్లే పరిస్థితిని తప్పించింది. -
‘జగన్ క్రైస్తవుల పాలిట సైతాన్’
[ 08-05-2024]
సీఎం జగన్ క్రైస్తవులను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని.. క్రైస్తవులను నమ్మించి మోసం చేసి.. వారి పాలిట సైతాన్లా మారారని తెదేపా క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఈటె స్వామి దాస్ విమర్శించారు. -
బొండా ఉమాపై మైక్లో అసత్య ప్రచారం
[ 08-05-2024]
ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకున్న సెంట్రల్ వైకాపా అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు.. ఎన్డీయే కూటమి సెంట్రల్ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావుపై వ్యక్తిగత ఆరోపణలతో మైక్ ప్రచారం ప్రారంభించారు. -
డబ్బులు పంచుతూ.. స్టిక్కర్లు అంటిస్తూ..
[ 08-05-2024]
ఇంటింటికీ ప్రచారం పేరుతో వైకాపా స్టిక్కర్లు అంటిస్తూ గుట్టుచప్పుడు కాకుండా నగదు పంపిణీ చేస్తున్న వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తెదేపా నాయకులపైనే వైకాపా నాయకులు తప్పుడు కేసులు బనాయించారు. -
ఆగని ఇసుక అక్రమ రవాణా
[ 08-05-2024]
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా ఇసుకాసురుల ధన దాహానికి అంతు లేకుండా పోతోంది. అధికారుల ఆదేశాలు బేఖాతర్ చేస్తూ.. ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. -
‘గుడివాడకు పట్టిన పీడ కొడాలి’
[ 08-05-2024]
గుడివాడకు పట్టిన పీడ కొడాలి నానీ అని.. ఆ పీడ అతి త్వరలో విరగడ అవుతుందని తెదేపా రాష్ట్ర విద్యార్థి విభాగం అధికార ప్రతినిధి పొట్లూరి దర్షిత్ అన్నారు. స్థానిక తెదేపా కార్యాలయం ప్రజా వేదికలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. -
దుమ్ము దుమారమే!
[ 08-05-2024]
గత కొన్ని రోజులుగా మండుతున్న ఎండలకు జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా ఆకాశంలో మేఘాలు కమ్మేసి, గాలి దుమారం చెలరేగి, రోడ్లను దుమ్ము ధూళి ముంచెత్తింది. -
యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన.. పట్టించుకోని అధికారులు
[ 08-05-2024]
నందిగామలో నిబంధనలకు విరుద్ధంగా ప్రతి ఇంటికి వైకాపా స్టిక్కర్లు అంటిస్తున్నా... ఎన్నికల అధికారులు పట్టించుకోవట్లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్