logo

తెదేపాతోనే మహిళల సంక్షేమం

మహిళలు అభివృద్ధి పథాన నడవాలన్నా, వారు సంక్షేమాన్ని సమర్థంగా అందుకోవాలన్నా తెదేపాతోనే సాధ్యం అవుతుందని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు.

Published : 02 May 2024 03:42 IST

మహిళలకు అభివాదం చేస్తూ ఓటు అడుగుతున్న పయ్యావుల కేశవ్‌

కూడేరు(ఉరవకొండ), న్యూస్‌టుడే: మహిళలు అభివృద్ధి పథాన నడవాలన్నా, వారు సంక్షేమాన్ని సమర్థంగా అందుకోవాలన్నా తెదేపాతోనే సాధ్యం అవుతుందని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ఆయన కూడేరు మండలం చోళసముద్రం, జయపురం, కడదరకుంట, కూడేరు, అరవకూరు తదితర గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు. తెదేపా మేనిఫెస్టోలో మహిళల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చిన అంశాలను ఆయన వివరించారు. రైతులకు, కార్మికుల సంక్షేమానికి పెద్ద పీట వేయడానికి తెదేపా కట్టుబడి ఉందన్నారు. వైకాపా ప్రభుత్వం పథకాల్లో కోతలు విధిస్తూ పేదలను ఇబ్బందులకు గురి చేసిందన్నారు. స్థానిక వైకాపా నాయకులు ఐదేళ్లలో కనీసం తాగునీటి సమస్య తీర్చలేక పోయారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో కూడేరు మండలంలోని చెరువులకు కృష్ణా జలాలు అందించామన్నారు. ఈ ప్రభుత్వం నీరందించడంలో విఫలమైందన్నారు. ఎన్నికల్లో తెదేపాను గెలిపిస్తూ తనకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో నాయకులు శ్రీధర్‌ చౌదరి, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు