ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సమీక్ష
ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 8న భారత ప్రధాని నరేంద్రమోదీ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా డీకే బాలాజీ తెలిపారు.
గన్నవరం గ్రామీణం, న్యూస్టుడే: ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 8న భారత ప్రధాని నరేంద్రమోదీ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా డీకే బాలాజీ తెలిపారు. ప్రధాని పర్యటనపై విమానాశ్రయ ఉద్యోగులు, వివిధ శాఖలతో ఆయన ఆదివారం సమీక్ష నిర్వహించారు. ప్రధాని పర్యటనలో విధులు నిర్వహించే శాఖలకు పలు సూచనలు చేశారు. నిబంధనల మేరకు కాన్వాయ్, జిల్లా పరిధిలో పర్యటన ఏర్పాట్ల గురించి వివిధ శాఖల తొలుత ఉన్నతాధికారులతో సమాలోచనలు చేశారు. విమానాశ్రయంలో లైఫ్ సపోర్ట్ వైద్య సదుపాయాలు, గన్నవరం సీహెచ్సీ, డా.పిన్నమనేని వైద్యశాలలో అత్యవసర వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలన్నారు. వీఐపీ లాంజ్, విద్యుత్తు సదుపాయం, ఇతర వసతుల కల్పన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. బుధవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకోనున్న ప్రధాని మోదీ.. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ బయలుదేరి వెళ్తారు. విజయవాడ పర్యటన ముగించుకున్న అనంతరం తిరిగి విమానాశ్రయం చేరుకొని ప్రత్యేక విమానంలో దిల్లీ బయలుదేరి వెళ్తారని పేర్కొన్నారు. డీఎంహెచ్వో గీతాభాయ్, ఆర్డీవో పద్మావతి, తహసీల్దార్ పవన్కుమార్, ఏపీడీ ఎమ్ఎల్కే.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు