మోసాలు.. బయటికొస్తున్నాయ్..
అచ్చు ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చినట్లే నియామక పత్రం.. ఐడీ కార్డు.. సర్వీసు రిజిస్టర్.. లాగిన్ ఐడీ.. ఎక్కడా అనుమానం రాకుండా ప్రభుత్వ కార్యాలయంలోనే శిక్షణ.
ప్రభుత్వ ఉద్యోగులతో రేఖాశ్రీ కుమ్మక్కు రి నకిలీ ఎస్ఆర్లతో నిరుద్యోగులకు టోపీ
నకిలీ సర్వీస్ పుస్తకం
ఈనాడు, అమరావతి,న్యూస్టుడే, సూర్యారావుపేట : అచ్చు ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చినట్లే నియామక పత్రం.. ఐడీ కార్డు.. సర్వీసు రిజిస్టర్.. లాగిన్ ఐడీ.. ఎక్కడా అనుమానం రాకుండా ప్రభుత్వ కార్యాలయంలోనే శిక్షణ.. నెలానెలా ఠంఛనుగా బ్యాంకు ఖాతాలో జీతం.. కళ్ల ముందే అన్నీ కనిపిస్తుండడంతో నిజమే అని నిరుద్యోగ యువత నమ్మారు. రూ.లక్షల్లో డబ్బు ముట్టజెప్పి చేరారు. చివరకు వ్యవహారం తిరగబడడంతో అవాక్కయ్యారు. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు అంటూ పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువతను మోసం చేసిన రేఖాశ్రీ లీలలు వెలుగులోకి వస్తున్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి నుంచి రూ.కోట్లలో డబ్బులు తీసుకుని మోసం చేసిన కేసులో సూర్యారావుపేట పోలీసులు ఆమెను శనివారం అరెస్టు చేశారు. నిందితురాలిపై వివిధ జిల్లాల్లోని పోలీసుస్టేషన్లలో 11 కేసులు ఉన్నట్లు తేలింది.
నియామక పత్రంతో పాటే సర్వీసు రిజిస్టర్
శిక్షణలో చేరిన సమయంలోనే నిందితురాలు అసలుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండే సర్వీసు రిజిస్టర్ను కూడా అభ్యర్థుల ఇళ్లకు పోస్టులో పంపించింది. ఇందులో సంబంధిత వ్యక్తికి సంబంధించి అన్ని వివరాలను పొందుపర్చి తయారు చేసింది. వేలిముద్రలు, హోదా, జీతం, ఉద్యోగంలో నియమితులైన తేదీ, తదితర అన్ని వివరాలు ఇందులో ఉన్నాయి. దీంతో నిజమే అని నిరుద్యోగులు నమ్మారు. కానీ సర్వీసు రిజిస్టర్ను ఇంటికి పంపడంపై కొంత మంది నిందితురాలిని ప్రశ్నించారు. ఎస్ఆర్ అనేది పై అధికారి వద్ద ఉంటుంది కదా.. మాకు ఎందుకు పంపించారు? అని అడిగారు. ఉన్నతాధికారి వద్ద కూడా ఉంటుంది.. మీకు డూప్లికేట్ కాపీ ఇస్తున్నాం.. ప్రభుత్వ ఉద్యోగంలో చేరామని మీకు భరోసా కల్పించేందుకు ఇచ్చానని ఆమె నమ్మించింది. ప్రభుత్వ ఉద్యోగుల వెబ్సైట్ అని భ్రమింపజేసేలా దీనిని కూడా సొంతంగా తయారు చేయించినట్లు బయటపడింది. ఇందులో లాగిన్ అయ్యేందుకు ప్రతి ఒక్కరికి లాగిన్ ఐడీ, పాస్వర్డ్ కూడా ఇచ్చింది. ఇందులో ఉద్యోగుల పేరు, చిరునామా, పనిచేసే కార్యాలయం, ఫొటో, సంతకం, తదితర వివరాలు పొందుపర్చింది. ఇంత పకడ్బందీగా రేఖాశ్రీ వెనుక పెద్ద ముఠా ఉండి ఉంటుందని అనుమానిస్తున్నారు. మోసపోయిన నిరుద్యోగులు తాము చెల్లించిన డబ్బును తిరిగి ఇవ్వమని అడిగితే నిందితురాలు నిరాకరిస్తోంది. తన వద్ద డబ్బులేదని, ఏమీ చేయలేనని, అవసరమైతే జైలుకైనా వెళ్తానని సమాధానం ఇవ్వడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ప్రస్తుతం 15 మంది వరకు బాధితులు సూర్యారావుపేట పోలీసులను ఆశ్రయించారు. బాధితులు ముందుకు వస్తేనే ఎంత మేరకు మోసం జరిగిందో గుర్తించవచ్చని పోలీసులు చెపుతున్నారు.
పాత పరిచయాలు ఉపయోగించుకుని..
ఒక్కో శాఖలో ఒక్కో ఉద్యోగితో మిలాఖత్ అయి.. వారికి ఎంతో కొంత ముట్టజెప్పి నిరుద్యోగులకు అనుమానం రాకుండా వ్యవహారం అంతా నడిపిస్తుంది. విద్యుత్తు శాఖ, అంగన్వాడీ, రెవెన్యూ.. ఇలా శాఖల్లో కొంత మందితో నిందితురాలు మాట్లాడుకుంది. వారికి డబ్బులు ఇచ్చి ఒప్పించింది. నిరుద్యోగులకు ప్రొబేషన్ కాలంలో వారి కార్యాలయంలోనే నామమాత్రంగా శిక్షణ ఇప్పించింది. ప్రభుత్వ కార్యాలయమే కావడంతో ఎవరికీ అనుమానం రాకుండా ఇదంతా చేస్తుంది. ఉద్యోగం అంటూ వారి నుంచి వసూలు చేసిన మొత్తంలో కొంత సంబంధిత ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చింది. రేఖాశ్రీ గతంలో ఉయ్యూరులో వీఆర్వోగా పనిచేసింది. అప్పటి పరిచయాలతో ఆమెకు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు డబ్బులు తీసుకుని సహకరించారు.తమకు పని ఉండడం లేదని అభ్యర్థులు అడిగితే.. ప్రారంభంలో పెద్ద పనేం ఉండదని నిందితురాలు నమ్మించింది. నిరుద్యోగులకు నకిలీ ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి వారిని ప్రభుత్వ ఉద్యోగుల వద్దకు రేఖాశ్రీ శిక్షణకు పంపించినట్ల పోలీసుల విచారణలో తేలింది. విచారణలో వారు ఈ వ్యవహారం గురించి చెప్పినట్లు సమాచారం. ఈ వ్యవహారాన్ని లోతుగా విచారిస్తే రేఖాశ్రీకి సహకరించిన ప్రభుత్వ ఉద్యోగులు ఎంత మంది ఉన్నారనేది వెలుగుచూసే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
[ 27-04-2024]
ఉంగుటూరు మండలం ఎలుకపాడులో సర్వే నంబరు 31/1లో 50 మంది దళితులకు అసైన్డ్ భూమి కేటాయించారు. పాసుపుస్తకాలు కూడా అందాయి. వీరిలో నలుగురి వివరాలే ఆన్లైన్ అయ్యాయి. -
ఎంపీ బాలశౌరిపై.. పేర్ని కుతంత్రాలు!
[ 27-04-2024]
జనసేన, తెదేపా, భాజపా కూటమి అభ్యర్థిగా.. మచిలీపట్నం లోక్సభ బరిలో దిగిన.. ఎంపీ బాలశౌరికి జనంలో వస్తున్న ఆదరణను చూసి.. వైకాపా జిల్లా అధ్యక్షుడు పేర్ని నానికి ఓటమి భయం పట్టుకుంది. బాలశౌరిని నేరుగా ఢీకొట్టలేక.. అడ్డదారుల్లో ఓడించాలని తీవ్రంగా కుతంత్రాలు ఆరంభించారు. -
బందరులో ఓ తిక్కసన్నాసి ఉన్నారు: బాలశౌరి
[ 27-04-2024]
విజయం అనేది కష్టపడితే వస్తుంది..ప్రజలకు మేలు చేస్తే ఆశీర్వదిస్తారు.. కానీ బందరులో ఓ తిక్కసన్నాసి ఉన్నారు.. ఓటమి భయం పట్టుకుని తన పేరుతో ఉన్న వ్యక్తులతో నామినేషన్లు వేయించారని ఎమ్మెల్యే పేర్ని నానీని ఉద్దేశించి కూటమి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరి పరోక్షంగా విమర్శించారు. -
113 నామపత్రాలకు ఆమోదం
[ 27-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు దాఖలైన వాటిలో 113 నామపత్రాలు సక్రమంగా ఉన్నట్లు ఎన్నికల అధికారులు నిర్ధారించారు. అన్ని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో శుక్రవారం నామపత్రాలు పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. -
‘ఏ ముఖం పెట్టుకుని ఓట్లడగడానికి వస్తారు’
[ 27-04-2024]
గన్నవరం నియోజకవర్గానికి చెందిన అంబాపురం పంచాయతీ నగరానికి చేరువుగా ఉన్నా.. అభివృద్ధి జాడ మాత్రం కన్పించడం లేదు. అంతరవలయ రహదారికి ఒకవైపు నగరపాలకసంస్థ అందమైన రహదారులతో, తాగునీరు, కాలువలతో సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంటే.. -
తలపడలేక.. తొండాట!
[ 27-04-2024]
సారూప్యం ఉన్న పేర్లతో నామినేషన్ల జిమ్మిక్కులు.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి ప్రత్యర్థికి నష్టం కలిగించే ఎత్తుగడలు.. అసంబద్ధ ఫిర్యాదులు.. ఇలా ఎన్నో వ్యూహాలు.. ఎత్తుగడల మధ్య నామినేషన్ల పరిశీలన క్రతువు ముగిసింది. -
మిగులు పనుల పూర్తికి ఐదేళ్లా..!
[ 27-04-2024]
తెదేపా హయాంలో కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో యాజమాన్యం వారు సొంత నిధులు వెచ్చించి వంతెన నిర్మించారు. కొన్ని పనులు మిగిలిపోయాయి. వాటిని పూర్తి చేయడానికి ఇంకా రూ.2.50 కోట్లు అవసరం. -
కాంగ్రెస్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా.. రుణమాఫీ
[ 27-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేకహోదా వస్తుందని, రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ అవుతుందని; పోలవరం, అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతుందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెప్పారు. -
గురువులపై కక్షగట్టి
[ 27-04-2024]
వైకాపా పాలనలో గురువులపై ఒత్తిడి పెరిగింది. పాఠాలు చెప్పడంతోనే వారి బాధ్యత తీరిపోలేదు. యాప్లో అటెండెన్స్ ఆలస్యంగా వేసినా, ఏదైనా ప్రధాన కారణం చేత స్పాట్ వాల్యుయేషన్కు హాజరు కాకపోయినా, బయోమెట్రిక్ వాడకపోయినా సంజాయిషీ తాఖీదు తప్పదు. -
సర్వే అన్నారు.. భూవిస్తీర్ణం తగ్గించారు
[ 27-04-2024]
భూ సంబంధిత సమస్యలన్నింటినీ శాశ్వతంగా పరిష్కరించడంతోపాటు వివాదాలు తలెత్తకుండా హద్దులు ఏర్పాటు చేసి అందరికీ మళ్లీ భూహక్కు పత్రాలు అందిస్తాం. దీని కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగిస్తున్నాం. -
ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపుతా
[ 27-04-2024]
ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజాప్రతినిధులను రీకాల్ చేసే విధానం రావాలని, పశ్చిమ నియోజకవర్గంలో ముస్లింలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని కేంద్ర మాజీ మంత్రి, ఎన్డీయే కూటమి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. -
విజయవాడ ఎంపీ బరిలో 19 నామినేషన్ల ఆమోదం
[ 27-04-2024]
విజయవాడ లోక్సభ స్థానానికి సంబంధించి నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. సక్రమంగా ఉన్న 19 నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. వివిధ కారణాలతో 15 నామినేషన్లను తిరస్కరించినట్టు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు