logo

తమ్ముళ్లూ.. మీరే మా బలం

పోరాట పటిమ చూపి రానున్న ఎన్నికల్లో తెదేపా విజయానికి కృషి చేయాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు.

Published : 29 Mar 2024 04:14 IST

పార్థసారథి కుటుంబ సభ్యులతో  భువనేశ్వరి. పక్కనే మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ తదితరులు

కానూరు, న్యూస్‌టుడే : పోరాట పటిమ చూపి రానున్న ఎన్నికల్లో తెదేపా విజయానికి కృషి చేయాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. చంద్రబాబు అక్రమ అరెస్టు తట్టుకోలేక వేదనకు గురై కానూరులో గత సంవత్సరం గుండెపోటుతో మరణించిన పార్థసారథి కుటుంబ సభ్యులను గురువారం భువనేశ్వరి పరామర్శించారు. పార్థసారథి చిత్రపటానికి నివాళులు అర్పించారు. చంద్రబాబు భరోసా పత్రాన్ని బాధిత కుటుంబ సభ్యులకు అందించారు. పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పార్టీకి కార్యకర్తలే బలమన్నారు. ప్రతి ఒక్కరూ తోటి వారితో కూడా తెదేపాకు ఓట్లు వేయించాలన్నారు. చంద్రబాబునాయుడితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో తెదేపా జిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు, పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఎమ్మెల్యే బోడేప్రసాద్‌, నాయకులు వెలగపూడి శంకరబాబు, అనుమోలు ప్రభాకరరావు, కోయ ఆనంద్‌, కణజం వెంకటేశ్వరరావు, ఉప్పులూరి బన్నీ, షేక్‌బుజ్జి, అంగిరేకుల మురళి తదితరులు పాల్గొన్నారు.

తెదేపా శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న భువనేశ్వరి

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని